వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం


వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం


రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ 

అమరావతి,ఫిబ్రవరి 19 (ప్రజా అమరావతి):  రాష్ట్రంలో విద్యుత్ వినియోగ దారులు అందరికీ నాణ్యమైన విద్యుత్ 24 గంటల పాటు నిరంతరాయంగా అందిచాలన్నదే  ప్రభుత్వ లక్ష్యమని  రాష్ట్ర విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ పేర్కొన్నారు. శనివారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో ఎపి-జన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ తో కలి ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.  రాష్ట్రంలోని రైతులందరికీ పగటి పూట తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ను అందజేయడం జరుగుతున్నదని, ఇందుకై 18 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు  6 వేల 663 ఫీడర్ల ద్వారా విద్యుత్ ను సరఫరా చేస్తూ రూ.7,714 కోట్ల విద్యుత్ రాయితీని  ప్రభుత్వం భరిస్తున్నదని ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.9,717 కోట్లను విద్యుత్ రాయితీగా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. సాంకేతిక లోపంతో ఎక్కడన్నా తొమ్మిది గంటల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, అదే రోజు ఆ సాంకేతిక లోపాన్ని సరిదిద్ది విద్యుత్ ను సరఫరా చేయడం జరుగుచున్నదన్నారు. 

   చౌకధరలకే నాణ్యమైన విద్యుత్ ను పరిశ్రమలకు, వాణిజ్య సంస్థలకు, దేశీయ ప్రయోజనాలకు అందజేయాలనే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  ఎంతో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న కోవిడ్ సమయంలో కూడా ఆసుపత్రులకు, ఆక్సిజన్ కేంద్రాలన్నింటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు. గత పక్షం రోజుల్లో రోజుకు సగటున 204 మిలియన్ యూనిట్లు విద్యుత్ను వినియోగం జరుగుతుండగా, గత ఏడాది  ఇదే రోజుల్లో  రోజుకు సగటున 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించడం జరిగిందన్నారు. ఈ 204 మిలియన్ యూనిట్లలో 170  మిలియన్  యూనిట్లను  దీర్ఝకాలిక ఒప్పందం విదానంలో ఎపి-జన్కో, కేంద్ర విద్యుత్ సంస్థలు అయిన ఎన్.టి.పి.సి., నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్, ప్రైవేటు విద్యుత్ సంస్థల  నుండి పొందడం జరుగుతున్నదన్నారు. అదే విధంగా మిగిలిన 34  మిలియన్ యూనిట్లను  మార్కెట్ నుండి కొనుగోలు చేయడం ద్వారా గాని, స్పల్పకాలిక ఒప్పందాల ద్వారా గాని  పొందడం జరుగుచున్నదన్నారు.  ప్రత్యేకించి వేసవి కాలం మూడు మాసాల పాటు ఈ అదనపు డిమాండు ఉంటుందని, దీని కోసం 25 ఏళ్ల కాలానికి సంబందించిన దీర్ఝకాలిక ఒప్పందాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. 

ఒప్పందాల ప్రకారం జన్కో రోజుకు 2,656 మెగావాట్స్ సరఫరా చేయాల్సి ఉండగా, నిన్న ఉదయం 2,504 మెగావాట్స్ ను, సాయంత్రం  2,460 మెగావాట్స్ ను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ఫ్లాంట్  1,333 మెగా వాట్స్ సరఫరాకు గాను దాదాపు 950 మెగావాట్స్ ను అందుబాటులో ఉంచడం జరుగుతున్నదన్నారు. సెంట్రల్ జనరేషన్ ఫ్లాంట్స్ 1,700 మెగా వాట్స్ వరకు అందుబాటులో ఉంచాల్సి ఉండగా దాదాపు 1,568 మెగా వాట్స్ ను ప్రతి రోజు అందుబాటులో ఉంచడం జరుగుచున్నదన్నారు. ప్రైవేట్ థర్మల్ ప్లాంట్స్ 222 మెగా వాట్స్ ను, గ్యాస్ , హైడల్, విండ్ విద్యుత్ సంస్థలు వరుసగా 125 మె.వా., 300 మె.వా.  మరియు 500-1000 మెగా వాట్స్ వరకూ అందుబాటులో ఉంచడం జరుగుతున్నదని ఆయన తెలిపారు. మిగిలిన 700 నుండి 2000 మెగా వాట్స్ ను ప్రతి పావుగంటకు మార్కెట్ లో ఆక్షన్ ద్వారా కొనుగోలు చేయడం జరుగుచున్నదన్నారు. ఈ ఆక్షన్ లో అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా పాల్గొని నిర్థారణ అయిన రేట్ల ప్రకారం కొనుగోలు చేయడం జరుగచున్నదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం 1,000 మెగా వాట్స్ విద్యుత్ ను మార్చి మొదటి వారానికల్లా హెచ్.ఎన్.పి.సి.ఎల్. అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన తెలిపారు. 

కొరతగానున్న విద్యుత్ ను  మార్కెట్ నుండి కొనుగోలు చేయడం జరుగుచున్నదని, విద్యుత్ వినియోగించే సమయాలను బట్టి  రేట్లలో మార్పులు ఉంటాయని,   అర్థరాత్రి పూట  ఒక యానిట్ రూ.2/లు ఉంటే  సాయంత్రం వేళల్లో  రూ.5/- లు పైబడి  విద్యుత్ ధర ఉంటున్నట్లు ఆయన వివరించారు.  తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఇండస్ట్రియల్ డిమాండ్  పెరగడం వల్ల మార్కెట్ లో ఎక్కువ బిడ్డింగా చేసి పవర్ ను కొనుగోలు చేస్తున్నారని, ఆ సమయాల్లో మన రాష్ట్రంలో ఎటు వంటి  కొరత రాకుండా అదే తరహాలో బిడ్డింగ్ చేయడం జరుగుచున్నదని ఆయన తెలిపారు. ఈ విధంగా రాష్ట్రంలో ఎటు వంటి విద్యుత్ కొరత లేకుండా తగు జాగ్రతలు తీసుకుంటూ రైతుల పంపు సెట్లకు, గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేయడం జరుగుచున్నదని ఆయన వివరించారు. 

విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాదానం చెపుతూ విద్యుత్ కొనుగోలు చెల్లింపులకు సంబందించి గత  ఏడాది నర్ర  నుండి   కేంద్రం నిబందనలను కఠిన తరం చేసిందని, అడ్వాన్సుగా చెల్సించాల్సి వస్తున్నదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత రెండేళ్ల నుండి  పెద్ద ఎత్తున నిధులను విద్యుత్ అవసరాలకై  కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎన్.టి.పి.సి. విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ సమస్య ఉత్పన్నమైతే రాష్ట్ర ప్రభుత్వం,  ఆర్థిక శాఖ ఆసమస్యను పరిష్కరించడం జరిగిందన్నారు. 

ఎపి జన్కో మేనేజింగ్  డైరెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ ఎపి జన్కో కు సంబందించి  విజయవాడ, కృష్ణపట్నం, రాయసీమ కడప,ముద్దనూరులలో మూడు  ధర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నారుని వీటి ద్వారా సుమారు  5,010 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు ఆయన తెలిపారు. వీటిలో నున్న మొత్తం 15 యూనిట్స్ ఫంక్షనింగ్ లో ఉన్నాయని, వీటి ద్వారా రోజుకు  80 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నట్లు ఆయన తెలిపారు.  ఈ థర్మల్ ప్లాట్స్ కు రోజుకు  60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గ వినియోగించాల్సి ఉంటుందని, నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని,  బొగ్గు సమస్య రాకుండా కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో పాటు  పవర్, కోల్ ,రైల్వే అధికారులు కమిటీగా ఏర్పడి పర్యవేక్షిస్తున్నారని, బొగ్గు సమస్యల ఏమాత్రం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. 

ఏ.పి. స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సి.ఇ.ఓ. చంద్రశేఖర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

 

Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image