తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదని మంత్రి తెలిపారు

 


రాజమహేంద్రవరం,. (ప్రజా అమరావతి);



విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఆ ఘటన ప్రతి ఒక్కరూ ఖండించాలని, ఆ సంఘటన ద్వారా  రాజకీయంగా  ప్రయోజనం కోసం ప్రతిపక్షాలు ఆరాటపడడం సహేతుకం కాదని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు.


మంగళవారం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఎంపి మార్గాని భరత్ రామ్ తో కలిసి మీడియా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత  మాట్లాడుతూ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక పరిస్థితి సరిగ్గా లేని మహిళపై జరిగిన ఘటన ను ఎవ్వరూ హర్షించరాన్నరు. అటువంటివి సమాజంలో జరగ కూడదన్నారు. ఆ సంఘటన లోని బాధిత కుటుంబాల, బాధితురాలి వివరాలు బహిర్గతం చెయ్యరాదని చట్టాలు స్పష్టంగా తెలియ చేస్తున్నాయన్నారు. ప్రతిపక్ష నేత మీడియా తో కలిసి ప్రచారం కోసం చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.


తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళలపై ఏమాత్రం గౌరవం లేదని మంత్రి తెలిపారు


.


అత్యాచార బాధితురాలి పరామర్శను కూడా చంద్రబాబు రాజకీయం చేశారు.


పోలీసు శాఖ మూడు గంటల్లోనే అత్యాచార నిందితులను పట్టుకోవడం జరిగింది. అంతే కాదు బాధితురాలికి ప్రభుత్వం తరుపున 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చాము.


హోం మంత్రి గా ఉన్న నన్ను ట్రోల్ చేయడం మహిళలకు ఇచ్చే  గౌరవమా..?


మహిళా కమిషన్ ఛైర్మన్ తో టీడీపీ మహిళలు , వర్గాలు అడ్డు తగలడం   కొట్లాలా  వ్యవహరించి, మహిళలు పట్ల వారి వైఖరి తేటతెల్లం చేస్తున్నాయన్నారు.


ఎమ్మార్వో వనజాక్షి విషయంలో అప్పటి సీఎం హోదాలో చంద్రబాబే పంచాయతీ చేశారన్నారు.


మహిళలంతా సీఎం జగన్ వెనక ఉండటాన్ని ప్రతిపక్షం తట్టుకోలేక పోతోంది. సర్వేల ఫలితాలు తెలుసుకుని, ప్రతిపక్షాలు రచ్చ చేస్తున్నాయి.


ప్రతి అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.


గత ప్రభుత్వంలో  మహిళలపై దారుణాలు జరిగితే బయటకు వచ్చేవి కాదు.


మా ప్రభుత్వంపై  నమ్మకంతో బాధితులు  బయటకు వస్తున్నారు.


దిశ యాప్ ద్వారా చాలా మంది మహిళలు తమని తాము రక్షించుకున్న ఘటనలు మంత్రి ప్రస్తావించారు. 


హక్కుల కోసం పోరాడటాన్ని  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు కూడా హర్షిస్తారని తెలిపారు. ఐతే ఇక్కడ జరిగింది ,సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యు.టి.ఎఫ్  యత్నించడం అని, ఇది ఎంతవరకు సరైనదని ఆలోచించుకోవాలి.


రాష్ట్ర ప్రజలందరూ సీఎం జగన్ గారి పాలనపై పూర్తి నమ్మకంతో వున్నారు.


ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకనే ప్రతిపక్షాలు నాయకులు విషప్రచారం చేస్తున్నారన్నారు.


రాష్ట్రంలో జరిగే ప్రతి విషయాన్ని రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకోవాలని కొందరు చూస్తున్నారన్నారు.


ఆంధ్రరాష్ట్ర ప్రజలందరూ  రాష్ట్రంలో జరుగుతున్న ప్రతివిషయాన్ని గమనిస్తున్నారని, ప్రభుత్వంపై అన్యాయంగా చేస్తున్న విష ప్రచారాలను గమనిస్తూనే వున్నారని , తగిన సమయంలో గుణపాఠం చెబుతారని తెలిపారు.


ఇప్పటికైనా ప్రతిపక్షాలు, టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.


ఎంపి మార్గని భరత్ మాట్లాడుతూ, దిశా చట్టానికి కేంద్ర మహిళా మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించి, తదుపరి చర్య కోసం హోం మంత్రిత్వ శాఖ కు సిఫార్సు చేసిందని తెలిపారు.  తదుపరి పార్లమెంట్ లో కూడా తదుపరి సానుకూల నిర్ణయం రావడం దిశగా అడుగులు ముందుకు పడుతున్నట్లు తెలిపారు.

Comments