దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి తరుపున పట్టువస్త్రములు సమర్పించిన డి.భ్రమరాంబ

 శ్రీ కాళహస్తి (ప్రజా అమరావతి); మహాశివరాత్రి ఉత్సవములు-2022  సందర్భముగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివార్ల దేవస్థానం, శ్రీకాళహస్తి లోని శ్రీ ప్రసూనాంబిక దేవి సమేత శ్రీ కాళహస్తీశ్వర  స్వామివార్లకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి తరుపున పట్టువస్త్రములు సమర్పించుటకు, ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ


  మరియు అర్చక బృందం శ్రీకాళహస్తి దేవస్థానం చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ డి.పెద్దిరాజు  ఆలయ మర్యాదలతో మంగలవాయిద్యముల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి(శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం) వారు శ్రీ  అమ్మవారు స్వామివార్లను దర్శనము చేసుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం వేదపండితులు వీరికి వేద ఆశీర్వచనము చేయగా, కార్యనిర్వహణాధికారి(శ్రీకాళహస్తి) , శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ వారికి స్వామివార్ల చిత్రపటము, శేషవస్త్రము మరియు ప్రసాదములు అందజేసినారు. ఈ కార్యక్రమములో  ఆలయ ఆలయ వైదిక కమిటీ శ్రీ లింగంబోట్ల దుర్గాప్రసాద్ , వేదపండితులు, అర్చకులు,  మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Comments