మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి మృతికి నివాళిగా సంతాపతీర్మానం ప్రవేశపెట్టడం


శాసనసభ, అమరావతి (ప్రజా అమరావతి);


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీసభ్యులు కొణిజేటి రోశయ్య సంతాపతీర్మానం సందర్భంగా శాససనభలో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.


*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...;*


ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి మృతికి నివాళిగా సంతాపతీర్మానం ప్రవేశపెట్టడం, దానిపై చర్చ సందర్భంగా పలువురు సభ్యులు రోశయ్య గారి గురించి మాట్లాడడం జరిగింది. 

విద్యార్ధి నాయకుడు స్ధాయి నుంచి శాసనమండలి సభ్యుడుగానూ, శాససనభ్యుడుగానూ, మంత్రిగానూ, ఎంపీగానూ, ముఖ్యమంత్రి, చివరకు గవర్నర్‌గానూ ఆయన సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగారు. ఏ బాధ్యత నిర్వర్తించినా అందరికీ ఆదర్శంగా, అందరూ కొనియాడే మనిషిగానే ఉన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రోశయ్య గారు ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేయడమే కాకుండా నాన్నగారు హయాంలో ఆర్ధికశాఖ మంత్రిగా ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలుండేవి. ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉండేవారు. అలాంటి రోశయ్యగారు గారు ఇవాళ మన మధ్య లేకపోవడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటూ... ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. 


అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యులు వల్లూరి నారాయణమూర్తిగారు, వీవీఎస్‌ఎస్‌ చౌదరి గారు, కడప ప్రభాకర్‌ రెడ్డిగారు, మంగమూరి శ్రీధర్‌ కృష్ణారెడ్డిగారు, గారపాటి సాంబశివరావు గారు, శ్రీమతి టీఎన్‌ అనసూయమ్మగారు, శ్రీ పి వేణుగోపాలరెడ్డిగారు, ఎల్లసిరి శ్రీనివాసులరెడ్డిగారు, యడ్లపాటి వెంకటరావు గారు వీరందరి మృతికి కూడా ఈ సభ ద్వారా సంతాపం తెలియజేస్తున్నాను. 


అనంతరం మృతి చెందిన మాజీ సభ్యులకు సంతాపసూచకంగా శాసనసభలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Comments