రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ది మా ప్రభుత్వ లక్ష్యం అందుకే పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం





రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ది మా ప్రభుత్వ లక్ష్యం

అందుకే పరిపాలనా వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం

అమరావతిలో కూడా అన్ని అభివృద్ధి పనులు చేస్తాం

వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ సజ్జల ప్రకటన


హైకోర్టు తీర్పుతో చంద్రబాబు ముఠా వికారపు చేష్టలు 

బాణసంచా కాల్చారు. సంబరాలూ జరుపుకున్నారు

హైకోర్టు ముందు మోకరిల్లారు. బోర్లా పడుకున్నారు

ఆ చర్యలు హైకోర్టు వారినీ ఇబ్బంది పెట్టి ఉండొచ్చు

శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి


*పచ్చ కండువాలు వేసుకున్నంత మాత్రాన రైతులు అయిపోతారా..?*


నిజానికి ఇప్పటి వరకు జరిగింది రైతు ఉద్యమం కాదు

రైతుల ముసుగులో రియల్టర్లు. ప్లాట్లలో పెట్టుబడిదారులు

ఆకుపచ్చ కండువా వేసుకున్నంత మాత్రాన రైతులు కారు

అయినా మేము వారిని ఏ మాత్రం అవమానించడం లేదు

కానీ దాన్ని రైతుల విజయంగా టీడీపీ ప్రచారం చేస్తోంది

గణాంకాలతో సహా వివరించిన శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి


లక్ష కోట్ల పెట్టుబడి ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు

ఇక్కడ గత ప్రభుత్వం చేసిన వ్యయం రూ.8572.19 కోట్లు

అందులో మౌలిక వసతుల ఖర్చు రూ.5674 కోట్లు మాత్రమే 

మిగిలిన దాదాపు రూ.3 వేల కోట్లు వడ్డీలపై రుణాలు..

కన్సల్టెన్సీల ఛార్జీలు. రూ.798 కోట్లు రైతులకు కౌలుగా ఇచ్చారు

ఈ మొత్తం కూడా సొంత డబ్బు కాదు. అంతా రుణం. బాండ్లు

హడ్కో రుణం రూ.1151 కోట్లు, అమరావతి బాండ్లు రూ.2 వేల కోట్లు

కన్సార్షియమ్‌ రుణాలు మరో రూ.1862 కోట్లు

కేంద్రం నుంచి దాదాపు రూ.1500 కోట్లు వచ్చాయి

ఇదీ వాస్తవం. అయినా చంద్రబాబు దుష్ప్రచారాలు

ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి


తాడేపల్లి (ప్రజా అమరావతి):


ప్రెస్‌మీట్‌లో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..:


అదే మా ప్రభుత్వ లక్ష్యం:

ఊహించినట్లుగానే చంద్రబాబుగారు, ఆయన తమ్ముళ్లు అలాగే ముందు నుంచి ఆపార్టీ తరపున సత్యమేవ జయతే అంటూ లేదా మా అక్షరం మీ ఆయుధం అంటూ.. రామోజీరావు, రాధాకృష్ణ ఇతరులు మీడియా పేరుతో టీడీపీ ఎజెండా మోస్తూ వారి ప్రచారమే సర్వస్వంగా ప్రజల మెదళ్లను విషపూరితం చేస్తున్నారు.

అలాగే సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ గతంలో మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. పరిపాలనా వికేంద్రీకరణ. అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు, ప్రజల మనోభావాలకు విలువనిస్తున్నాం. అన్ని ప్రాంతాలు మాకు సమానం.


అంత భారం సాధ్యం కాదు:

మాది రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టు కాదు. అది కూడా ఒక వర్చువల్‌ ప్రాజెక్టు కాదు. లక్షల కోట్లు వ్యయం చేసి, అందులో సింహభాగం జేబుల్లో వేసుకోవాలన్న చంద్రబాబు దురాలోచన.. ఏదైతే ఉందో ఆ బరువు రాష్ట్రం మీద పడకుండా తప్పిస్తూ.. నాలుగేళ్లు ఏ పని చేయకుండా అరచేతిలో స్వర్గం చూపారు. ఆయన భాషలోనే చెప్పాలంటే కనీసం లక్ష కోట్లు ఖర్చు చేయాలని చెప్పారు. నిజానికి అంత భారం ఏ ప్రభుత్వం చివరకు కేంద్రం కూడా భరించలేదు. ఈ రాష్ట్రం విభజనతో చాలా నష్టపోయింది. పచ్చటి పొలాలు. దారులు కూడా లేని చోట అంత బరువు రాష్ట్రం మోయలేదు.


సాహసోపేతమైన నిర్ణయం:

మరోవైపు శ్రీబాగ్‌ ఒప్పందం నాటి నుంచి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి వచ్చినవి తీరాలన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచనతో సీఎంగారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. నక్కలు, కుక్కలు, రాక్షస మూకలు ఎంతకైనా తెగించి ఏమైనా చేయగలరని గతంలో రుజువు చేసుకున్న చంద్రబాబు, ఆయన ముఠా చర్యలను అడ్డం కొట్టే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.


హంగూ. ఆర్భాటం. వెకిలి చేష్టలు:

అమరావతి ఉద్యమం పేరిట జరుగుతున్న హంగామా. ఆర్భాటం. వెకిలి చేష్టలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి ఉద్యమం లేదా పోరాటం అంటే ఎలా ఉంటుందో అందరం చూశాం. ఈ తరం వాళ్లు చూసి ఉండకపోవచ్చు. నిజమైన ఉద్యమం, పోరాటంలో చెమట, మట్టివాసన ఉంటాయి. కానీ ఈ ఉద్యమంలో రైతుల లేరు. రెక్కాడితే డొక్కాడని వారు లేరు. రూపాయి పెట్టి రూ.200 నుంచి వెయ్యి రూపాయలు వస్తాయన్న ఆశతో దిగినవారు ఉద్యమం పేరుతో నడిపిన వారు.. నిన్న చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఒకటి చంద్రబాబుగారు చేసిన హడావిడి. మరోవైపు ఎల్లో మీడియా. చేసిన కేరింతలు. ఉత్సాహాలు. బాణసంచా కాల్చారు.

అన్నింటికి పరాకాష్టగా హైకోర్టు వద్ద మోకాళ్లమీద కూర్చున్నారు. బోర్లా పడ్డారు. ఇన్ని డ్రామాలు చూశాక మాట్లాడాల్సి వస్తోంది.


పార్టీలు వ్యవస్థలను గౌరవించాలి:

ఇది ప్రజాస్వామిక దేశం. ఒక రాజ్యాంగం ఉంది. చట్టాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి వ్యవస్థ. జ్యుడీషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్‌.. దేనికి దానికి స్వేచ్ఛ ఉంది. అయితే జ్యుడీషియరీకి ఇంకా ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే వ్యవస్థలో ఏమైనా లోపాలుంటే, తప్పులు జరిగితే ఎత్తి చూపుతారు. అందుకే న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులు ప్రజలకు కాస్త దూరంగా ఉంటారు. ప్రశంసలు, విమర్శలకు దూరంగా ఉంటారు. అప్పుడే న్యాయం జరుగుతుందని అంతా అనుకుంటారు. అందుకే మా నాయకుడు జగన్‌గారు కూడా అలాగే భావిస్తారు. అందుకే ఎన్నిసార్లు కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగిలినా నిలబడుతున్నారు.

అలాగే పార్టీలు కూడా ఈ వ్యవస్థలను గౌరవించకపోతే, దానికి పార్టీగా కొనసాగే అర్హత ఉండదు. కానీ నిన్నటి పరిణామాల్లో ఏ పార్టీ అయినా బ్యాలెన్స్‌గా వ్యవహరించాలి. కానీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.

ఇవి వ్యవస్థలకు ఎంతో ప్రమాదం. అవి ప్రజలకు కీడు చేస్తాయి. నిన్న కోర్టు ఎదుట బోర్లా పడడం చూస్తే, వారికీ (కోర్టు వారికి) ఇబ్బందికరంగానే ఉండొచ్చు.


రాజధాని తరలింపు కాదు:

పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం. అమరావతిలోని 33 వేల ఎకరాల్లో లక్షల కోట్ల ఆస్తి ఉందని వారే చెబుతున్నారు. అదే మొత్తాన్ని మూడు ప్రాంతాల్లో పెడితే, అన్నీ అలాగే అభివృద్ధి చెందుతాయి కదా. నిజానికి ఇక్కడి నుంచి రాజధానిని పూర్తిగా తరలించడం లేదు. కేవలం పరిపాలన వికేంద్రీకరణ మాత్రమే. కర్నూలులో హైకోర్టు. విశాఖలో సచివాలయం ఏర్పాటు మాత్రమే యోచించాం.


వారి వైఖరి మారడం లేదు:

టీడీపీ వారు మరీ రెచ్చిపోతున్నారు. అచ్చెన్నాయుడు గత ఎన్నికల ముందు నుంచీ ఒకటే చెబుతున్నారు. తమకు 150 నుంచి 160 సీట్లు వస్తాయని అంటున్నారు. అన్ని ఎన్నికల్లో ఓడిపోతున్నా, ఇప్పటికీ ఆ పార్టీ వైఖరిలో మార్పు రావడం లేదు. నిన్నటి కోర్టు తీర్పు టీడీపీ విజయం ఎలా అవుతుంది? దాని వల్ల మీరు ప్రజలకు ఒరగబెట్టిందేమిటి? కోర్టు ఇచ్చిన తీర్పును మీరు మరో రకంగా చూపుతూ మీ విజయంగా చెబుతున్నారు.

దానికి మేము సమాధానం చెప్పాల్సి వస్తోంది.


ఇక్కడ అభివృద్ధికీ కట్టుబడి ఉన్నాం:

అమరావతిలో వాస్తవ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంది. మీరు చేయనిది కూడా చేసి చూపుతుంది. పచ్చటి పొలాల్లో గుంజలు పాతి, రైతులను బెదిరించారు. భయపెట్టారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో దౌర్జన్యం చేశారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ కట్టారు. దానికి కనీసం కనెక్టివిటీ రోడ్‌ కూడా లేదు. కరకట్ట రోడ్డు తప్ప మరొకటి లేదు. అంత అధ్వాన్నంగా మీరు పని చేశారు.

ఇక్కడ అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే, కరకట్ట రోడ్డు విస్తరణ పనులు మొదలు పెడుతోంది. ఖాజా వరకు బైపాస్‌ రోడ్‌ నిర్మిస్తోంది. విజయవాడ చుట్టూ బైపాస్‌ రోడ్లు నిర్మిస్తోంది. విజయవాడలో ఫ్లైఓవర్‌ను వేగంగా పూర్తి చే«శాం. బెంజ్‌ సర్కిల్‌ వద్ద చాలా వేగంగా మరో ఫ్లైఓవర్‌ నిర్మించాం.

వీటన్నింటి వల్ల రైతులకు, ఇక్కడి వారికి ఎంతో మేలు జరుగుతోంది. అందుకే టీడీపీ ఎంత ప్రచారం చేస్తున్నా, 2019, ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు వైయస్సార్‌సీపీనే ఆదరిస్తున్నారు.


పేదలకు చోటు లేకుండా చేశారు:

ఆనాడు మా నాయకుడు జగన్‌గారు, ఇక్కడ రాజధాని ఉండాలని చెప్పినా, అందుకోసం కేవలం ప్రభుత్వ భూమి మాత్రమే తీసుకోవాలని చెప్పారు. కానీ చంద్రబాబుగారు ఇక్కడ పక్కాగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారు. గజం భూమి కనీసం రూ.12 వేలు అన్నారు. ఆ విధంగా ఇక్కడ ఒక్క పేదవాడు కూడా ఉండకుండా చేశారు.


అసలు ఎంత మంది రైతులు?:

ఇక్కడ మొత్తం 34,385 ఎకరాల్లో 30,913 ఎకరాలు పట్టా భూములు. 28,526 రైతులకు చెందిన భూములు. ఇందులో కేవలం 1133 మంది చేతిలో మాత్రమే 10 వేలకు పైగా ఎకరాల భూమి ఉంది. అందులో దాదాపు 10,050 మంది సీఆర్డీఏ ఇక్కడ భూములు సేకరించే నాటికే తమ భూములు అమ్ముకున్నారు. ఆ భూములు కొన్న వారిలో చంద్రబాబు బినామీలు ఎక్కువ ఉన్నారు.  ఆ తర్వాత సీఆర్డీఏ ప్లాట్లు చేస్తే 7500 మంది యజమానులు అమ్ముకోగా, ఇప్పుడు 11 వేల మంది వాస్తవ రైతులు ఉన్నారు. ఇదీ చరిత్ర.

అంటే మెజారిటీ రియల్టర్లు లేదా ప్లాట్లు కొని ఎక్కువ ధరకు అమ్ముకోవాలనుకున్న వారే ఇప్పుడు ఇక్కడ మిగిలారు. వాస్తవం ఇలా ఉంటే, ఇది రైతు ఉద్యమమని ప్రపంచమంతా చూపే ప్రయత్నం చేస్తున్నారు, పచ్చ కండువా వేసుకుంటే రైతులు అవుతారా. అయినా మేము వారిని అవమానించడం లేదు. కానీ వాస్తవాలు గుర్తించాలని అందరినీ కోరుతున్నాం. దీన్ని రైతు ఉద్యమం అనడం తప్పు. అది రైతు ఉద్యమం కాదు. కేవలం ప్లాట్లలో పెట్టుబడి పెట్టిన వారే ఉన్నారు.

నిజానికి అక్కడున్న రైతులను ఇంత ఛిన్నాభిన్నం చేశారు కాబట్టే, ఇక్కడ కూడా మిమ్మల్ని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు భవిష్యత్తులో కూడా అదే జరుగుతుంది.

రూపాయి పెట్టుబడితో వేల లాభం పొందాలని ఇక్కడ ప్లాట్లు కొన్న వారు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే నిన్న టపాకాయాలు కాల్చారు. సంబరాలు చేసుకున్నారు. తమ ఆదాయాన్ని పోగొట్టారని వారి ఆక్రోషం. నిజానికి ప్రయోజనం పొందిన రైతుల, సామాన్యులు ప్రభుత్వాన్ని, జగన్‌గారిని ఆశీర్వదిస్తున్నారు.


ఎంతెంత ఖర్చు చేశారు?:

అమరావతిలో 2021, నవంబరు 23 వరకు మొత్తం రూ.8572.19 కోట్లు ఖర్చు చేస్తే, అందులో మౌలిక వసతుల కోసం చేసిన వ్యయం రూ.5674 కోట్లు మాత్రమే. మిగిలిన దాదాపు రూ.3 వేల కోట్లు వడ్డీలపై రుణాలు, కన్సల్టెన్సీల ఛార్జీలు. ఇంకా రూ.798 కోట్లు రైతులకు కౌలు కింద ఇచ్చారు. 

ఈ మొత్తం కూడా సొంత డబ్బు కాదు. హడ్కో నుంచి రూ.1151 కోట్లు, అమరావతి బాండ్లు రూ.2 వేల కోట్లు, కన్సార్షియమ్‌ రుణాలు రూ.1862 కోట్లు. ఇంకా కేంద్రం నుంచి దాదాపు రూ.1500 కోట్లు రాగా, మిగిలిన మొత్తం మాత్రమే గత ప్రభుత్వం ఖర్చు చేసింది. నిజానికి అందులో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన ఖర్చు కూడా ఉంది.


ఇవాళ దారుణ మాటలు:

ఎకరానికి రూ.2 కోట్ల చొప్పున 50 వేల ఎకరాల్లో మౌలిక వసతుల కోసం లక్ష కోట్లు కావాలని మీరే అన్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం పనులు చేయకుండా, పోలవరం ప్రాజెక్టు మాదిరిగా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దండుకోవడానికి ఇక్కడ పనులు మొదలు పెట్టాడు. అందుకే ఎక్కడెక్కడో తిరిగాడు. ప్లానింగ్‌ పేరుతో దేశదేశాలు తిరిగాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెంచడానికి కృష్ణా జిల్లా అంతటా గ్రీన్‌ జోన్‌ చేశారు. అలాంటి చంద్రబాబు ఇవాళ ఇది అమరావతి రైతుల విజయం అంటున్నాడు. ఇంతకన్నా దారుణం మరొకటి కాదు.

కానీ మా నాయకుడు జగన్‌గారు మాత్రం చిత్తశుద్ధితో ఉన్నారు. చెప్పిన దానికి కట్టుబడి ఉన్నారు. అందుకే కోవిడ్‌ కష్టకాలంలో ఎన్ని సమస్యలున్నా ప్రజలకు మేలు చేయడం ఆపలేదు. వారిని అన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ.. పరిపాలన వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నారు. దీన్ని ప్రజలూ ఆదరిస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది.

కానీ ఆ జ్ఞానం చంద్రబాబుకు లేదు. అందుకే ఎవరినో ఒకరిని పట్టుకుని రావాలని చూస్తున్నారు. లేదా తప్పుడు సమాచారం ఇస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.


మీడియా ప్రశ్నలకు సమాధానంగా..


ఏనాడో చరిత్రహీనుడు:

చంద్రబాబు ఏనాడో చరిత్రహీనుడయ్యాడు. మామకు వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టాడు. సొంతంగా ఒక్కటన్నా ఒక్క పని చేయలేదు. ఎవరో ఒకరి తోడు లేకుండా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. ఇప్పుడు కూడా కేవలం మీడియాను నమ్ముకుని పని చేస్తున్నాడు. 10 మంది ఉంటే 100 మంది ఉన్నట్లు చూపుతున్నారు. ప్రతి చిన్న పనికి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేస్తున్నారు.

ప్రజలకు వాస్తవాలు తెలుసు. అందుకే 2019లో చంద్రబాబును పక్కన పెట్టారు. ఆ తర్వాత కూడా అన్ని ఎన్నికల్లో ఓడించారు. ఒక నలుగురిని చూపడం, వారి వెనక లక్షల మంది ఉన్నారని చూపే ప్రయత్నం చేయడం చేస్తున్నారు. ఆ తర్వాత పెయిడ్‌ ఆర్టిస్టులు. ఆ విషయాన్ని ఒకరు స్వయంగా చెప్పారు. తమకు నెలకు రూ.2 లక్షలు ఇస్తారని. 


మా లక్ష్యం న్యాయబద్ధం..:

నిన్నటి పరిణామాలపై ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చిస్తుంది. వచ్చే అసెంబ్లీలోనూ చర్చిస్తుంది. మా లక్ష్యం న్యాయబద్ధమైంది. ప్రజల ఆకాంక్షలకు సంబంధించింది. కాబట్టి దాని నుంచి వెనకడుగు వేయబోము. అయితే ఎలా సాధించాలనేది కూడా చూస్తాం. ఒక్కో అడుగు ముందుకు వేస్తాం. మేము ప్రభుత్వంలో ఉన్నాం. చాలా బలమైన ప్రభుత్వం మాది. మా నాయకుడు ఒక ధీశాలి. ఆయన ఎక్కడా బెదరడు. అన్నీ ఆలోచించి పని చేస్తారు. నమ్మిన దానికే కట్టుబడతాడు. 


ఆయనది కుల రాజకీయం:

ఒక కులాన్ని ఎత్తుకున్నదే చంద్రబాబు. ఒకప్పుడు కమ్మ కులం చాలా ప్రోగ్రెస్సివ్‌గా ఉండేవారు. బిజినెస్‌లోనే కాకుండా, నీటి సదుపాయం ఉంటే ఎక్కడికైనా వెళ్లి సాగు చేసే వారు. దీన్ని అందరం చూశాం. అలాంటి వారికి ఈ జాడ్యం అంటించాడు. ఎక్కడైనా ఒక కులం, వర్గాన్ని నమ్ముకున్న వారు రాజకీయాల్లో ఎదగలేదు. 

జగన్‌గారు అందరి అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారు. అందుకే కులం, మతం, వర్గాలకు అతీతంగా ఆలోచిస్తారు. ఆ ప్రక్రియలోనే పరిపాలన వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది.


నిష్పాక్షిక దర్యాప్తు కోరుకున్నాం:

వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక మీడియా వర్గం.. కేవలం ఒకవైపు కోణాన్ని మాత్రమే హైలైట్‌ చేస్తోంది. సీఆర్పీసీ–161 స్టేట్‌మెంట్లలో కూడా తమకు అనుకూలంగా ఉన్న వాటినే రాస్తున్నారు. అందుకే సీబీఐ దర్యాప్తులో లోపాలను మేము ప్రశ్నిస్తున్నాం. అంతకు ముందు సిట్‌ చేసిన దర్యాప్తును, ఆ నివేదికలను ఎందుకు పట్టించుకోవడం లేదని గుర్తు చేస్తున్నాం. 

వివేకానందరెడ్డి రాసిన లెటర్‌ను సాయంత్రం వరకు ఎందుకు దాచి పెట్టారు?. ఆయన ఫోన్‌ను సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు అప్పగించలేదు? దాంట్లో నుంచి ఏమేం డిలీట్‌ చేశారో బయటకు తీయమంటున్నాం. ఆ కేసులో మా ప్రభుత్వం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నిష్పాక్షిక దర్యాప్తు కోరుకుంటోంది.. అని శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image