అమ్మవారు ను దర్శించు కున్న రాష్ట్ర డి.జి.పి శ్రీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి, IPS దంపతుల వారు

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి):

         రాష్ట్ర డి.జి.పి శ్రీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి, IPS దంపతుల వారు



శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి డి.భ్రమరాంబ  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గౌరవ రాష్ట్ర డి.జి.పి దంపతుల వారు శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వీరికి ఆలయ  ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ ఛైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు  మరియు కార్యనిర్వహణాధికారి  శ్రీ అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు, చిత్రపటంను అందజేసినారు.

Comments