నెల్లూరు (ప్రజా అమరావతి);
ఉక్రెయిన్ నుండి స్వదేశానికి చేరుకున్న బుచ్చిరెడ్డి పాలెం, అంబేద్కర్ నగర్ కు చెందిన సి. హెచ్. లిఖిత్, వారి తండ్రి శ్రీ రాజేష్
శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబును మర్యాదపూర్వకంగా కలసి బొకేను అందచేసి తమ కృతజ్ఞతలు తెలియచేశారు.
ఉక్రెయిన్ లో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న నన్ను నా సొంత ఊరికి చేర్చేందుకు కృషిచేసిన ఇండియన్ ఎంబసీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్ చక్రధర్ బాబుకు తన కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు లిఖిత్ తెలిపారు.
addComments
Post a Comment