రమ్య కేసులో ‘దిశ’ స్ఫూర్తిని ప్రదర్శించారు
పోలీసులకు, ప్రాసిక్యూషన్ న్యాయవాదికి సీఎం అభినందనలు
అమరావతి (ప్రజా అమరావతి): ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ హర్షం వ్యక్తంచేశారు. ‘దిశ’ స్ఫూర్తితో ఈకేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్ న్యాయవాదిని సీఎం అభినందించారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈకేసు చాటిచెప్పిందన్నారు. మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈకోర్టు తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని సీఎం వ్యాఖ్యానించారు. నేరాల నిరోధంలో, దురదృష్టవశాత్తూ జరిగే నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేసి మహిళల భద్రత, రక్షణలకు పెద్దపీట వేయాలన్నారు. దర్యాప్తులో, విచారణలో ఉన్న ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి, దోషులకు కఠినంగా శిక్షలు పడేలా కృషిచేయాలన్నారు.
addComments
Post a Comment