*ఉచిత త్రాగునీరు ట్యాంకర్ ఏర్పాటు
*
తాడేపల్లి (ప్రజా అమరావతి);
జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా తాడేపల్లి ఇప్పటం గ్రామంలో నిర్వహించబోయే సభా ప్రాంగణంలో పార్టీ శ్రేణులుకు, అభిమానులకు ఉచితంగా త్రాగు నీరందించెందుకు జనసేన పార్టీ నాయకులు మరియు సభా ప్రాంగణ నిర్వహణ కమిటీ సభ్యులు దాసరి శివనాగేంద్ర ఉచిత మంచినీటి ట్యాంకర్ ఏర్పాటు చేశారు.బుదవారం జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతులమీదుగా సభా ప్రాంగణంలో వాటర్ ట్యాంకర్ ను ప్రారంభొత్సవం చేసారు. ఆవిర్భావ దినోత్సవ సభ అనంతరం కూడా రాబోవు వేసవి దృష్ట్యా పేద ప్రజలకు గ్రామాల్లో ఈ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగు నీరు సదుపాయం కొనసాగుతోందని ఆయన తెలియజేశారు.కార్యక్రమంలో జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్, చిల్లపల్లి శ్రీనివాసరావు.గాదే వేంకటేశ్వర రావు, బోనబోయిన శ్రీనివాసయాధవ్ అమ్మి శెట్టి వాసు ,కే కే. పోతిన మహేష్ . తదితరులు పాల్గొన్నారు..
addComments
Post a Comment