శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతుల వారు శ్రీ అమ్మవారి దర్శనార్థము ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన న్యాయ మూర్తి దంపతుల వారికి శ్రీ
శ్రీ అమ్మవారి దర్శనం కల్పించడం జరిగినది.
శ్రీ అమ్మవారి దర్శనానంతరం ఆలయ వేదపండితులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతుల వారికి వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి వస్త్రములు, చిత్రపటం మరియు ప్రసాదములు అందజేయటము జరిగినది.
addComments
Post a Comment