తిరుమల శ్రీ వెం కటేశ్వర స్వామి వారిని దర్శించు కున్న గౌ.భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ.
తిరుమల,మార్చి 06 (ప్రజా అమరావతి);
గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
సతీసమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ ఎన్.వి.రమణ గారికి గౌ.టి టి డి చైర్మన్ శ్రీ వైవి. సుబ్బారెడ్డి,గౌ.తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణా కర్ రెడ్డి,ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు.
స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీ ర్వాదం తో గౌ.భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిం చారు..
అదనపు ఈవో ఎవి. ధర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, విజివో శ్రీ బాలిరెడ్డి పాల్గొన్నారు.
addComments
Post a Comment