రాష్ట్రంలో 0.82 శాతానికి పడిపోయిన కోవిడ్‌ యాక్టివిటీ కేసుల రేటు



అమరావతి (ప్రజా అమరావతి);

*–కోవిడ్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*–రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వివరించిన అధికారులు.*

– రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణ గణనీయంగా తగ్గిందని, పాజిటివ్‌ కేసులు కూడా గణనీయంగా తగ్గాయని వివరించిన అధికారులు. 

– రాష్ట్రంలో 0.82 శాతానికి పడిపోయిన కోవిడ్‌ యాక్టివిటీ కేసుల రేటు 


– గత వారం సమావేశం నాటికి 1,00,622 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇప్పుడు 18,929కి పడిపోయాయని తెలిపిన అధికారులు.

– ఇందులో ఆస్పత్రిలో చేరిన కేసులు 794 కాగా, ఐసీయూలో ఉన్నవారు కేవలం 130 మంది, వీరిలో కూడా దాదాపుగా కోలుకుంటున్నారన్న అధికారులు

– 794లో 746 మందికి ఆరోగ్యశ్రీద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపిన అధికారులు.


– గత సమావేశం నాటికి డైలీ పాజిటివిటీ రేటు 17.07శాతం కాగా, ప్రస్తుతం డైలీ పాజిటివిటీ రేటు 3.29 శాతం.

– 9,581 సచివాలయాల్లో కేసులు లేవని తెలిపిన అధికారులు

– అన్నిజిల్లాల్లో గణనీయంగా తగ్గిన కేసులు తగ్గాయన్న అధికారులు.


– రాష్ట్రంలో 3,90,83,148 మందికి రెండు డోసులు

39,04,927 మందికి ఒకడోసు మేర కోవిడ్‌ వ్యాక్సిన్లు. 

– మొత్తంగా ఉపయోగించిన వ్యాక్సిన్లు 8,32,55,831 డోసులు

– 45 ఏళ్ల పైబడ్డ వారిలో 96.7 శాతం మందికి రెండుడోసుల వ్యాక్సిన్లు పూర్తి

18–44 ఏళ్ల మధ్యవారిలో 90.07 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు

– ప్రికాషనరీ డోస్‌ల విషయంలో టార్గెట్‌ 15,02,841 కాగా వీరిలో 11,84,608 మంది వ్యాక్సిన్లు

– 15–18 ఏళ్ల వయస్సు మధ్యనున్నవారిలో 24.41 లక్షల మందికి టార్గెట్‌కాగా అందరికీ మొదటి డోసు పూర్తి

– వీరిలో 12.48 లక్షల మందికి రెండో డోసు పూర్తి

*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...:*

– రాత్రిపూట కర్ఫ్యూ తొలగించాలని నిర్ణయం

– మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని నిర్ణయం

– దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిర్ణయం.

– ఫీవర్‌ సర్వే కొనసాగించాలన్న సీఎం

– లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలన్న సీఎం

వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగాలన్న సీఎం


– వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశం

– సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

– ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలన్న సీఎం

– పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలన్న సీఎం


–గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న సీఎం.

– స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేశామన్న అధికారులు.



ఈ సమీక్షా సమావేశానికి ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ మరియు వ్యాక్సినేషన్‌), ఎం రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఏం టీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments