ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు


ఏప్రిల్ 22 నుండి మే 12 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు

నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటించిన జెఇఇ షెడ్యూల్ ప్రకారం మార్పు

     రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

అమరావతి,మార్చి 3 (ప్రజా అమరావతి)


:  రాష్ట్రంలో  ఇంటర్మీడియట్ ప్రథమ,ద్వితీయ సంవత్సరం పరీక్షలను ఈ ఏడాది ఏప్రిల్ 22 నుండి  మే 12 వరకూ నిర్వహించనున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఐ.ఐ.టి.ల్లో అడ్మిషన్ల కోసం ఢిల్లీకి చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ జెఇఇ షెడ్యూల్ ను ఖరారు చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా  రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ పరీక్షలను నిర్వహించేందుకు రివైజ్డు షెడ్యూల్ ను జారీచేసినట్లు  మంత్రి తెలిపారు.గురువారం సచివాలయం నాల్గో బ్లాక్ లోని ప్లబిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జెఇఇ పరీక్షలు ఈ ఏడాది  ఏప్రిల్ 16 నుండి 21 వరకు  జరుగుతాయన్నారు.ఆ పరీక్షలకు రాష్ట్రం నుండి హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి నష్టం కలగకుండా జెఇఇ షెడ్యూల్  ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షల రివైజ్డ్  షెడ్యూలును ఖరారు చేయడం జరిగిందన్నారు.ఈరివైజ్డు షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 22 నుండి మే 11 వరకు, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఈ ఏడాది ఏప్రిల్ 23 నుండి మే 12 వరకు జరుగుతాయన్నారు. సైన్సు విద్యార్థులకు నిర్వహించే  ప్రాక్టికల్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 11 నుండి 31 వరకు ప్రతి రోజు రెండు సెషన్స్ లో అనగా  ఉదయం 9.00 నుండి మద్యాహ్నం 12.00 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు (ఆదివారం సెలవు దినాలు సహా)  జరుగుతాయన్నారు. 

ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వివరిస్తూ  ఏప్రిల్ 22 శుక్రవారం నాడు సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-1ను,25 న ఇంగ్లీష్ పేపర్ -1ను,27 న మేథమెటిక్స్ పేపపర్-IA, బొటనీ పేపర్-1, సివిక్స్ పేపర్-1ను,29 న మేథమెటిక్స్ పేపపర్-IB, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1, మే 2 న ఫిజిక్స్ పేపర్ -1, ఎకనామిక్స్ పేపర్ -1ను,6 న  కెమిస్టీ పేపర్ -1, కామర్సు పేపర్ -1, సోషియాలజీ పేపర్ -1, పైన్ ఆర్ట్సు, మ్యూజిక్ పేపర్-1ను,9న పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -1 (బైపిసి విద్యార్థులకు) మరియు మే 11 న మోడరన్ లాంగ్వేజ్ పేపర్ -1, జియోగ్రఫీ పేపర్ -1 పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 

అదే విధంగా ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షల నిర్వహణ తేదీలను మంత్రి వివరిస్తూ  ఏప్రిల్ 23 శనివారం నాడు సెంకడ్ లాంగ్వేజ్ పేపర్-2,అలాగే 26 న ఇంగ్లీష్ పేపర్ -2ను,28 న మేథమెటిక్స్ పేపపర్-IIA, బొటనీ పేపర్-2, సివిక్స్ పేపర్-2,అదే విధంగా 30 న మేథమెటిక్స్ పేపపర్-IIB, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2, మే 5 న ఫిజిక్స్ పేపర్ -2, ఎకనామిక్స్ పేపర్ -2ను,7వతేదీన  కెమిస్టీ పేపర్ -2, కామర్సు పేపర్ -2, సోషియాలజీ పేపర్ -2, పైన్ ఆర్ట్సు, మ్యూజిక్ పేపర్-2 ను,10 న పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ -2 (బైపిసి విద్యార్థులకు) మరియు మే 12 న మోడరన్  లాంగ్వేజ్ పేపర్ -2, జియోగ్రఫీ పేపర్ -2 పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అదే విధంగా మార్చి 7న సోమవారం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకూ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్ష జరుగుతుందని తెలిపారు.అలాగే మార్చి 9వతేదీ బుధవారం ఉ.10గం.ల నుండి మధ్యాహ్నం 1గం.వరకూ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష జరుగుతుందని మంత్రి తెలిపారు.కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలను తీసుకుంటూ ఈ పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని,ఈ పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టర్లు అందరూ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.శేషగిరిబాబు మాట్లాడుతూ ఈ ఏడాది  నిర్వహించే ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం  పరీక్షలకు  సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు.  థియరీ పరీక్షలను 1,400 కేంద్రాల్లోను మరియు ప్రాక్టికల్ పరీక్షలను సుమారు 975 కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల అవసరార్థం అవసరమైతే మరికొన్ని కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. 


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image