మూడు వైద్య కళాశాలలు కమ్ ఆసుపత్రులు మరియు 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు నాబార్డు 1392 కోట్ల రూపాయల ఋణం.

 మూడు వైద్య కళాశాలలు కమ్ ఆసుపత్రులు మరియు 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు నాబార్డు 1392 కోట్ల రూపాయల ఋణం.


అమరావతి,22 జనవరి (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని వైయస్సార్ కడప, విజయనగరం,తూర్పు గోదావరి జిల్లాల్లో మూడు నూతన వైద్య కళాశాలలు కమ్ ఆసుపత్రులు నిర్మాణానికి మరియు శ్రీకాకుళం,విజయ నగరం,తూర్పు,పశ్చిమ గోదావరి,ప్రకాశం జిల్లాలోని ఐటిడిఏ ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణానికి నాబార్డు 1392కోట్ల 23లక్షల రూపాయల ఋణం మంజూరు చేసిందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావర్ వెల్లడించారు. నాబార్డు రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ (RIDF)కింద అందిస్తున్న ఈసహాయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యపరమైన సౌకర్యాలు మెరుగు అవడంతో పాటు ముఖ్యంగా గిరిజనులకు సకాలంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.


వైయస్సార్ కడప, విజయ నగరం,తూర్పు గోదావరి జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న మూడు వైద్య కళాశాలలు కమ్ ఆసుపత్రుల్లో మేజర్ ఆపరేషన్ థియేటర్, క్లినికల్ ఓపిడిలు,డయాలిసిస్, బర్న్ వార్డు,క్యాజువాలిటీ వార్డు,స్పెసలైజ్డ్ క్లినికల్ కమ్ సర్జికల్ వార్డు,ఆక్సిజన్ ప్లాంటు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.అదే విధంగా వైద్య విద్యకు సంబంధించి మెరుగైన నాణ్యతా ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించ బడతాయన్నారు.


అదే విధంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా కన్సల్టేషన్ రూమ్లు, ఆయుష్ క్లినిక్, ట్రీట్మెంట్ ప్రొసీజర్ రూమ్, డయాలిసిస్ వార్డు, డయాగ్నస్టిక్ ల్యాబ్స్,ఓటి కాంప్లెక్స్,ఓపిడి మరియు జనరల్,పీడియాట్రిక్, ఆర్థోపెడిక్ వార్డులు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని నాబార్డు సిజియం సుధీర్ కుమార్ జన్నావర్ పేర్కొన్నారు.


ఆంధ్రప్రదేశ్ లో విద్య,వైద్య రంగాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి  నాబార్డు  తగిన తోడ్పాటును అందించడం జరుగుతోందని చెప్పారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యాపరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇప్పటికే చేపట్టి అమలు చేస్తున్న నాడు-నేడు కార్యక్రమానికి నాబార్డు ద్వారా 3వేల 92 కోట్ల రూపాయలు సహాయం అందించడం జరిగిందని  తెలిపారు. ఈనిధులతో  25వేల 648 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మాణం,మరుగు దొడ్లు,తాగునీటి సౌకర్యం వంటి వసతులు కల్పించారు.అలాగే అంగన్ వాడీ కేంద్రాలు, ఇంటిగ్రేటెడ్ అగ్రి ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుకు కూడా నాబార్డు సహాయం అందించడం జరిగిందని నాబార్డు సిజియం సుధీర్ కుమార్ జన్నావర్ చెప్పారు.



Comments