వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

 

అమరావతి (ప్రజా అమరావతి)!


*వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*


 



 వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేకువజామునే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా కుటుంబ సమేతంగా మంత్రి గౌతమ్ రెడ్డి  శ్రీవారిని దర్శించుకున్నారు. ఇల వైకుంఠాన్ని తలపించే విద్యుద్దీప కాంతుల నడుమ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి లడ్డూ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 



Comments