శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
(ప్రజా అమరావతి):
ఈ రోజు ది.21-03-2022న గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ పి.మాధవీ దేవి గారు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి వేదపండితులు వేద ఆశీర్వచనము చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రం అందజేసినారు.
addComments
Post a Comment