అమరావతి (ప్రజా అమరావతి);
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను విలేఖరుల సమావేశంలో రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వివరిస్తూ..........
1.
– రాష్ట్రంలో కోవిడ్ విస్తరణ, తీసుకుంటున్న చర్యలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ
– కోవిడ్ నివారణా చర్యలను మంత్రివర్గానికి వివరించిన అధికారులు.
2.
ఈబీసీ నేస్తానికి కేబినెట్ ఆమోదం
ఈ నెల 25న ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం
ఏడాదికి రూ.15వేలు చొప్పున మూడేళ్లలో రూ.45వేలు
ఈబీసీల్లో 45–60 ఏళ్ల మధ్యనున్న అర్హులైన మహిళలకు వర్తింపు
మొత్తం 3,92,674 మంది మహిళలకు లబ్ది.
రూ.589.01 కోట్లతో ఈబీసీ నేస్తం.
3.
16 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.7880 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం
రూ.3820 కోట్లతో పాత మెడికల్ కాలేజీలు, అనుబంధ ఆస్పత్రులు పునరుద్ధరణ, అభివృద్ధి పనులకు పరిపానలపరమైన అనుమతులకు కేబినెట్ ఆమోదం
4.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
5.
11వ పీఆర్సీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం.
6.
కోవిడ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు
కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదం
వారికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వనున్న ప్రభుత్వం
జూన్ 30 లోగా నియామకాలు చేపట్టాలని నిర్ణయం
7.
జగనన్న స్మార్ట్టౌన్షిప్స్లో 10శాతం స్థలాలు ప్రభుత్వ ఉద్యోగస్తులకు రిజర్వ్
ఫెన్షనర్లకు 5 శాతం స్ధలాలు రిజర్వ్
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న స్మార్ట్టౌన్షిప్
20శాతం రిబేటుతో ప్రభుత్వ ఉద్యోగులకు స్థలాలు
ఈ నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
8.
ఎన్ఎంసీ నిబంధనల మేరకు 8 అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
9.
ఆయుష్ విభాగంలో నేచురోపతి, యోగా డిస్పెన్సరీల్లో 78 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
26 డిస్పెన్సరీల్లో ముగ్గురు చొప్పున 78 పోస్టులు
10.
మున్సిపాల్టీగా మారిన వైయస్సార్ తాడిగడపలో పంచాయతీగా ఉన్నప్పుడు ఉన్న 59 పోస్టులను మున్సిపాల్టీలో బదిలీకి కేబినెట్ ఆమోదం
11.
కర్నూలు జిల్లా డోన్లో బాలికల బీసీ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కాలేజీ, బేతంచర్లలో బాలుర గురుకుల పాఠశాలలకు 58 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
12.
కృష్ణపట్నం పవర్ ప్లాంట్ ఆపరేషనల్ మెయింటైనెన్స్ బాధ్యతలను వేరొకరికి అప్పగించేందుకు అవసరమైన బిడ్డింగ్కు మంత్రిమండలి ఆమోదం.
25 యేళ్ల పాటు ఓ అండ్ ఏం (ఆపరేషనల్ అండ్ మెయింటైనెన్స్) కు ఇవ్వాలని నిర్ణయం
అందులో పనిచేసే జెన్కో ఉద్యోగులను తిరిగి జెన్కోలోకి వచ్చేందుకు వెసులుబాటు.
వరుస నష్టాలు చవిచూస్తున్న కృష్టపట్నం థర్మల్ ప్లాంట్.
కిలోవాట్ కోసం అవుతున్న ఖర్చు రూ.3.14
దాని పక్కనే ఉన్న మరో పవర్ ప్లాంట్లో కి లోవాట్ ఉత్పత్తికి అవుతున్న ఖర్చు రూ.2.34
ఈ నేపధ్యంలో ఆపరేషనల్ ఖర్చులు తగ్గించుకునేందుకు నిర్వహణ హక్కులు వేరొకరికి అప్పగించడానికి ఓ అండ్ ఎం కోసం బిడ్డింగ్కు ఆహ్వానించాలని నిర్ణయం
13.
జనవరి 1, 2022 నుంచి పెన్షన్ను 2,250 నుంచి రూ.2500కు పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
14.
ఏపీఐఐసీ నోడల్ ఏజెన్సీగా ఆటోనగర్లలో ఉన్న భూములను బహుళ అవసరాలకు వినియోగించేకుందుకు అవసరమైన గ్రోత్ పాలసీకి కేబినెట్ ఆమోదం.
15.
ధాన్యం కొనుగోళ్లు కోసం... ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రూ.5వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు కేబినెట్ అనుమతి
రైతుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూసేందుకు నిర్ణయం. ఈ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం.
ఇప్పటివరకు 21.83 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ, 21 రోజుల్లో రైతులకు రూ.2150 కోట్ల చెల్లింపులు.
16.
విశాఖ జిల్లా ఎండాడలో రాజీవ్ గృహ కల్ప ప్రాజెక్టులో నిరుపయోగంగా ఉన్న భూములను హెచ్ఐజీ, ఎంఐజీ కాలనీలకోసం వాడుకునేందుకు కేబినెట్ ఆమోదం.
17.
తిరుపతిలో స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్కు 5 ఎకరాల స్థలం
అకాడమీ పెట్టేందుకు స్థలం ఇస్తూ కేబినెట్ నిర్ణయం
18.
ఆచార్య ఎన్టీరంగా యూనివర్శిటీ పరిధిలో అనకాపల్లిలో రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ ( రార్స్)కు ఉచితంగా భూమి కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం
రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్(రార్స్)కు 50 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ గ్రీన్సిగ్నల్.
19.
ఎండో మెంట్ చట్టం – 1987 కి సవరణలతో ఆర్డినెన్స్ జారీకి కేబినెట్ ఆమోదం
దీనిద్వారా టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి సవరణలు తీసుకురావాలని కేబినెట్ నిర్ణయం.
20.
ఓటీఎస్ ఇళ్లు, టిడ్కో, విశాఖలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్కి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీ మినహాయింపులకు కేబినెట్ ఆమోదం
21.
ఐసీడీఎస్కు బాలమృతం, ఫోర్టిఫైడ్ ఆహారం, తాజా పాలు అమూల్ నుంచి సరఫరాకు కేబినెట్ ఆమోదం
ఏపీడీడీసీఎఫ్ ద్వారా సరఫరా చేయనున్న అమూల్
22.
మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 7 పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం
23.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం తొగరాం గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో 13 పోస్టులు మంజూరుకు ఆమోదం
24.
జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో స్వల్ప మార్పులు చేసిన ప్రభుత్వం
గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం
ఉగాది, దీపావళి రెండు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకు
కేబినెట్ ఆమోదం.
25.
ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రంలో తాజా వ్యవసాయ పరిస్థితులపై మంత్రివర్గసమావేశంలో చర్చ.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ (జీజీఐ)లో ప్రధమ స్ధానంలో నిల్చిన ఆంధ్రప్రదేశ్.
వ్యవసాయరంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశుసంవర్ధకశాఖలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం అభివృద్ధి సాధించిన ఏపీ
దీంతో పాటు క్రాప్ ఇన్సూరెన్స్లో అనుసరించిన వినూత్న విధానాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో మిగిలిన రాష్ట్రాలకు రోల్మోడల్గా నిల్చిందని కేబినెట్లో వివరించిన అధికారులు.
ఉద్యానవనశాఖలో అనుసరించిన వినూత్న విధానాల ఫలితంగా.... అగ్రి పుడ్ ఎంపవరింగ్ ఇండియా అవార్డ్స్ 2020–21 గాను... బెస్ట్ హార్చికల్చర్ స్టేట్ ఇన్ ఇండియా అవార్డును సొంతం చేసుకున్న ఏపీ ఉద్యానవనశాఖ.
2019 –20 తో పోల్చుకుంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) 4.7 శాతం నుంచి 2020–21లో 12.3శాతానికి పెరగిన ఉద్యానవన ఉత్పత్తులు.
26.
కడప, కర్నూలు నుంచి విమానాలు నడిపేందుకు ఇండిగోతో ఒప్పందం.
కడప విమానాశ్రయం నుంచి కడప–విజయవాడ, కడప–చెన్నై, కర్నూలు నుంచి విజయవాడకు వారానికి 4 సర్వీసులు
27 మార్చి నుంచి ఆపరేషన్లు ప్రారంభం.
రాష్ట్ర కేబినెట్ ఆమోదం.
addComments
Post a Comment