మరో వారంరోజుల్లో జీన్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు



*వైద్య ఆరోగ్యశాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్, నాడు–నేడుపై  క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


అమరావతి (ప్రజా అమరావతి);

*వ్యాక్సినేషన్, కోవిడ్‌ తాజా పరిణామాలపై సీఎంకు వివరాలందించిన అధికారులు*


*ఒమిక్రాన్‌ వేరియెంట్‌ నేపధ్యంలో తీసుకుంటున్న చర్యలను తెలిపిన అధికారులు*

ఎయిర్‌పోర్టుల్లో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తున్నామన్న అధికారులు

ఒమిక్రాన్‌ నేపథ్యంలో ఆంక్షలు

మరో వారంరోజుల్లో జీన్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటు


ఫీవర్‌ సర్వే కొనసాగిస్తున్నామన్న అధికారులు 

ప్రస్తుతం 32వ దఫా ఫీవర్‌ సర్వే కొనసాగుతుందన్న అధికారులు 


రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ యాక్టివ్‌ కేసులు 1912 

రికవరీ కేటు 99.21 శాతం

డెయిలీ పాజిటివిటీ రేటు 0.52 శాతం

104 కాల్‌సెంటర్‌కు ఇన్‌ కమింగ్‌ కాల్స్‌ 718


*థర్డ్‌ వేవ్‌ సన్నద్దత*

రాష్ట్ర వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ పడకలున్న ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు

69 ఆస్పత్రుల్లో ఏర్పాటుకు నిర్ణయం, 43 ఆస్పత్రుల్లో ఇప్పటికే పీఎస్‌ఏ ప్లాంట్లు ఏర్పాటు

అందుబాటులో ఉన్న మొత్తం ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ 23457

డీ టైప్‌ ఆక్సిజన్‌ సిలిండర్లు 27,311

రాష్ట్ర వ్యాప్తంగా  ప్రభుత్వ ఆస్పత్లుల్లో 109 ప్రాంత్లాలో ఏర్పాటు కానున్న ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్ల సంఖ్య 144 

144 పీఎస్‌ఏ ప్లాంట్లకు గానూ, ఇంతవరకు 121 చోట్ల పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటు పూర్తయిందన్న అధికారులు 

ప్రభుత్వాసుపత్రుల్లో ఈనెలాఖరు నాటికి 144 పీఎస్‌ఏ ప్లాంట్లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు


*వ్యాక్సినేషన్‌*

సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 1,09,93,039 మంది

రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్నవారు 2,66,78,502 మంది

మొత్తం వ్యాక్సినేషన్‌ చేయించుకున్నవారు 3,76,71,541 మంది

వ్యాక్సినేషన్‌ కోసం ఉపయోగించిన మొత్తం డోసుల సంఖ్య 6,43,50,043


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలి : అధికారులకు సీఎం ఆదేశం

కేంద్రంతో సమన్వయం చేసుకుని జవనరిలోగా నిర్దేశించిన వయస్సుల వారందరికీ కూడా డబుల్‌ డోస్ ‌ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న  సీఎం 

వ్యాక్సినేషన్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయడమే కోవిడ్‌నివారణలో ఉన్న పరిష్కారమన్న సీఎం


*విలేజ్, అర్బన్‌ క్లినిక్స్‌ నిర్మాణం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాడు– నేడు పనుల ప్రగతిని సమీక్షించిన సీఎం*


నాడు – నేడు కింద చేపడుతున్న ఏ కార్యక్రమమైనా గతానికీ, ఇప్పటికీ తేడా స్పష్టంగా కనిపించాలి: సీఎం

గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందో... ఫొటోగ్రాఫ్‌లను చూపాలి: సీఎం


కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

ఎప్పటికప్పుడు సమీక్షచేసుకుంటూ త్వరితగతిన పనులు  పూర్తిచేయాలన్న సీఎం


*ఆరోగ్యశ్రీపైనా సమీక్ష*

ఆరోగ్య శ్రీ సేవలు ఏ ఆస్పత్రిలో దొరుకుతాయనే విషయమై అందరికీ అవాగాహన కల్పించాలి : 

గ్రామ సచివాలయాల్లో దీనికి సంబంధించిన హోర్డింగ్స్‌ పెట్టాలి :

ఆరోగ్య శ్రీ సేవలందాలంటే ఎక్కడకు వెళ్లాలన్నదానిపై వారికి అందుబాటులోనే సమాచారం ఉండాలి :

ఇందుకు విలేజ్‌ క్లినిక్‌ అనేది రిఫరల్‌ పాయింట్‌ కావాలి :

విలేజ్‌ క్లినిక్స్‌ అందుబాటులోకి వచ్చేంతవరకూ గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎం ఈ బాధ్యత తీసుకోవాలి:

ఏ ఆస్పత్రికి వెళ్లాలి, ఎక్కడ ఆరోగ్య శ్రీ సేవలు లభిస్తాయన్నది స్పష్టంగా తెలియాలి :

దీనిపై లబ్దిదారులకు సరైన సమాచారం, మార్గదర్శకత్వం ఇవ్వాలి : 

108 లో కూడా ఇలాంటి సమాచారం ఉండాలి:

ఇలాంటి సేవలకు కూడా 104ను అభివృద్ధి  చేయాలి :

ఆరోగ్య శ్రీలో రిఫరెల్‌ అన్నది చాలా కీలకమైన విషయం :

ఇది పథకాన్ని మరింత బలోపేతం చేస్తుంది:

అధికారులు దీనిపై దృష్టిపెట్టాలి:


క్యాన్సర్‌ రోగులకు సూపర్‌స్పెషాల్టీ సేవలు అందాలి: సీఎం

మూడు ప్రాంతాల్లో కనీసం మూడు స్పెషాల్టీ ఆస్పత్రులు ఉండాలి: సీఎం

దీనివల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు ఉండదు:

అంతేకాకుండా క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్య శ్రీ కింద చికిత్సలు, ఇతర సేవలు అందాలి:

కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌కాలేజీల్లో సూపర్‌స్పెషాల్టీ సేవలు అందుతాయి:

ఇవి కాకుండా క్యాన్సర్‌ చికిత్సకోసం మరో మూడు సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రుల్లో సేవలు అందాలి:

వీటితో పాటు ఇదివరకే చెప్పిన విధంగా చిన్నపిల్లలకోసం ప్రత్యేకంగా మూడు ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం:


*పటిష్టంగా ఆరోగ్యమిత్ర*

ఆస్పత్రుల్లో పెట్టిన ఆరోగ్య మిత్ర వ్యవస్థను బలోపేతం చేయాలి:

రోగులకు సమర్థవంతంగా సేవలు అందేలా వ్యవస్థ అందాలి:


*సమర్ధవంతంగా 108,104 సేవలు..*

108, 104 వాహనాలు అత్యంత సమర్థవంతంగా ఉండాలని సీఎం ఆదేశం

నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావు ఉండకూడదు: సీఎం

రోగులకు సమర్ధవంతంగా సేవలు అందించడంలో వాహనాల నిర్వహణ కీలకమన్న సీఎం

జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకోవాలి :

ఎప్పటికప్పుడు వాహనాలను మెయింటైనెన్స్‌ చేయాలన్న సీఎం

దీనికోసం బఫర్‌ వెహికల్స్‌ పెట్టుకోవాలన్న సీఎం 

ఆరోగ్య ఆసరా కింద డిశ్చార్జి అయిన రోజునుంచే వారికి డబ్బు అందాలంటూ పునరుద్ఘాటించిన సీఎం.


*మరిన్ని ఆధునిక సేవలకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌...*

విశాఖపట్నంలో కొత్త ఎంఆర్‌ఐ, కాకినాడలో ఎంఆర్‌ఐ, క్యాథ్‌ల్యాబ్, కర్నూలులో క్యాథ్‌ల్యాబ్, పాడేరు, అరుకుల్లో అనస్తీషియా, ఆప్థాలమిక్‌ మరియు ఈఎన్‌టీ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌

దీనికోసం దాదాపు రూ. 37.03 కోట్లు ఖర్చుచేయనున్న ప్రభుత్వం


*ఆరోగ్య శ్రీ – ప్రత్యేక యాప్‌*

సమర్థవంతంగా ఆరోగ్య శ్రీ సేవలు అందించేందుకు ప్రత్యేక యాప్‌

ఇందులో సందేహాలను నివృత్తిచేసే ఏర్పాటూ ఉండాలన్న సీఎం

యాప్‌ను ఆరోగ్య మిత్రలకు ఇవ్వనున్న ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌

వారికి సెల్‌ఫోన్లు సమకూర్చేందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌


*విలేజ్‌ క్లినిక్స్‌*

విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా ఎప్పటికప్పడు గాలి, నీరు, పరిసరాల పరిస్థితులపైన నిరంతరం నివేదికలు రావాలన్న సీఎం

ఈ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న ముఖ్యమంత్రి

కలెక్టర్లు, జేసీలను భాగస్వాములుగా చేయాలన్న సీఎం


*ఎనీమియా నివారణ – ఏపీ ఫస్ట్‌*

రక్త హీనతను నివారించడానికి తీసుకుంటున్న చర్యలను వివరించిన అధికారులు

ఆరు రకాల చర్యలను తీసుకుంటున్నామన్న అధికారులు

రక్త హీనత నివారణా చర్యల్లో దేశంలోనే ఏపీ నంబర్‌ ఒన్‌గా నిలిచిందన్న అధికారులు

75.3 పాయింట్లతో ఇండెక్స్‌లో ప్రథమస్థానంలో నిలిచిందన్న అధికారులు

దేశవ్యాప్తంగా సగటు కేవలం 40.5 శాతమేనన్న అధికారులు

రెండోస్థానంలో ఉన్న మహారాష్ట్రకు వచ్చిన పాయింట్లు 58


అంగన్‌వాడీలు, విలేజ్‌క్లినిక్స్‌ .. వీటన్నింటి ద్వారా రక్తహీనత నివారణా కార్యక్రమాలు చురుగ్గా సాగాలన్న సీఎం

డీ వార్మింగ్‌కు వినియోగించే మందుల నాణ్యతపై అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం

మందులు కచ్చితంగా జీఎంపీ ప్రమాణాలతో ఉండాలన్న ముఖ్యమంత్రి


*సిబ్బంది భర్తీ వేగవంతం చేయాలి*

ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకానికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సీఎం

ఫిబ్రవరి చివరికల్లా మొత్తం ప్రక్రియ ముగుస్తుందన్న అధికారులు

ప్రతి ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య, వైద్యుల సహా సిబ్బంది సంఖ్యపై బోర్డులు కూడా ఉంచాలన్న సీఎం

సిబ్బంది లేకపోవడం వల్ల ఈ సేవలు అందలేదన్న మాటే వినిపించకూడదన్న సీఎం

ఆసత్పుల్లో మౌలిక సదుపాయాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు, తగిన సిబ్బంది ఉంచాలన్న సీఎం

ఈ రెండు అత్యంత ముఖ్యమైన అంశాలని అధికారులకు స్పష్టంచేసిన సీఎం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలపట్ల ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఉండేలా వాటిని తీర్చిదిద్దాలన్న సీఎం

అధికారులు ప్రత్యేక ధ్యాస, శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందన్న సీఎం


*సిబ్బంది భాగస్వామ్యం...*

ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను ప్రజలకు అందించడంలో సిబ్బంది సహకారం, భాగస్వామ్యం చాలా అవసరమన్న సీఎం

ప్రభుత్వ ఉద్దేశాలను, ప్రజలకు సేవలందించడంలో లక్ష్యాలను వారికి వివరించాలన్న సీఎం

వారి సహకారంతో మంచి ఫలితాలు సాధించాలి అధికారులకు  సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ నిర్దేశం.


ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ(వ్యాక్సినేషన్‌ అండ్‌ కోవిడ్‌ మేనేజిమెంట్‌) ఎం రవిచంద్ర, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ ఎస్‌ నవీన్‌ కుమార్, ఏపీఎంస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవి శంకర్, ఏపీవీవీపీ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్, ఇతర  ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments