శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి(ప్రజా అమరావతి): గణతంత్ర దినోత్సవ సందర్భముగా ఆలయ పరిపాలనా కార్యాలయము, జమ్మిదొడ్డి నందు దేవస్థానము వారు గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిర్వహించారు. ఈ కార్యక్రమమునకు ఆలయ పాలకమండలి ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు , కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ , పాలకమండలి సభ్యులు శ్రీమతి ఎన్. సుజాత విచ్చేయగా ఆలయ సెక్యూరిటీ అధికారులు గౌరవ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ఛైర్మన్ , కార్యనిర్వహణాధికారి , పాలకమండలి సభ్యులు భారతమాత, జాతిపిత మహాత్మాగాంధీ వారి చిత్ర పటాలకు మంగలవాయిద్యములు,ఆలయ అర్చకుల మంత్రోచ్చరణల మధ్య పూలు, పండ్లు సమర్పించి పూజలు నిర్వహించారు. అనంతరము వీరు SPF సిబ్బంది మరియు దేవస్థాన రక్షణ సిబ్బంది వారి గౌరవ వందనము అందుకుని, జెండా వందనము జేశారు. తదనంతరము స్వాతంత్ర దినోత్సవ విశిష్టత గురించి, స్వాతంత్రోద్యమ నాయకుల గొప్పదనం గురించి ప్రసంగించారు. అనంతరం చిన్నారులకు మరియు దేవస్థానము సిబ్బందికి వీరు స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమములో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరు వార్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ లు, సహాయ కార్యనిర్వహనాధికారులు, పర్యవేక్షకులు, పొలిసు సిబ్బంది వారు, ఇంజినీరింగ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది, మరియు ఇతర దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment