ఇకనైనా విష ప్రచారం ఆపండి. అసత్యాలు రాయకండి

 - ఇకనైనా విష ప్రచారం ఆపండి. అసత్యాలు రాయకండి


- తక్కువ ధరకే బియ్యం ఎగుమతి చేయడం లేదు 

- రైతులకు ఎక్కడా నష్టం, అన్యాయం జరగడం లేదు

- ప్రతి రైతుకూ పూర్తి మద్దతు ధర లభిస్తోంది

- ఈ క్రాపింగ్‌ ద్వారా పక్కాగా పంటల నమోదు 

- ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోంది

- 21 రోజుల్లోనే రైతులకు బిల్లులు చెల్లిస్తున్నాం

- ఈ సీజన్‌లో 45 లక్షల టన్నుల ధాన్యం సేకరణ

- ఇప్పటికే 34.28 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం

- 5,02,132 మంది రైతులకు రూ.6667 కోట్లు 

- ఇవాళ్టికి రూ.3946 కోట్లు ఇవ్వడం జరిగింది

- 21 రోజులకు ముందే రైతులకు ధాన్యం బిల్లు

- ఇప్పుడు కూడా ప్రతి రోజూ దాదాపు రూ.150 కోట్లు

- చంద్రబాబు మాదిరిగా బిల్లులు ఎగ్గొట్టడం లేదు

- ఇవాళ రాష్ట్రంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన

- రహదారులకు సంబంధించి మొత్తం 51 ప్రాజెక్టులు

కొన్ని ప్రారంభం. మరి కొన్నింటి పనులు మొదలు

- దాదాపు రూ.7 వేల కోట్ల విలువైన కొత్త ప్రతిపాదనలు

- సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ

- చూసి ఓర్వలేకపోతున్న చంద్రబాబు

- అందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌. అదే ఆయన జీవితం

- అందుకే ఇవాళ సర్పంచ్‌ల అవగాహన సమావేశం

- అందులోనూ అర్ధం లేని విమర్శలు, దుష్ప్రచారం

- వచ్చే ఎన్నికల్లోనూ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు

ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) 


 తాడేపల్లి, ఫిబ్రవరి 17 (ప్రజా అమరావతి):

తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఏమన్నారంటే..:


అసత్య కధనం:

ఈనాడు పత్రిక ఇవాళ తొలి పేజీలో బ్యానర్‌ వార్త. చౌకగా బియ్యం. రూ.25కే కిలో బియ్యం విదేశాలకు అని రాశారు. ఇవాళ విపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు, ఆయన కోసం పని చేస్తున్న కొన్ని తోక పార్టీలు, ఎలాగైనా చంద్రబాబును సీఎం చేయాలని పరితపించే రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడుకు నిద్ర లేని రాత్రులు. అందుకే పనికిమాలిన గాలి వార్తలు రాసి ఎలాగైనా జగన్‌గారిని అధికారంలో నుంచి దింపాలి. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టి, రాష్ట్రాన్ని దోచుకుతినాలన్నది వారి తాపత్రయం. 

నిజానికి ఈనాడులో ఇవాళ్టి వార్త చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. విదేశాలకు కాకినాడ పోర్టు నుంచి కిలో రూ.25కే సన్న బియ్యం ఎగుమతి అవుతోందని, ఆ బియ్యం ధర కనీసం రూ.40 ఉందని, రైతుల శ్రమ దోచుకుంటున్న పౌర సరఫరాల సంస్థ అని, అలా కాకపోతే, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా బియ్యం తక్కువ ధరకు సేకరించి అమ్ముకుంటున్నారని ఏదేదో రాశారు.


కానీ ఇదీ వాస్తవం:

చంద్రబాబును ఎలాగైనా సీఎంను చేయాలి. జగన్‌ ను భ్రష్గు పట్టించాలని రాసి, రాసి మొహమెత్తించారు. నిజానికి కాకినాడ నుంచే కాకుండా చెన్నై పోర్టు నుంచి కూడా బియ్యం ఎగుమతి అవుతుంది. అంతే కాకుండా బిహార్, ఒడిషా, మధ్యప్రదేశ్‌ నుంచి కూడా ఇక్కడికి బియ్యం వస్తుంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టు అగ్రస్థానంలో ఉంది.


అంతా ఆర్బీకేల ద్వారా..:

రాష్ట్రంలో ఇవాళ పంటల సాగు చాలా స్పష్టంగా ఈ–క్రాపింగ్‌లో నమోదు అవుతుంది. దాని వల్ల ఎక్కడ, ఏ పంట వేశారన్నది తెలుస్తుంది. 

ఇంకా ఆర్బీకేల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులు అక్కడికి ధాన్యం తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. వారు తమ ధాన్యం గురించి సమాచారం ఇస్తే, పౌర సరఫరాల శాఖ స్వయంగా కల్లాల వద్దకే వెళ్లి, ధాన్యం తీసుకుని, బిల్లులు చెల్లిస్తోంది. నిజానికి గతంలో రైతులు ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర విక్రయిస్తే, వారికి రకరకాల కారణాలు చెప్పి, తక్కువ ఇస్తున్నారని చెప్పి, సీఎంగారు మొత్తం విధానాన్ని మార్చారు.

రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.


సార్టెక్స్‌ బియ్యం పంపిణీ:

అలాగే బియ్యం నాణ్యత పెంచడం కోసం సార్టెక్స్‌ చేయడంతో పాటు, ప్రభుత్వం నూక శాతం తగ్గిస్తోంది. అందుకోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి, పూర్తిగా నాణ్యతతో కూడిన బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేస్తోంది. అంతే కాకుండా అవి కల్తీ కాకుండా ఇంటి వద్దే సీల్‌ తీసి బియ్యం ఇస్తున్నారు.


వయసు రాగానే సరికాదు:

ఇన్ని మంచి పనులు చేస్తున్న సీఎంగారి మీద అభాండాలు వేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు.

వయసు రాగానే కాదు. కనీసం బుద్ధి రావాలి. 70 ఏళ్లు దాటినా బుధ్ధి రాలేదు. 50 ఏళ్లు దాటని జగన్‌గారిపై రోజూ దాడి చేస్తున్నారు. కానీ పైన దేవుడున్నాడు. అన్నీ చూస్తున్నాడు. అందుకే మీ వంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు. అయినా వాస్తవాన్ని గుర్తించడం లేదు. పనికి మాలిన వార్తలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఏ మాత్రం నమ్మబోరు.


21 రోజుల్లోనే పైకం:

ఈ ఖరీఫ్‌ (2021–22) సీజన్‌లో వచ్చే నెల వరకు దాదాపు 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఇప్పటికే 34.28 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించగా, 5,02,132 మంది రైతులకు  రూ.6,667 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇవాళ్టికి రూ.3,946 కోట్లు ఇవ్వడం జరిగింది. 21 రోజులు కూడా పూర్తి కాకముందే రైతులకు ధాన్యం బిల్లుల ఇస్తున్నాం. ఇంకా దాదాపు రూ.1600 కోట్లు బకాయిలు ఉండగా, రోజూ దాదాపు రూ.150 కోట్ల వరకు రైతులకు డబ్బులు ఇస్తున్నాం. 


చంద్రబాబు ఎగ్గొట్టినా..:

గతంలో చంద్రబాబు పసుపు కుంకుమ కింద ఈ డబ్బులు వాడుకుని, దాదాపు రూ.1000 కోట్లు బాకీ పెట్టి పోయాడు. మరోవైపు దాదాపు రూ.2 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇంకా, విత్తనశుద్జి« కర్మాగారాలకు మరో రూ.700 కోట్లు బకాయి పెట్టి పోతే, ఈ సీఎంగారు అన్నీ చెల్లించారు. అంతే కాకుండా గత డిసెంబరులో పంట నష్టం జరిగితే, రెండు నెలల లోపే రూ.540 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇచ్చారు.


ఇకనైనా మానండి:

పంట నష్టం జరిగితే రెండు నెలల లోపే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ ఇవ్వలేదు. కానీ ఇలాంటి దుర్మార్గులు సీఎం పదవి తమ వారికి రావాలని, జగన్‌గారి ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారు. కాబట్టి వీరికి 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాలి. వారిని గోతి తీసి పాతాలి. అలాగే ఇకనైనా ఇలాంటి వార్తలు రాయడం మానాలని రామోజీరావును కోరుతున్నాను.


చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌:

ఇవాళ విజయవాడలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు సాధించుకున్నాం. రూ.10,600 కోట్లకు పైగా వ్యయంతో పూర్తి చేసిన రోడ్ల ప్రాజెక్టులు ఇవాళ కేంద్ర మంత్రి గడ్కరీ ప్రారంభించారు. అలాగే రూ.11 వేల కోట్లకు పైబడిన రోడ్డు ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. విజయవాడలో మరో బైపాస్‌ రోడ్డుతో పాటు, అన్ని జిల్లాలలో చాలా రోడ్లకు సంబంధించి సీఎంగారు ప్రతిపాదిస్తే, కేంద్ర మంత్రిగారు సానుకూలంగా స్పందించారు. దాదాపు రూ.7 వేల కోట్ల పనులు కోరినా కేంద్ర మంత్రి అంగీకరించారు.

ఆ స్థాయిలో మంచి పనులు జరుగుతుంటే, సీఎంగారు ఇంకా బలపడతారని అనుకున్న చంద్రబాబు, ఓడిపోయిన సర్పంచ్‌లతో అవగాహన సదస్సు పెట్టి, విమర్శలు చేశారు. వారికి ఆయన ఏం అవగాహన కల్పించాడంటే.. క్యాసినో గురించి, డీజీపీ గురించి, ఆయన బదిలీ గురించి, పోస్టింగ్‌ గురించి మాట్లాడాడు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు 14 ఏళ్లలో ఎంత మంది సీఎస్‌లను, డీజీపీలను మార్చాడు? ఒక్కరినే కొనసాగించలేదు కదా?


కోడిగుడ్డుకు ఈకలు:

ప్రభుత్వం అన్నప్పుడు బదిలీలు సహజం. అయినా కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నాడు. అన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్‌. గడ్కరీ వస్తున్నాడు. ఎన్నో మంచి పనులు మొదలయ్యాయి. అవి ప్రజల్లోకి పోకుండా, సర్పంచ్‌ల సమావేశం. తన కుల మీడియాలో ప్రచారం. పనికిమాలిన ప్రసారాలు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. జగన్‌గారిని ఎంత భ్రష్టు పట్టించాలని చూసినా, ఏమీ చేయలేరు. నిజానికి మీరు పార్టీని, పత్రికలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందుకే మీరు ఎన్ని చెప్పినా 2024లోనూ ప్రజలు నమ్మబోరు. మీకు మళ్లీ ఓటమి తప్పదు.


చంపితే ఏం వస్తుంది?:

ఛార్జ్‌షీట్‌లో చాలా విషయాలు ఉంటాయి. కానీ అన్నీ బయటకు రావడం లేదు. ఎవరికి నచ్చిన అంశం వారు బయటకు తీసుకువస్తున్నారు. గతంలో జగన్‌గారిపై కేసు నడిచినప్పుడు కూడా చూశాం. సీబీఐ జేడీ తమకు కావాల్సిన వారికి లీక్‌లు ఇచ్చేవాడు.

ఎవరినైనా చంపితే వారి పదవులు, డబ్బులు వస్తాయా? నిజానికి నాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపి, ఆయన మరణానికి చంద్రబాబు కారణమయ్యాడు.

కానీ ఇక్కడ అది కాదు కదా. ఆయనను (వివేకానందరెడ్డి) హత్య చేస్తే, జగన్‌ గారికి ఏమొస్తుంది? ఆయనకు ఏమైనా పదవి వస్తుందా? ఆస్తి వస్తుందా? నిజానికి వారి కుటుంబం దేవుడిని నమ్ముకున్న కుటుంబం. ప్రజలను నమ్ముకున్న కుటుంబం.


మేం మాట్లాడితే తట్టుకోగలరా?:

ఇందాక ఆ పార్టీ నాయకురాలు జగన్‌గారి కుటుంబ సభ్యులు ఆడవారిపై మాట్లాడారు. మరి మేము కూడా అలా మాట్లాడితే మీరు తట్టుకోగలరా? ఏమాత్రమైనా సిగ్గు శరం ఉండాలి. పదవులు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం. ఎన్టీఆర్‌ చరిత్రలో నిల్చిపోయారు. వైయస్సార్‌ చనిపోతే ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన కుమారుడిని సీఎం చేశారు. జగన్‌ నిరంతరం ప్రజల బాగు కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం తపించే మంచి మనసున్న వ్యక్తి.


ఆత్మస్థైర్యం దెబ్బ తీయలేరు:

కానీ మీరు.. మీ పేపర్లు, ఛానళ్లను మాత్రమే నమ్ముకున్నారు. చివరకు కొడుకును ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయాడు. కుప్పంలో కనీసం సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇవాళ సర్పంచ్‌లకు అవగాహన కల్పించడం ఏమిటి? పోనీ అక్కడైనీ పనికి వచ్చే విషయాలు చెప్పాడా? అంటే అదీ లేదు.

అందుకే చంద్రబాబుకు డబ్బా కొట్టే పేపర్లు కానీ, ఛానళ్లు కానీ ఇంకా ఎంత మొరిగినా, ఏడ్చినా జగన్‌గారి ఆత్మస్థైర్యం ఏ మాత్రం దెబ్బ తీయలేరు.


ప్రజలకు అన్నీ తెలుసు:

జగన్‌ క్యారెక్టర్‌ ప్రజలకు స్పష్టంగా తెలుసు కాబట్టే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్డడంతో పాటు, ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలతో పాటు, స్థానిక ఎన్నికల్లో కూడా పూర్తిగా గెలిపించారు. 

అందుకే ఆయన క్యారెక్టర్‌ గురించి, ఏ మాత్రం క్యారెక్టర్‌ లేని ఫోర్‌ ట్వంటీగాళ్లు చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరు.. అని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image