పెద్దాయన కోర్టులో
చైర్మన్ పదవి ఎంపిక❓..
తణుకు (ప్రజా అమరావతి); మండలం దువ్వ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దానేశ్వరి అమ్మవారి ఆలయ చైర్మన్ పదవి కోసం గ్రామంలో జరిగిన సమావేశం ఒక కొలిక్కి రాకపోవడంతో నేడు పెద్దాయన వద్ద చైర్మన్ పదవి కోసం ఆశావాహులు సమావేశం కానున్నట్లు సమాచారం .
గ్రామంలో జరుగుతున్న పరిణామాలు, పరిస్థితులు ,ఆశావహుల అభిప్రాయాలను పెద్దయన దృష్టికి తీసుకువెళ్లనున్న నాయకగణం. ఆలయ చైర్మన్ పదవి కోసం నోటిఫికేషన్ రాకుండానే గ్రామంలో జరిగిన,జరుగుతున్న పరిణామాలను తమ నాయకుడి దృష్టికి తీసుకెళ్లతమని కొందరు అభిప్రాయపడుతున్నారు..
ఆలయ చైర్మన్ పదవి తమ వారికే కేటాయించాలని కొందరు పట్టుబడుతుండగా, మరోపక్క కుర్చీ ఎవరికి కేటాయిస్తారో అని
అదినాయకుడు మాట కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు .నేటి సాయంత్రం లోగా తేలనున్న చైర్మన్ పదవి ఎంపిక.
అందరిని ఒక తాటిపైకి తీసుకువచ్చి సమస్యను సామరస్యంగా చక్కదిద్దేందుకు పెద్దాయన ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
addComments
Post a Comment