విజయవాడ (ప్రజా అమరావతి);
*గొల్లపూడి బీసీ భవన్ లో 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లతో కలిసి మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకాల మరణానికి నివాళులు ఆర్పించిన బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ*
ఈ కార్యక్రమంలో 13 జిల్లాల 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు పాల్గొన్నారు...
*మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ*
నా సహచర మిత్రుడు, మృదు స్వభావి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంకా లేరనే వార్త చాలా భాద కలిగించింది...
ఎంతో అప్యాయంగా అన్న...అన్న అంటూ పలకరిస్తూ ఎంతో ఉత్సాహంగా ఉండే మేకపాటి గౌతమ్ రెడ్డి లేరు అంటే జీర్ణించుకోలేకపోతున్నాను...
ఐటి, పరిశ్రమల శాఖకు వన్నె తెచ్చిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి...
ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా తనకు ఇచ్చిన కర్తవ్యాని ఎంతో నిబద్ధతతో పనిచేశారు..
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం ఓ మంచి నాయకుడిని కోల్పోయింది...
పార్టీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు...
నా రాజకీయ ఎదుగుదలకు మేకపాటి కుటుంబం ఎంతో ప్రోత్సాహకంగా ఉండింది...
మా బీసీల జౌళ శాఖకు కూడా మంత్రిగా ఉంటూ....నేతన్నలకు ఎంతో ప్రోత్సాహకంగా గౌతమ్ రెడ్డి ఉన్నారు...
చిన్న వయస్సులోనే ఎన్నో బృహత్తర కార్యక్రమాలు నిర్వహించిన నా సహచర మిత్రుడి లేని లోటు ఎవరు తీర్చలేనిది...
వారి మృతికి సంతాపం తెలుపుతూ... వారి కుటుంబాన్నికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేసుచెల్లుబోయిన
addComments
Post a Comment