న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);
కేంద్రం మంత్రులు అనురాగ్ ఠాకూర్, «ధర్మేంధ్ర ప్రధాన్లతో సమావేశమైన సీఎం శ్రీ వైయస్.జగన్
సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం
ముగిసిన ఢిల్లీలో రెండురోజుల పర్యటన
– ఉదయం కేంద్ర మంత్రి నితిన గడ్కరీతో సమావేశం తర్వాత కేంద్ర సమాచార ప్రసార, క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో సమావేశం.
– ఆర్బీకేలద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పంచే విషయంలో సమాచార ప్రసార శాఖ సహాయ సహకారాలు కోరిన సీఎం.
– రాష్ట్రంలో క్రీడా సముదాయాల అభివృద్ధిపై చర్చించిన సీఎం.
– తర్వాత కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమైన సీఎం శ్రీ వైయస్.జగన్
– గిరిజన విశ్వవిద్యాలయం స్థలం మార్పిడికి అనుమతించినందుకు ధన్యవాదాలు తెలియజేసిన సీఎం.
– సాలూరు సమీపంలో నిర్మించనున్న గిరిజన విశ్వవిద్యాలయం పనులు వెంటనే మొదలుపెట్లాలని కోరిన సీఎం. ఆమేరకు నిధులు విడుదల చేయాలని కోరిన ముఖ్యమంత్రి.
– రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించిన సీఎం.
– నైప్యణ్యాభివృద్ధి కాలేజీల ఏర్పాటుకు సహకరించాలన్న సీఎం.
– రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విద్యాసంస్థల పనులను వేగవంతం చేయాలని కోరిన సీఎం. ఇప్పటికీ చాలా చోట్ల తాత్కాలిక ఏర్పాట్లలో కొనసాగుతున్న విషయాన్ని వివరించిన సీఎం.
– కేంద్ర మంత్రులతో సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సాయంత్రం తిరిగి తాడేపల్లిలో తన నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి.
addComments
Post a Comment