ముత్తంశెట్టిశ్రీనివాసరావు(అవంతి)తో కేంద్ర క్రీడల శాఖ సంయుక్త కార్యదర్శి అతుల్ సింగ్ భేటీ అయ్యారు

 

           

               

                

అమరావతి మార్చి 10 (ప్రజా అమరావతి):

రాష్ట్రపర్యాటక,యువజనసంక్షేమం,సాంస్కృతిక ,క్రీడల శాఖామంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావు(అవంతి)తో కేంద్ర క్రీడల శాఖ సంయుక్త

కార్యదర్శి అతుల్ సింగ్ భేటీ అయ్యారు



రాష్ట్ర పర్యటనకు వచ్చిన అతుల్  సింగ్ సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రిఅవంతి శ్రీనివాసరావునుమర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలఅభివృద్దికిచేయూతనందించి,నూతన స్టేడియంల నిర్మాణానికి

నిధులు మంజూరు చేయాలని మంత్రి అవంతిశ్రీనివాసరావు కేంద్ర క్రీడల శాఖ సంయుక్త కార్యదర్శిని కోరారు. 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలోక్రీడల అభివృద్దికిచేపట్టిన కార్యక్రమాలగురించి మంత్రి ఈసందర్భంగా వివరించారు.


రాష్ట్ర క్రీడలశాఖప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ,క్రీడలశాఖ ఉన్నతాధికారులు కూడా  హాజర

య్యారు.


Comments