ఏపీ ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతం



*ఏపీ ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతం


*


*రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి  6 కీలక ఒప్పందాలు*


*ఎంవోయూల ద్వారా భవిష్యత్ లో 3,440 మందికి, 7,800 మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగావకాశాలు*


*ఆంధ్రప్రదేశ్ రోడ్ షోకి మాత్రమే దుబాయ్ వాణిజ్య మంత్రి హాజరవడం మరింత ప్రత్యేకం*


*ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ళలో తొలి విదేశీ పర్యటనలోనే సత్తా చాటిన పరిశ్రమల మంత్రి*


*దుబాయ్ ఎక్స్ పో- 2020లో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్*


*ప్రతి రోజు కనీసం 10వేల మంది చొప్పున  పెవిలియన్ ని సందర్శించిన కోటి మంది*


*వాస్తవ రూపానికి అద్దం పట్టే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  విజన్ పట్ల సర్వత్రా ప్రశంసలు*


*400 మందికి పైగా  పారిశ్రామికవేత్తల హాజరు*


*వారం రోజుల పాటు 2 రోడ్ షోలు, సీఎక్స్ వో, బిజినెస్ రౌండ్ టేబుల్,చర్చా కార్యక్రమాల వంటి 100కి పైగా సమావేశాల నిర్వహణ*



అమరావతి, ఫిబ్రవరి, 19 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏపీ  రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి  6 కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వం ఏర్పడిన నాటి కోవిడ్ వెంటాడుతున్న నేపథ్యంలో తొలిసారి వెళ్లిన దుబాయ్ ఎక్స్ పో-2020లో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సత్తా చాటారు. మంత్రి మేకపాటి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ  అధికారుల బృందం 400 మందికి పైగా  పారిశ్రామికవేత్తలను కలిసి   రోడ్ షోలు, సీఎక్స్ వో, బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యక్రమాలను నిర్వహించింది.  సీఎం వైఎస్ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వినూత్న విధానాలు, ప్రజలకు మేలు జరిగే సంస్కరణలు, ప్రజా సంక్షేమం దిశగా చేపడుతున్న కార్యక్రమాల ద్వారా ఏపీ పెట్టుబడులకు స్వర్గధామమని మంత్రి గౌతమ్ రెడ్డి తన వాణిని అంతర్జాతీయంగా వినిపించడంలో సఫలీకృతమయ్యారు. 


*ఎంవోయూలతో ప్రత్యక్ష్యంగా 3,440 మందికి, 7,800 మందికి పరోక్షంగా ఉపాధి : మంత్రి మేకపాటి*


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామమని పరిశ్రమల శాఖ మంత్రి దుబాయ్ ఎక్స్ పో సాక్షిగా చాటి చెప్పారు. రాష్ట్రం 11 రంగాల్లో చేపట్టిన 70 ప్రాజెక్టుల్లో పెట్టుబడి అవకాశాలు వివరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో యూఏఈ సహా పలు విదేశీ కంపెనీలు ఎంవోయూలు కుదుర్చుకున్నాయని వెల్లడించారు.  రీజెన్సీ గ్రూప్, ముల్క్ హోల్డింగ్స్, షరాఫ్ గ్రూప్, తబ్రీద్, కాజస్ ఈ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు రూ.5,150 కోట్లు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. తద్వారా 3,440 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు అందనున్నాయి. మరో 7,800 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు అందే అవకాశం ఉంది.  జిప్సమ్ బోర్డు బిల్డింగ్ మెటిరియల్స్, కన్జూమర్ అండ్ ఇండస్ట్రియల్ పాకేజింగ్ యూనిట్, ఆటోమేటివ్, బ్యాటరీస్ , ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్స్ డెవలప్ మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలలోని పలు కంపెనీలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచాయి. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో మరో రూ. 10,350 కోట్ల వరకూ పెట్టుబడులు రానున్నాయి. తద్వారా 5,740 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, పరోక్షంగా ఇంకో 10వేల మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ఈ పర్యటనతో ఏపీలో పెట్టుబడుల ప్రవాహం ఖాయమనే విశ్వాసం కలిగిందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. తొలిసారి పర్యటనలోనే ఇంత మంది స్పందన రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


*దుబాయ్ ఎక్స్ పో ద్వారా మరిన్ని వాణిజ్య అవకాశాలు : పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్*


పోర్టులు, ఎయిర్ పోర్టులు, లాజిస్టిక్ హబ్ లు, ఫిషింగ్ హార్బర్లు, పారిశ్రామిక పార్కులు, కారిడార్ల వంటి సకల సదుపాయాలున్న ఏపీలో దుబాయ్ ఎక్స్ పో ద్వారా మరిన్ని పెట్టుబడులు రానున్నాయని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులపైనా ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. ఎక్స్ పోలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల సరికొత్తగా చూపిస్తూ పారిశ్రామిక బంధాలను మరింత బలోపేతమయ్యాయని కరికాల తెలిపారు.


*పారదర్శక పారిశ్రామిక విధానం వల్లే పెట్టుబడుల ప్రవాహం : ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది*


పారదర్శిక పారిశ్రామిక విధానం, సుపరిపాలన, అవినీతి లేని పాలన, పుష్కలమైన సహజవనరుల వల్లే ఏపీలో పెట్టుబడులు ప్రవాహం సాధ్యమవుతోందని ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు.  భవిష్యత్ లో ఆటోమొబైల్, టెక్స్ టైల్, స్టీల్ ప్లాంట్, పెట్రో కెమికల్, ప్రజారోగ్యం, ఐ.టీ, వంటి  రంగాలలో పెట్టుబడులకు ఏపీ చిరునామా అవుతందన్నారు.  మౌలిక సదుపాయాల కల్సనకు ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సుబ్రమణ్యం జవ్వాది స్పష్టం చేశారు.


*దుబాయ్ ఎక్స్ పో -2020లో ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవానికి మాత్రమే వచ్చిన యూఏఈ విదేశీ వాణిజ్య మంత్రి*


దుబాయ్ ఎక్స్ పో -2020లో   ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి రోజూ  7వేల నుంచి 10వేల మంది పెవిలియన్ ని విజిట్ చేశారు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలు పెవిలియన్ లను నిర్వహించినా దుబాయ్ వాణిజ్య శాఖ మంత్రి వచ్చి  బిన్ అహ్మద్ ఏఐ జియోది, యూఏఈ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి అహ్మద్ అబ్దుల్  రహ్మన్ అల్బాణా హాజరరవడం ప్రత్యేకం,  ఏపీ పెవిలియన్ ప్రారంభొత్పవానికి  మాత్రమే హాజరై పెవిలియన్ ప్రారంభించడం విశేషం. 


మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెంట దుబాయ్ ఎక్స్ పోకి వెళ్లిన వారిలో  ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జుల్ఫీ రావ్జీ,   పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఈడీబీ సీఈవో సుబ్రమణ్యం జవ్వాది, కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తదితరులు ఉన్నారు.


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image