గుంటూరు (ప్రజా అమరావతి);
SVSN రెడ్డి హాస్టల్ లో ఈ నెల 20 వ తేదీన సాయంత్రం రెడ్డి జనాభ్యుదయ మండలి ఆధ్వర్యంలో శ్రీ ఆరెగకూటి
సంజీవరెడ్డి వారి ధర్మపత్ని రమాదేవి గార్లు సుమారు 15 లక్షల రూపాయలు పైగా ఖర్చు చేసి నిర్మించిన ఏ/సీ మినీ ఫంక్షన్ హాల్
ప్రారంభోత్సవ కార్యక్రమం
మరియు
శ్రీ కుర్రి భరత్ రెడ్డి వారి తల్లిదండ్రులు శ్రీ కుర్రి కోటిరెడ్డి వారి ధర్మపత్ని విజయలక్ష్మి గార్ల సహకారంతో రెండోవ సోలార్ ప్లాంట్ విద్యుత్ యూనిట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, శాసనమండలి సభ్యులు లేళ్ళ అప్పి రెడ్డి,కల్పలతా రెడ్డి,
గోల్కొండ హోటల్స్ అధినేత నడికట్టు రామిరెడ్డి,ప్రముఖ పారిశ్రామిక వేత్త కళ్ళం హరినాధ రెడ్డి,మోదుగుల పాపిరెడ్డి,మోదుగుల వేణు గోపాల్ రెడ్డి హాజరై ప్రసంగించారు.SVSN రెడ్డి హాస్టల్ కార్య నిర్వాహకులు వచ్చిన అతిధులని శాలువా కప్పి మెమెంటో అందజేసి ఘనంగా సత్కరించారు.
addComments
Post a Comment