తూర్పు పాలెం (ప్రజా అమరావతి);
అక్రమాలకు పాల్పడితే చర్యలు
సహకార సంఘాలు రైతులకు అండగా నిలవాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హెచ్చరించారు.
మంగళవారం తూర్పు పాలెం మంత్రి కార్యాలయంలో నియోజకవర్గం లోని సహకార సంఘాల కార్యదర్శులు, చైర్ పర్సన్ ల తో సమీక్ష నిర్వహించారు. సహకార సంఘాల ఉనికిని కొందరు స్వార్ధపరులు అక్రమాలతో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత ఉన్నత ఆశయాలతో రైతుల కోసం సహకార సంఘాలు ఏర్పాటు చేస్తే వాటి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారు. డాక్యుమెంట్స్ లేకుండా రుణాలు రైతుల ను పేరుతో కొందరు సిబ్బంది తీసుకుంటూ చేతివాటం చూపిస్తున్నారన్నారు. కొన్నేళ్లుగా సహకార సంఘాలలో కోట్లాది రూపాయలు నిధులు దుర్వినియోగం అయినట్లు అధికారులు గుర్తించడం జరిగిందని తెలిపారు. దీనిపై కొన్ని ప్రాంతాల్లో ఎంక్వయిరీ సైతం చేయించడం జరిగిందని వివరించారు. నిర్ణీత డాక్యుమెంట్స్ లేకుండా సిబ్బంది రుణాలు మంజూరు చేస్తున్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. వీటిపై సహకార సంఘ సిబ్బంది సత్వరం స్పందించి ఫిబ్రవరి నెలాఖరులోగా తప్పులు సరిదిద్దు కోకపోతే కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. దేవ, ముల పర్రు, పెనుమంట్ర సొసైటీల్లో అక్రమార్కులను గుర్తించిన నేటి వరకు వారిపై చర్యలు తీసుకోవడం కారణమేమిటని అధికారులను ప్రశ్నించారు. వారి నుంచి కోట్లాది రూపాయలు రికవరీ చేయవలసి ఉన్న నేటి వరకు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రైతులకు ఈ సీజన్లో రూ.80 కోట్లకు పైగా రుణాలు అందించడం జరిగిందని తెలిపారు. కౌలు రైతులకు సహకార సంఘాలు రుణాలు అందించాలని సూచించారు. అదేవిధంగా రైతులకు అవసరమైన ఎరువులు పురుగు మందులు సక్రమంగా అందించాలన్నారు. ఇప్పటికైనా సహకార సంఘ సిబ్బంది సక్రమంగా వ్యవహరించి ఇటువంటి అక్రమాలకు తావివ్వకుండా సంఘాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. సమీక్షలో డిసిసిబి డైరెక్టర్ కునప రెడ్డి ఇ లక్ష్మయ్యనాయుడు, ఎంపీపీ పుతినీడి వెంకటేశ్వరరావు, జెడ్ పి టి సి గుంటూరు పెద్దిరాజు, కడలి గోవిందలు పాల్గొన్నారు
addComments
Post a Comment