భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యడం జరిగింది




పోలవరం (పట్టిసం) (ప్రజా అమరావతి);  


శివరాత్రి సందర్భంగా పట్టిసం ఆలయానికి దర్శనానికి వొచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చెయ్యడం జరిగిందని


జాయింట్ కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ పేర్కొన్నారు. ప్రతి శాఖ వారికి కేటాయించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని, విధుల్లో నిర్లక్ష్యం వ్యవహరించ వద్దని శాసన సభ్యులు తెల్లం బాలరాజు కోరారు.


శనివారం  స్థానిక పట్టిసం గ్రామంలో   శివరాత్రి వేడుకలు నిర్వహణపై సహాయ కలెక్టర్ రాహుల్ కుమార్, ఆర్డీవో ప్రసన్న లక్ష్మీ, ఇతర శాఖల అధికారులు, తదితరులతో జేసి సమీక్ష సమావేశం నిర్వహించారు.  


ఈ సందర్భంగా తెల్లం బాలరాజు మాట్లాడుతూ, పట్టిసం శివరాత్రి అంటే మనకు ప్రత్యేక భక్తి ప్రవర్తులు ఉన్నాయన్నారు.  లక్ష కి పైగా వొచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలన్నారు. మేడారం జాతర కి 20 లక్ష లకి పైగా భక్తులు వొచ్చినా ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చేసారని, అదే తరహాలో ఇక్కడి ఏర్పాట్లు ఉండాలని తెలిపారు.భక్తి శ్రద్ధలతో విధుల్లో భాగస్వామ్యం అవ్వాలన్నారు.


ఈ సందర్భంగా జేసి డా. బీఆర్ అంబేద్కర్ మాట్లాడుతూ, శివరాత్రి సందర్భంగా పట్టిసం లోని భద్ర కాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వద్ద భక్తులకు భద్రత తో కూడి త్వరితగతి  దర్శనం కల్పించాలని సూచించారు.  ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 వరకు అత్యంత జాగ్రత్తగా శివరాత్రి వేడుకలు నిర్వహించనున్నందున రెండు రాత్రులు, ఒక పగలు భక్తుల తాకిడి ని దృష్టిలో పెట్టుకొవాల్సి ఉందన్నారు. కోవిడ్ మార్గదర్శకాలు తూ. ఛా. తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.  పారిశుద్ధ్య పనులు, శానిటేషన్ పనులకు సంబంధించి , చెత్త తోలగింపు కి చర్యలు చేపట్టాలని ఆదేశించారు . జీలుగుమిల్లి, ఆర్ అండ్ ఆర్ కాలనీల నుంచి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం, గుటాల లలో మద్యం షాపులను మూసి ఉంచాలని, అనధికార మద్యం షాపులను గుర్తించి తొలగించాలని తెలిపారు.


 అందుకు అనుగుణంగా దేవస్థానం, పోలీస్, రెవెన్యూ, పంచాయతీ శాఖలు చర్యలు తీసుకోవాలని కోరారు. రేవు వద్ద బోట్స్ రవాణా, పెర్రీ సామర్ధ్యం,  ఫైర్, ఫారెస్ట్, విద్యుత్తు, పంచాయతీ రాజ్,  పోలీసు, ఇరిగేషన్, పోర్ట్, ఆర్.డబ్ల్యూ.ఎస్.  విద్యుత్ తదితర శాఖలు చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు.  విద్యుత్తు సరఫరా లో ఆటంకాలు లేకుండా  రెండు జనరేటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విస్తృతంగా ప్రచారం చేపట్టి భక్తులకు సూచనలు చెయ్యాలని జేసి స్పష్టం చేశారు. ప్రోటోకాల్ విషయం లో ప్రత్యేక అధికారిని నియమించాలన్నారు. పిండ ప్రధాన కార్యక్రమానికి నిర్వహించే పురోహితులు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.


డిఎస్పీ కె.లతాకుమారి మాట్లాడుతూ, దర్శనం సజావుగా జరిగేలా  భక్తులు దర్శనం చేసుకోవడానికి  చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

విధుల్లో 466 మంది పోలీసులను నియమించాము, 6 సెక్టార్ లను ఏర్పాటు చేసుకుని నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 100 అడుగులతో కంపార్టమెంట్స్, క్యూ లైన్స్, కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ క్యూ లైన్స్ క్రమబద్ధీకరణ, ప్రసాదాలు వితరణ ఏర్పాట్లు చేస్తున్నట్లు  తెలిపారు.  ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో  జంగిల్ క్లీయరెన్సు, బ్యార్రికేట్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్టీసీ వారిచే వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులు కోసం ప్రత్యేక తాత్కాలిక బస్ స్టాండ్,  మైక్ అనౌన్స్మెంట్ ద్వారా ప్రయాణికులకు సమాచారం అందచేయ్యడం జరుగుతుంది. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటోలు, ఇతర ప్రజా రవాణా వాహనాలు యజమానులతో సమావేశం నిర్వహించడం ద్వారా అధిక ధరలు వసూలు చెయ్యకుండా అవగాహన కల్పిస్తాము. సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో త్రాగునీరు, ఆహారం, చిన్నారులకు పాలు అందచేయ్యడం జరుగుతుందని తెలిపారు.

 ఆర్టీసీ వారి ద్వారా రాష్ట్రంలో ని పలు ముఖ్య ప్రాంతాలనుంచి, అలాగే కొవ్వూరు/రాజమండ్రి నుంచి పట్టిసం కి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు.  ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు త్రాగునీరు సరఫరా, మరుగుదొడ్లు ఏర్పాటు, అటవీ శాఖ , ఆర్ అండ్ బి జంగిల్ క్లీయరెన్సు చేసినట్లు తెలిపారు. 

ఆలయ ఈవో ఎమ్ ఎస్ శర్మ భక్తులకు చేసిన ఏర్పాట్లు, ఉచిత ప్రసాద వితరణ, లడ్డు ప్రసాదం కౌంటర్, లైటిబిగ్ తదితర వివరాలు తెలిపారు. విద్యుత్తు సరఫరా, త్రాగునీరు,మెడికల్ విభాగం ద్వారా వైద్య శిబిరాలు, అంబులెన్స్, అత్యవసర వైద్య సేవలు, వివరాలు తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీవో వైవి ప్రసన్న లక్ష్మి, డిఎస్పీ కె.లతా కుమారి,  పట్టిసం సర్పంచ్ ఎస్. శ్రీరామ మూర్తి, పాత పట్టిసం సర్పంచ్ ఎమ్. విజయదుర్గా, ఎంపిపి సుంకర వెంకటరెడ్డి,   సంబంధించిన శాఖలు అధికారులు, ఏసీ ఎండోమెంట్ సీహెచ్. చంద్రశేఖర్, తహశీల్దార్ బి. సుమతి, ఎంపీడీఓ సీహెచ్. శ్రీనివాస్ బాబు, సి ఐ కె. విజయబాబు, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి, స్థానిక ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.


Comments