పరిపాలన చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాతం పేరుతో రాజకీయాలు చేస్తారు



ఐటీడీపీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం వివరాలు 

  

పరిపాలన చేతకాని వాళ్లే కులం, మతం, ప్రాతం పేరుతో  రాజకీయాలు చేస్తారు



నా కులం, మతం, కుటుంబం అంతా తెలుగు జాతే


తెలుగు జాతి ప్రపంచంలో నెం.1 కావాలన్నదే నా తపన


జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ ద్వారా తప్పుడు ప్రచారం చేసి  గత ఎన్నికల్లో గెలిచారు 


 వైసీపీ వైఫల్యాలు, తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టి జగన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలి 

- శ్రీ నారా చంద్రబాబు నాయుడు

మంగళగిరి (ప్రజా అమరావతి);

పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రంలో అభివృద్దిని గాలికొదలి ప్రజల్ని ‎ కులం, మతం, ప్రాంతం పేరుతో రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటూన్నారని ‎ టీడీపీ జాతీయ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ మీట్ అండ్  గ్రీట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... పాలన చేతకానివాడే కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. సమర్ధ నాయకుడు అభివృద్ది చేస్తాడు. వైసీపీ వాళ్లు నాకు కులం అంటగడుతున్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో హైదాబాద్ ఐటి నగరంగా అభివృద్ది చేశా. అక్కడ నా కులం వాళ్లున్నారని అభివృద్ది చేశానా? నాకు కులం లేదు, మతం లేదు, నా కులం, మతం తెలుగు జాతే. తెలుగు వారంతా నా కుటుంబ సభ్యులే.  తెలుగు జాతిని ప్రపంచలో నెం.1 గా చేయాలన్నదే నా తపన. భవిష్యత్తు టెక్నాలజీదే అన్న  భావనతో నాడే ఐటీకి శ్రీకారం చుట్టాం.  ఐటీ అంటే దేశంలో మొదట గుర్తొచ్చేది హైదరాబాదే,  హైటెక్ సిటీని 14 నెలల్లో పూర్తి చేశాం. ప్రపంచమంతా తిరిగి ఐటి కంపెనీలు తీసుకొచ్చాం.  బిల్ గేట్ ను రాష్ట్రానికి  తీసుకొచ్చి కంపెనీలు పెట్టించాం.  దాని ఫలితంగా నేడు తెలుగు రాష్ట్రాల్లో  ప్రతి ఊరిలో ఐటి ఉద్యోగులున్నారు. 25 ఇంజనీరింగ్ కాలేజీలను 250 కాలేజీలను చేశాం. నాడు ఐటిని ప్రోత్సహించటం వల్లే నేడు ఎక్కువ మంది యువత ఐటి రంగంలో స్ధిరపడ్డారు.  


నేడు పోన్ అనే ఆయుధం ద్వారా టెక్నాలజీని ఉపయోగించి మన ఆలోచనల్ని ప్రపంచంతో పంచుకోవటం నిమిషం పని.  టెక్నాలజిని ఉపయోగించుకుని ఐటీడీపీ కార్యకర్తలు వైసీపీ పాలన వైఫల్యాలు, వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. అమరావతిపై  హైకోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని మీడియా చానళ్లు లాలూచీ పడి ప్రసారం చేయలేదు. అయినా ప్రజలకు తెలియకుండా ఆగిందా? ‎ఐటీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా జగన్ రెడ్డికి కోర్టు పెట్టిన చివాట్లు ప్రజల్లోకి తీసుకెళ్లలేదా?‎  కొంతమంది మీడియాను వ్యాపారంగా మర్చారు.  


రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ తో రాష్ట్రం ఏర్పడినా టీడీపీ హయాంలో ‎ ప్రజలకు ఏ లోటు లోకుండా పాలన చేశాం. పెట్టుబడులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ది చేశాం. పోలవరాన్ని సోమవరంగా మార్చి  72 శాతం పనులు  పూర్తి చేశాం. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే  2020 జూన్ నాటికి పూర్తయ్యేది.  పోలవరంలో అవినీతి జరిగిందని జగన్ రెడ్డి, బ్లూ మీడియా, పేటీఎం బ్యాచ్ ‎ తప్పుడు ప్రచారం చేశారు. కానీ  పైసా అవినీతిని నిరూపించారా? సొంత బాబాయిని చంపి మొదట గుండెపోటన్నారు, తర్వాత నాపై, టీడీపీ పై తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడు బాబాయిని చంపిందెవరో బయటపటంతో ఏకంగా  సీబీఐపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పులివెందులలో రూ. 40 కోట్లు సుపారీ ఇచ్చేంత  డబ్బు ఎవరి దగ్గర ఉందో రాష్ట్ర ప్రజలకు తెలియదా?. సొంత బాబాయిని క్రూరంగా చంపుకున్నారంటే వాళ్లను ఏమనాలి?  బాబాయిని చంపిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారా? వైసీపీ అంటేనే అబద్దాల పుట్ట, అవినీతికి అడ్డా. గత ఎన్నికల్లో జగన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ తో తప్పుడు ప్రచారం చేయించి గెలిచారు. ఐటీడీపీ కార్యకర్తలు వాస్తవాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించాలి. 


జగన్ రెడ్డి....విద్యార్ధులు, యువత, మహిళలు, రైతులు, కార్మికులు అన్ని వర్గాల ప్రజల్ని దగా చేశారు.  వ్యవ్యస్ధలన్నింటిని ధ్వంసం చేశారు. నిన్న విజయనగరం జిల్లా డిప్యూటీ సీఎంకు చెందిన నియోజకరవర్గం కురుపాంలో పాటు కాటుతో హాస్టల్ లో  విద్యార్ధి చనిపోయాడు. మరో చోట ఆర్టీసీ డ్రైవర్ బస్సులోనే  మహిళపై అత్యాచారానికి యత్నించారు. వైసీపీ పాలనలో పరిస్ధితి ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?  టీడీపీ హయాంలో తప్పు చేయాలంటేనే భయపడేవారు. కానీ నేడు వ్యవస్ధలన్నింటిని విధ్వంసం చేశారు.  టీడీపీ నేతలపై, కార్యకర్తలపై, ఐటీడీపీ కార్యకర్తలపై  అక్రమ కేసులు పెట్టారు. వారు  ఏం తప్పు చేశారని కేసులు పెట్టారు?   ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించకూడదా?  పోలీసులు జాగ్రత్తగా ఉండాలి.  అధికారులు చట్టాన్ని కాపాడితే అండగా ఉంటాం, కానీ  చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 


ఐటీడీపీ విభాగం పార్టీకి మూలస్తంభం. ఐటీడీపీ కార్యకర్తలు వైసీపీ పాలన వైఫల్యాలు ప్రజల్లోకి  తీసుకెళ్తున్న తీరు అబినందనీయం.   ‎పార్టీ కోసం పనిసేవారికి తప్పకుండా న్యాయం చేస్తాం.  వారికి అన్ని విధాల అండగా ఉంటాం. ఐటీడీపీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదును పెంచాలి. ఐటీడీపీ కార్యకర్తలు  టెక్నాలజీతో పాటు సాఫ్ట్ స్కిల్స్ మెరుగుపరచుకోవాలి. డిజిటల్ మెంబర్ షిప్ కు   శ్రీకారం చుట్టాం.  కార్యకర్తల కోసం సంక్షేమ నిధి తెచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ.  పార్టీని డిజిటల్ గా తీర్చిదిద్దాలి.   వైసీపీ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ఉంది. వైసీపీ వైఫల్యాల్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అక్రమ కేసులకు భయపడొద్దు. అధికారంలోకి రాగానే అక్రమ కేసులు ఎత్తేస్తాం. ఐటీడీపీ కార్యకర్తను ‎ఎల్లప్పుడూ అండగా ‎ఉంటాం. ‎మీ ప్రాణాలకు నా ప్రాణాలు ఇచ్చి కాపాడుకుంటానని  చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image