వ్యవసాయానికి పాడి తోడు అయితేనే గిట్టుబాటు అయ్యే అవకాశాలు



*అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ప్రారంభం*

*వర్చువల్‌ విధానంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌*.


*అమూల్‌తో రెండు అవగాహన ఒప్పందాలు(ఎంవోయూలు)*

*బాలమృతం, అంగన్‌వాడీ సెంటర్లకు పాల సరఫరాపై అమూల్‌తో ఎంవోయూ*

*క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం*


అమరావతి (ప్రజా అమరావతి);


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..*. 


దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న అమూల్‌ ఎండీ, ఆర్‌ఎస్‌ సోథీ, కైరా మిల్క్‌ యూనియన్‌ ఎండీ అమిత్‌ వ్యాస్, బనస్కాంత మిల్క్‌ యూనియన్‌ ఎండీ సంగ్రామ్‌ చౌదరి, సబర్‌కాంత మిల్క్‌ యూనియన్‌ ఎండీ అనిల్‌ బయాతీలకు ధన్యవాదాలు. 


 ఇవాళ ఒక మంచి పరిణామం, అనంతపురం జిల్లాలో అమూల్‌ సంస్ధ రంగ ప్రవేశం చేసింది. పాలసేకరణ మొదలుపెడుతుంది. ఇది ఒక మంచి శుభవార్త. పాడి ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ, రైతన్నకు మంచి జరుగుతుంది. వ్యవసాయం గిట్టుబాటుకావాలంటే కేవలం దానిమీదే ఆధారపడితే గిట్టుబాటు కాని పరిస్థితులున్నాయి. వ్యవసాయానికి పాడి తోడు అయితేనే గిట్టుబాటు అయ్యే అవకాశాలు



ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ పాల ఉత్పత్తికి, పాడి పెంపుదలకు అమూల్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.


 అమూల్‌నే ఎందుకు అనే అంశాన్ని చూస్తే... అమూల్‌ ప్రపంచంలోనే ఎనిమిదో స్ధానంలో ఉన్న సంస్ధ. దేశంలోనే మొదటిస్ధానంలో ఉంది. పాలుపోస్తున్న అక్కచెల్లెమ్మలే అమూల్‌ యాజమానులు. అందుకే అమూల్‌లో మార్కెట్‌లో ఏ ఇతర ప్రైవేటు డెయిరీ ఇచ్చేదాని కన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేస్తుంది. కొనుగోలు చేయడమే కాకుండా ప్రాససింగ్‌లో అమూల్‌కు అపార అనుభవం ఉంది. 

పాలనుంచి నేరుగా చాక్లెట్లు తయారు చేసే స్దాయికి అమూల్‌ ఎదిగింది. 

ప్రపంచ సంస్థలతో పోటీపడుతోంది. అందుకనే అమూల్‌తో సాటి, పోటీ లేని పరిస్థితుల్లోకి ఆ సంస్ధ ఎదిగింది. ఈ రోజు ప్రపంచంతో పోటీపడుతున్న సంస్ధ ఇది. దీనివల్ల వచ్చే ఇంకో మంచి ఏమిటంటే..

అత్యధిక రేటుకు ఎలాంటి మోసాలు లేకుండా, కల్తీ లేకుండా, దళారులు లేకుండా మంచి రేటు అక్కచెల్లెమ్మలకు ఇస్తోంది.

వచ్చిన లాభాలను కూడా బోనస్‌ రూపంలో ప్రతి ఆరునెలలకోసారి అదే అక్కచెల్లెమ్మలకు తిరిగి వెనక్కి ఇస్తోంది. సహకార రంగంలో ఇంతకన్నా గొప్ప పరిస్థితి ఎప్పుడూ, ఎక్కడా చూడలేం. మన 

రాష్ట్రంలో సహకార రంగాన్ని నీరుగార్చిన పరిస్థితులు ఉన్న నేపధ్యంలో  

అక్కడో, ఇక్కడో ఉన్న కొద్దొ గొప్పో సహకార రంగంలో ఉన్నాయి అంటే ఆవన్నీ  ప్రై వేటు వ్యక్తుల గుప్పిట్లో ఉన్న అన్యాయమైన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సహకార రంగాన్ని నిజంగా సహకారరంగమంటే ఇలా నడుపుతారు, అందులో పాలుపోసే అక్కచెల్లెమ్మలకే లాభాలు వస్తాయి అని చూపించిన పరిస్ధితిదేశం మొత్తంలో అమూల్‌లోనే ఉంది. అందుకే అమూల్‌కు అంత ప్రాధాన్యత ఉంది. 


ఆరు జిల్లాల్లో ఇప్పటికే పాల సేకరణ అమూల్‌చేస్తోంది.

ఇప్పుడు అనంతపురం జిల్లాలోకి వచ్చింది.

ప్రకాశం, చిత్తూరు, కడప, గుంటూరు, ప.గో, కృష్ణా జిల్లాల్లో పాలసేకరణ చేస్తోంది. అమూల్‌ వల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. ఏడవ జిల్లాగా అనంతపురంలో అమూల్‌ అడుగుపెట్టడం వల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరుగుతుంది. నా

పాదయాత్రలో ప్రతి జిల్లాలోనూ పాలు పోసే అక్కచెల్లెమ్మలు, రైతులు వచ్చి వాటర్‌ బాటిల్‌ చూపించేవారు. మార్కెట్‌లో వాటర్‌ బాటిల్‌ ధర రూ.23లు అయితే, లీటరు పాలుకూడా అంతకన్నా తక్కువకే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఇలా అయితే మేం ఎలా బ్రతుకుతామని చెప్పి అడిగేవారు. మినరల్‌వాటర్‌కు ఇచ్చే రేటుకూడా పాలు పోసే రైతుకు, అక్క చెల్లెమ్మకు రాని పరిస్థితి. 

ఈ పరిస్థితిని మార్చడానికి ఈప్రయత్నాలు చేస్తున్నాం. పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి రేటు వచ్చేట్టుగా, ఎటువంటి మోసం, దళారులు లేకుండాఉండే పరిస్థితిని తీసుకుని వచ్చాం.   

అక్కచెల్లెమ్మలకు మంచిచేయాలన్నదే ఉద్దేశం.

అనంతపురం జిల్లాలోకి ఇవాళ అడుగుపెడుతున్నాం. 

అమూల్‌రావడం వల్ల మిగిలిన పాలు సేకరించే డెయిరీలు కూడా పోటీలో లీటరుకు రూ.5 ల నుంచి రూ.20ల వరకూ మేలు జరుగుతోంది. అవే పాలు, అవే పశువులు అమూల్‌ వచ్చిన తర్వాత రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి.. గతంలో ఎందుకు తక్కువ వచ్చాయి అంటే గ్రామస్ధాయిలో మోసాలే కారణం. పాలు పోసిన వెంటనే 

గతంలో వాళ్లు చెప్పిందే క్వాలిటీ, ఇచ్చేదే రేటు పరిస్థితులు ఉండేవి.

అమూల్‌తో పోటీ వల్ల ప్రై వేటు డైరీలు కూడా పాల రేట్లు పెంచక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి చోటా కూడా బీఎంసీలను ఏర్పాటు చేస్తోంది. ఈ పరిస్థితి ఆంధ్రరాష్ట్రంలో కనిపిస్తోంది. 


రాష్ట్రంలో పాలు సేకరించే ప్రతి ప్రాంతంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేస్తోంది. దాదాపుగా 4900 బీఎంసీయీలు, 11,690 ఏఎంసీయూలను కూడా ఏర్పాటు చేస్తోంది. 

అమూల్‌ విస్తరించే కొద్దీ, ప్రతి గ్రామంలోకూడా ఇవన్నీకూడా పెట్టుకుంటూ వెళ్తాం. వీటి వల్ల ఆ అక్కచెల్లెమ్మలు పాలు పోసేటప్పుడు అక్కడకక్కడే.. పాలు పోసిన వెంటనే ఎన్ని లీటర్లు పోశారు, ఎంత ధర వస్తుందనే విషయాన్ని వెంటనే రశీదు కూడా ఇస్తారు. నేరుగా క్వాలిటీ టెస్టింగ్‌చేసే అవకాశం కూడా కనిపిస్తుంది.  మీ కళ్ల ముందే పారదర్శక పద్ధతిలో పాల సేకరణ జరుగుతుంది.


పాలసేకరణలో జరిగే మోసాలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ధ్యాస పెట్టింది. పాల సేకరణ విధానంలో మోసాలు జరగకుండా తనిఖీలు కూడా విస్తృతంగా చేపట్టింది. దీనివల్ల ఇప్పటికే 

పలు ప్రాంతాల్లో 20 కేసులు నమోదు చేసి..  మోసాలను నివారించడానికి అన్ని అడుగులూ ముందుకేశాం. ఇలా పట్టుబడిన కేసుల్లో ప్రైవేటు డెయిరీలు అయితే లీటరుకు 45 పైసలు నుంచి రూ.10.95 వరకు పాడి రైతులకు తక్కువ చెల్లిస్తున్నట్టు వెల్లడైంది. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని, వాళ్లకేదైనా అదనపు ఆదాయం గ్రామంలోనే ఏర్పాటు కావాలని, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడే పరిస్థితి రావడంతో పాటు మెరుగైన అవకాశాలు ఇవ్వాలన్న తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. 

దేవుడి దయతో ఈ కార్యక్రమం వల్ల వాళ్లకు మంచి జరగాలని, మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.  


అనంతరం అనంతపురం జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు.

Comments