మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు చేయూత –మండల స్థాయిలో బ్యాంకుల విస్తరించాలి


విజయవాడ (ప్రజా అమరావతి);



మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు చేయూత

–మండల స్థాయిలో బ్యాంకుల విస్తరించాలి


–నైపుణ్యాభివృద్ధికి సహకార శిక్షణా సంస్థ ఏర్పాటు చేయాలి

–నాబార్డు చైర్మన్‌ చింతాల గోవిందరాజులు 

అమరావతి

వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు నాబార్డు అధిక ప్రాధాన్యతని స్తుందని నాబార్డు చైర్మన్‌ చింతల గోవిందరాజులు స్పష్టం చేశారు. సహకార రుణపరపతి పునవ్యవస్థీకరణపై ఆప్కాబ్, డీసీసీబీ చైర్‌పర్శన్లతో విజయవాడలో బుధవారం జరిగిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నాబార్డు చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సహకార రంగాభివృద్దికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా స్వాగతిస్తున్నామని చెప్పారు.రాష్టంలో డిసిసిబిల బ్యాంకుల పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. రాష్ట్రంలో సొసైటీల పరిధిలో గొడౌన్స, కోల్డ్‌ స్టోరేజ్, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్నామన్నారు. ఆర్బీకే స్థాయిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌ను తీసుకు రావడం నిజంగా శుభపరిణామన్నారు. సహకార బ్యాంకుల బలోపేతానికి షేర్‌ క్యాపిటల్‌ కావాలంటే ప్రతిపాదనలు పంపిస్తే ఆర్ధిక సర్దుబాటు చేసేందుకు నాబార్డు సిద్దంగా ఉందన్నారు. రాష్ట్ర కో ఆపరేటివ్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సంస్థ ద్వారా నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పిస్తే సహకార బ్యాంకులు ప్రొఫిషనల్‌గా తయారవు తాయని సూచించారు. పెసలు, మినుములు పండించే రైతుకు కిలో రూ.60లు వస్తుంటే. ప్రొసెస్‌ చేసి మార్కెట్‌లో రూ.200కు పైగా అమ్ముతున్నార న్నారు.ఆ వ్యత్యాసం రైతులకు చేరాలంటే వ్యవసాయ ఉత్పత్తులను ప్రొసెస్‌ చేసి వాల్యూఎడిషన్‌ చేయడం చాలా అవసరమన్నారు. ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకారం వాల్యూచైన్‌ ఫైనాన్స్‌ దేశ వ్యాప్తంగా రూ.లక్ష కోట్లు జరుగుతుంటే, మన మిచ్చేది కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమేనన్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.58వేల కోట్లు ఇవ్వగా, దాంట్లో రూ.22 వేల కోట్లు ఏపీ, తెలంగాణాలోనే  ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నావడ్డీ పథకం వందశాతం రీ–పేమెంట్‌ జరుగు తుందన్నారు. ప్రతీ బ్యాంక్‌ డ్వాక్రా సంఘాలకు కనీసం 300–400 కోట్ల రుణాలు ఇవ్వగలిగితే రూ.30 కోట్లు ఆదాయం వచ్చినట్టేనన్నారు.కౌలు రైతులను జాయింట్‌ లయబులిటి గ్రూప్స్‌(జేఎల్‌జీ) ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వొచ్చున్నారు.

డీసీసీబీల వర్గీకరణపై అధ్యయనం ః మంత్రి కన్నబాబు

అధికారం చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సహకార శాఖలో  ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు.గత ప్రభుత్వం చెల్లించ కుండా వదిలేసిన రూ.1000 కోట్ల పావలా వడ్డీ బకాయిల్లో రూ.600 కోట్లు విడుదల చేసి సహకార బ్యాంకులకు వెన్నుదన్నుగా నిలిచారన్నారు. ఆప్కాబ్‌కు రూ.100 కోట్లు, 9 డీసీసీబీలకు రూ.195 కోట్లు షేర్‌ క్యాపిటల్‌ రూపంలో ఇచ్చేందుకు ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారన్నారు. గత ప్రభుత్వ హయాంలో నష్టాల్లో వున్న డిసిసిబిలను లాభాల బాటలో పెట్టామని, రానున్న ఆర్ధిక సంవత్సరంలో కనీసం వంద బ్రాంచ్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. 3–5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రతీ ఉద్యోగిని బదిలీ చేసే విధంగా రూపొందించిన హెచ్‌ఆర్‌ పాలసీని త్వరలో అమలు చేయబోతున్నామన్నారు. ఆర్బీకే–పీఏసీఎస్‌లను అనుసంధా నించే విషయంలో అధ్యయనం చేసేందుకు టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసామన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాట వుతున్న నేపథ్యంలో డీసీసీబీలను ఇప్పటికిప్పుడు వర్గీకరించాలా లేదా అనే అంశంౖపై అధ్యయనం జరుగుతోందన్నారు. వయబిలిటీ లేకుండా వర్గీకరిస్తే లేనిపోని ఆర్ధికపరమైన ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. గామ స్థాయిలో పూర్తి స్థాయిలో బ్యాంకింగ్‌ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు త్వరలో ఓ పాలసీని కూడా తీసుకొస్తున్నామన్నారు. మండలానికో భ్రాంచ్‌ ఏర్పాటుపై కసరత్తు జరుగు తోందన్నారు. రుణాలు ఇచ్చేప్పుడు , తిరిగి చెల్లించెటప్పుడు ఎటువంటి వత్తిడిలకు తలొగ్గకుండా పని చేయాలనీ సీఎం జగన్‌ స్పష్టం చేసారని మంత్రి కన్నబాబు అన్నారు. అంతకు ముందు కృష్ణా జిల్లా సహకార కేంద్రబ్యాంక్‌ ఏటీఎం, లాకెర్స్‌ కాంప్లెక్స్‌ సముదాయాలను  మంత్రి కన్నబాబు, నాబార్డు చైర్మన్‌ డాక్టర్‌ చింతల గోవిందరాజులు ప్రారంభించారు.ఈ కార్యక్రమాల్లో సహకార శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి, కో ఆపరేటివ్‌ రిజిస్ట్రార్‌ అహ్మద్‌ బాబు, ఆప్కాబ్‌ చైర్మన్‌ మల్లెల ఝాన్సీరాణి, ఎండీ శ్రీనాథ్‌రెడ్డి, ఆప్కాబ్‌ జీఎం ఉదయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image