తణుకు (ప్రజా అమరావతి) ;
ప్రతి లబ్దిదారుడు ఇళ్ల నిర్మాణం ప్రారంభించేలా అవగాహన పెంచాలని
హౌసింగ్ పీడీ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గురువారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో తణుకు నియోజకవర్గ పరిధిలోని అధికారుల, ఉద్యోగుల, సిబ్బంది ప్రేరణ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పేదలందరికి ఇళ్ళ కార్యక్రమాన్నీ మరింత గా లబ్దిదారులకి చేరువ చెయ్యాలన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు కేటాయించబడిన ప్రతి లబ్దిదారుడు తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ రోజు హౌసింగ్ రాష్ట్ర స్థాయి అధికారి ఎమ్. కమాలకర బాబు క్షేత్ర స్థాయిలో లే అవుట్ లలో పర్యటించి మౌలిక సదుపాయాలను పర్యటించి దిశా నిర్దేశం చేశారన్నారు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్ళు పధకం కింద పశ్చిమగోదావరి జిల్లాలో 1,49,549 మందికి ఇళ్ళు మంజురూ చెయ్యగా, సుమారు 90 వేల ఇళ్ళ నిర్మాణం చెప్పట్టారని , అవి వివిధ దశల్లో నిర్మాణం లో ఉన్నాయన్నారు. మిగిలిన ఇళ్ళు కూడా మార్చి 31 నాటికి ప్రారంభింపచెయ్యలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి లబ్దిదారుడు జూన్ 2023 నాటికి పూర్తి స్థాయిలో ఇళ్ల నిర్మాణాల ను చేపట్టే లక్ష్యం తో ముందుకు వెళుతున్న ట్లు పేర్కొన్నారు. ఇంటిని నిర్మించుకుంటున్న లబ్దిదారులకి ఎప్పటికప్పుడు నగదు చెల్లింపు లనువారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తున్నట్లు కమాలకర బాబు తెలిపారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి వారి ఆదేశాలు మేరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తు అటు లబ్దిదారులకి , అధికారులకి అవగాహన కల్పించాడం జరుగుతున్న ట్లు తెలిపారు . గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు క్షేత్రస్థాయిలో స్వయంగా లే అవుట్ల లో పర్యటించి మౌలిక సదుపాయాల, ఇతర వసతుల కల్పన ను సమీక్షించడం జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారన్నారు. ముడిసరుకుల విషయంలో సిమెంట్, ఇసుక, ఐరన్ వంటి ముడి సరుకులు కొరత లేకుండా సరఫరా చేస్తూ త్వరితగతిన ఇంటి నిర్మాణాలు కోసం సహకారాన్ని ఇస్తున్నారని, లే అవుట్ లలో ఇసుకను అందుబాటులో ఉంచుతున్నా మన్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లబ్ధిదారుల వివరాలు నమోదు , ఇళ్ల నిర్మాణం, వివిధ దశల్లో ప్రగతి తదితర అంశాలపై పిపిటి ద్వారా శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ సిహెచ్. పద్మజ, ఎంపీడీఓ , మునిసిపల్ కమిషనర్, డిఈఈ, హౌసింగ్ ఏ ఈ లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment