ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు అంధించడంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ,

 కార్యాలయం 

మంగళగిరి (ప్రజా అమరావతి);


*ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు అంధించడంలో భారతదేశంలోనే  మొదటి స్థానంలో నిలిచిన  ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ, రెండవ స్థానంలో తెలంగాణ మరియు మూడో స్థానంలో గుజరాత్.* 


 2021 సంవత్సరానికి గాను స్కోచ్ సంస్థ పోలీస్ మరియు భద్రత విభాగంలో వివిధ రాష్ట్రాలలో  పౌరులకు  అందిస్తున్న సేవలపై అధ్యయనం నిర్వహించిన అనంతరం ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భారతదేశంలో మొదటి స్థానంలో ఉనట్లు గుర్తింపు నిచ్చింది.


 పోలీస్ శాఖ కు సంబంధించిన వివిధ అంశాలలో నూతనంగా, ఆధునిక విధానాలను ఆవిష్కరిస్తూ వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా అవలంబిస్తూ పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందిస్తున్నందుకు గాను  23 అవార్డులను పోలీస్ శాఖ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన సేవలకుగాను ఈ సంస్థ ప్రకటించిన 56 అవార్డులలో 23 అవార్డులు పోలీస్ శాఖకు రావడం గమనార్హం. 2020 సంవత్సరం లో పోలీస్ మరియు భద్రత విభాగంలో ఏపీ పోలీస్ శాఖ మొదటి స్థానం దక్కించుకోగా ఈ సంవత్సరం కూడా మొదటి స్థానం నిలబెట్టుకుంది.


 ఈ సంధర్భంగా డి‌జి‌పి గారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది సకాలం లో స్పందిస్తూ వారి ఫిర్యాదుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ చట్టపరంగా అందించాల్సిన న్యాయాన్ని భాదితులకు  అందిస్తున్నారు అనడానికి ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖకు  లభిస్తున్న అవార్డులు అందుకు నిదర్శనం.


ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దానిద్వారా బాధితులకు రక్షణగా మేము ఉన్నాము అనే భరోసా కల్పిస్తూ వారికి దక్కాల్సిన న్యాయాన్ని అందిస్తూ భాదితుల మన్ననలను పొందుతూ  దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని పేర్కొన్న ముఖ్యమంత్రి శ్రీ వై.యెస్. జగన్ మోహన్ రెడ్డి గారు.

Comments