ఏలూరు (ప్రజా అమరావతి);
పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ ప్రసన్న వెంకటేష్ .
బుధవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్ లో బాధ్యతలు తీసుకున్నారు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. గ్రీవెన్స్ పరిస్కారం, గ్రామ ,వార్డు సచివాలయం ద్వారా ప్రతి ఇంటికి సేవలు దించేందుకు కృషి చేస్తానని అన్నారు. నవరత్నాలు , సంక్షేమ కార్యక్రమాలు , రైతుల సంక్షేమం , ధాన్యం కొనుగోలు , ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి , కోవిడ్ మేనేజ్మెంట్ , వ్యాక్సినేషన్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ , గృహ నిర్మాణం పేదలందరికి ఇళ్లు , స్మార్ట్ టౌన్ షిప్, గ్రామీణ ,పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమా లు ప్రధాన్యతా అంశాలని వీటిపై ఎక్కువ దృష్టి పెట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ హిమాన్సు శుక్లా , జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , జయింట్ కలెక్టర్ శ్రీమతి పి. పద్మావతి ,అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డి ఆర్ ఓ వి దేవిడ్ రాజు ,ఏలూరు ఆర్డీవో పనబాక రచన, హౌసింగ్ పి డి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు .
addComments
Post a Comment