ప్రైవేట్ భాగస్వామ్యంతోపర్యాటక
రంగం అభివృద్ధి.
మంత్రి అవంతి శ్రీనివాసరావు
అమరావతి మార్చి 14 (ప్రజా అమరావతి):—
ప్రైవేట్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో
పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయ
నున్నట్టు పర్యాటక, సాంస్కృతిక,
యువజన సంక్షేమం, క్రీడల శాఖ
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
( అవంతి) తెలిపారు.
ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షిం
చేందుకు గాను ఏప్రిల్ 9,10 తేదీల్లో
విశాఖపట్నంలో సదస్సులను నిర్వ
హిస్తున్నట్టు ఆయన చెప్పారు.
సోమవారం వెలగపూడి సచివాల
యంలో పర్యాటక, సాంస్కృతిక
శాఖలపై మంత్రి అవంతి శ్రీనివాస
రావు ఉన్నతాధికారులతో సమీక్ష
నిర్వహించారు.
పెట్టుబడులనుసేకరించడం ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసి
పర్యాటకులను ఆకర్షించడానికి వీలుకలుగుతుందని ఆయన అభి
ప్రాయం వ్యక్తంచేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వం పర్యా
టక రంగ అభివృద్ధిని నీరుగార్చిం
దని మంత్రి విమర్శించారు. ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా పెట్టు బడు
లను సేకరించడంలోను గత ప్రభు
త్వం విఫలమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖకు సంబం
ధించి ప్రత్యేక యాప్ ను రూపొందిం
చాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పర్యాటకులను
ఆకర్షించేందుకుగాను నది పరివాహక ప్రాంతాల్లో బోటింగ్ కు
ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
టూర్ ఫ్యాకేజ్ లను ప్రోత్సహించే విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని
ఆయన కోరారు ఫ్యాకేజ్ లో భాగం
గా రాష్ట్రంలో ఉన్న ఆరు విమానా శ్రయాలనుండి ప్రత్యేక బస్ లను
నడపాలని అవంతి శ్రీనివాసరావు
ఆదేశాంచారు.
అలాగే విశాఖ ,తూర్పుగోదావరి, కడప, గుంటూరు జిల్లాల్లో టూరిజం
ఫెస్టివల్స్ ను ఏర్పాటు చేయాలన్నారు.
పర్యాటక శాఖద్వారా జరుగుతున్న
పనులన్నింటిని తర్వితగతిన పూర్తి
చేయాలని ఆదేశించారు.
పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెస్టారెంట్లలో వసతి
సౌకర్యాలను
మెరుగుపర్చాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ
కంగా చేపట్టిన నవరత్నాల
కార్యక్రమాలఅమలుకు సంబంధిం
చి సాంస్కృతిక శాఖ ద్వారా ఉగాది పురస్కారాలు అందజేయా
లని మంత్రి సూచించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను
విస్త్రతంగా ప్రచారం చేయాలని
ఆయన సాంస్కృతిక శాఖను
ఆదేశించారు.
రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్ధ ఛైర్మన్ వరప్రసాదరెడ్డి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, పర్యాటకాభివృధ్ధి సంస్ధ మేనేజింగ్ డైరక్టర్ సత్యనారా
యణ, ఇతర ఉన్నతాధికారులు
సమీక్షా సమావేశంలో పాల్గోన్నారు.
addComments
Post a Comment