అమరావతి (ప్రజా అమరావతి);
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ను కలిసిన భారత క్రికెట్ అండర్ 19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్.
షేక్ రషీద్ను అభినందించిన సీఎం శ్రీ వైఎస్ జగన్, ప్రభుత్వం తరపున పలు ప్రోత్సాహకాలు, రూ. 10 లక్షల నగదు బహుమతి, గుంటూరులో నివాస స్ధలం కేటాయింపు, ప్రభుత్వం తరపున పూర్తి సహాయసహకారాలు అందిస్తామని హమీ ఇచ్చిన సీఎం..
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరపున ప్రకటించిన రూ. 10 లక్షల చెక్ సీఎం చేతుల మీదుగా అందజేత.
షేక్ రషీద్ స్వస్ధలం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెం.
సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తూ క్రికెట్ లవర్స్ను ఆకట్టుకుంటున్న 17 ఏళ్ళ రషీద్*
టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలోనూ, అండర్ 19 ప్రపంచకప్ను ఐదోసారి గెలవడంలోనూ కీలకపాత్ర పోషించిన రషీద్.
హాజరైన హోంమంత్రి మేకతోటి సుచరిత, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రషీద్ తండ్రి బాలీషా, ద ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, శాప్ అధికారులు.
addComments
Post a Comment