రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన మార్క్ ఫెడ్.. మార్క్ అప్ పేరుతో నిత్యావసర వస్తువుల విక్రయాలు

 


విజయవాడ (ప్రజా అమరావతి);


*రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిన మార్క్ ఫెడ్..* 

*మార్క్ అప్ పేరుతో నిత్యావసర వస్తువుల విక్రయాలు*


*మార్క్ అప్ లోగో, ఉత్పత్తులను ప్రారంభించిన మంత్రి కురసాల కన్నబాబు, ఛైర్మన్ పి. నాగిరెడ్డి*. 

*సీఎం జగన్ రైతు పక్షపాతి... రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది*.

*వ్యవసాయరంగంలో దేశంలో ఏపీ నెంబర్ వన్ : మంత్రి కురసాల కన్నబాబు* 

 

రైతు పండించిన ప్రతి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు అదనంగా ఆదాయం తీసుకురావడం, అదే సమయంలో వినియోగదారుడిని దృష్టిలో పెట్టుకోవాలన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఏపీ మార్క్ ఫెడ్ (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య లిమిటెడ్) వినూత్న నిర్ణయం తీసుకుందని.. మార్క్ ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టడం ద్వారా ప్రభుత్వ విజయాలలో మరో విజయం నమోదయ్యిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. విజయవాడ లెమన్ ట్రీ హోటల్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మార్క్ అప్ ఉత్పత్తులను, లోగోను ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ పి.పి. నాగిరెడ్డితో కలిసి మంత్రి కురసాల కన్నబాబు ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మంత్రితో కలిసి ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, తదితరులు మార్క్ అప్ ఉత్పత్తుల స్టాల్స్ ను పరిశీలించారు. 


అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. రైతుకు అదనపు ఆదాయం కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా అనేక రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. సీఎం జగన్ ఎప్పుడూ రైతుల పక్షపాతి అని.. ఈ ప్రభుత్వంలో 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతో పాటు బత్తాయి, అరటి వంటి పంటలకు కూడా కనీస మద్దతు ధరను ప్రకటించామన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు.  రైతు ఆదాయం తగ్గకుండా.. వినియోగదారుడికి సరసమైన ధరలకు ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురావాలనే మార్క్ ఫెడ్ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఇప్పటికే ఆయిల్ ఫెడ్ లో ‘విజయా బ్రాండ్’ చాలా ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు. నాణ్యతే ప్రామాణికంగా.. రాష్ట్రంలోని ఉన్న 110 రైతు బజార్లు, కొత్తగా నిర్మాణం జరిగిన మరో 50 రైతు బజార్లలో అన్ని చోట్ల మార్క్ అప్ ఉత్పత్తులు లభ్యమయ్యేలా, గ్రామస్థాయి వరకూ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విత్తనం ఇచ్చే దగ్గర నుంచి విక్రయించే వరకు ప్రతి అడుగులోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రైతు పండించే ప్రతి ఉత్పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయ రంగాన్ని  నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత వైఎస్ జగన్ దే అని.. తాజాగా కేంద్రం విడుదల చేసిన ర్యాంకులలో వ్యవసాయరంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. కార్పోరేట్ సంస్థలు లాభాపేక్షతో వ్యాపారంలో ముందుకెళతాయని.. మార్క్ ఫెడ్ నాణ్యతతో ముందుకెళ్తుందన్నారు. కార్పోరేట్ సంస్థలను ఢీకొట్టేలా ప్రభుత్వ రంగ సంస్థ నిర్ణయం తీసుకోవడం అబినందనీయమని మంత్రి కన్నబాబు అన్నారు. 


ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ పి.పి. నాగిరెడ్డి మాట్లాడుతూ... మార్క్ ఫెడ్ ను స్థాపించిన 65 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడిందన్నారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారు. మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన అన్ని ఉత్పత్తులను ప్రొసెసింగ్ చేసి వినియోగదారుడికి అందుబాటులో ఉండేవిధంగా మార్క్ అప్ ఉత్పత్తులు ఉండాలన్నారు. ఎంత పోటీ ఉన్నా నాణ్యతలో రాజీ వద్దన్నారు. 


అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వై. మధుసూధన రెడ్డి మాట్లాడుతూ.. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో వినియోగదారుల కొనుగోలు చేయడానికి అలాగే రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ఇబ్బందులు పడటం చూసి సీఎం జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. సీఎం జగన్ ఆలోచనల మేరకు ఈ కార్యక్రమానికి రెండు సంవత్సరాల క్రితమే అంకురార్పణ జరిగిందన్నారు. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన పంటలను.. కొంతకాలం తర్వాత అమ్మితే కనీస మద్దతు ధర కంటే తక్కువగా వస్తుందని.. అలా వచ్చిన నష్టాన్ని ప్రభుత్వం పూడుస్తుందని తెలిపారు. అలాంటి నష్టాలను సరిదిద్దేందుకు ప్రొసెస్ చేసిన ఉత్పత్తులు అమ్మితే ప్రయోజన చేకూరుతుందన్నారు. ఇప్పటికే 50 యేళ్ల క్రితమే కేరళలో మావెల్లి స్టోర్స్ పేరుతో రిటైల్ మార్కెట్ లోకి ప్రభుత్వ రంగ సంస్థలు అడుగుపెట్టాయన్నారు.  రైతులకు కనీస మద్దతు రావాలి లేదా అంతకంటే ఎక్కువ రావాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 


ఏపీ మార్క్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పి.ఎస్. ప్రద్యుమ్న మాట్లాడుతూ.. మార్క్ అప్ ద్వారా కంది పప్పు, మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, చింతపండు, మిర్చి, పసుపు, ధనియాలు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, మిర్చిపౌడర్, ధనియాల పొడి, రెండు రకాల బియ్యం (రా రైస్, స్టీమ్ రైస్) మొత్తం 12 రకాల ఉత్పత్తులను విడుదల చేస్తున్నామన్నారు. పంజాబ్, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో మార్క్ ఫెడ్ ద్వారా ఉత్పత్తులను అమ్ముతున్నారని.. రాష్ట్ర బృందం కేరళ వెళ్లి అక్కడ పరిస్థితులను పరిశీలన చేసి వచ్చామని తెలిపారు. ఐటీసీ వంటి అంతర్జాతీయంగా పెరొందిన బ్రాండ్స్, లలిత, డబుల్ హర్స్ వంటి స్థానికంగా పెరొందిన బ్రాండ్స్ మధ్యలో మార్క్ ఫెడ్ విడుదల చేసే ఉత్పత్తులు నాణ్యతతో ముందుకెళ్తుందని తెలిపారు. 5లక్షల 36వేల ఫ్యాకెట్ల ఉత్పత్తులను 34 వేల కిరణా షాపులకు ఈ రోజు విడుదల చేస్తున్నామన్నారు. మార్చి మొదటి వారం నుంచి ఉత్పత్తులు అన్ని షాపుల్లో ప్రిమియం, పాపులర్, ఎకానమీ 3 కేటగిరీల్లో అందరికీ అందుబాటులోకి ఉండేలా వస్తాయన్నారు. రైతులు, వినియోగదారులు దృష్టిలో పెట్టుకుని ధరలు తక్కువ, ఎక్కువ కాకుండా న్యాయమైన ధరకే అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. 


ఈ కార్యక్రమంలో హార్టీకల్చర్ కమిషనర్ డా. ఎస్.ఎస్. శ్రీధర్, కోఆరేషన్ అండ్ రిజిస్టార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీసీ కమిషనర్ బాబు ఎ., అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్, సెర్ప్ సీఈవో ఎ. ఎండీ. ఇంతియాజ్, స్థానిక వైసీపీ నేత దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు. 



Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image