విజయవాడ (ప్రజా అమరావతి);
వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు - మంత్రి కన్నబాబు
జిల్లాల పునర్విభజన సందర్బముగా అన్ని జిల్లాల అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించిన మంత్రి కన్నబాబు
సమీక్షలో పాల్గొన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనమ్ మాలకొండయ్య , కమిషనర్లు అరుణ్ కుమార్ , శ్రీధర్ , వైస్ ఛాన్సలర్ జానకి రామ్ , ఇతర అధికారులతో మంత్రి సమీక్ష
రైతుకు చేరువలో పాలన మరియు నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుగా జిల్లాల పునర్విభజన చేశారు - కన్నబాబు
వ్యవసాయ రంగంలో గడిచిన మూడేళ్ళలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాం - కన్నబాబు
రైతు ప్రతి అవసరాన్ని రైతు ముంగిటకొచ్చి ఆర్బీకేలా ద్వారా తీరుస్తున్నాం -కన్నబాబు
సీఎం జగన్ ఆదేశాలతో రైతు ఆర్థిక ప్రయోజనాల కోసం పెట్టుబడి సాయం అందించడమే కాకుండా నాణ్యమైన ఇన్పుట్స్ సరఫరా చేస్తున్నాం
తక్కువ పెట్టుబడి , ఎక్కువ దిగుబడితో రైతుకు ఆర్ధిక ప్రయోజనాలు కలిగేలా ప్రతి స్టేజీలోనూ రైతుకు అండగా నిలిచాం
addComments
Post a Comment