పాలనా వికేంద్రీకరణ


అమరావతి (ప్రజా అమరావతి);


*పాలనా వికేంద్రీకరణ*


*13 కొత్త జిల్లాల ఏర్పాటుతో నేటి నుండి (04.04.2022, సోమవారం) పునర్‌వ్యవస్ధీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌*


*సత్వరాభివృద్ధి, సమగ్రాభివృద్ధి, సమానాభివృద్ధి, సర్వజనాభివృద్ధి, సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా పాలనా వికేంద్రీకరణ*


*నేడు ఉదయం (04.04.2022, సోమవారం) గం.9.05 – 9.45 నిముషాల మధ్య క్యాంప్‌ కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*అభివృద్ధి ఏ ఒక్క వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదు. పాలన సామాన్య ప్రజలకు, బడుగు, బలహీనవర్గాలకు చేరువగా ఉండాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ పారదర్శకంగా, ఇంకా మెరుగ్గా అందాలన్న సమున్నత లక్ష్యంతో మ్యానిఫెస్టోలో చేసిన వాగ్ధానాన్ని నెరవేరుస్తూ, రాష్ట్ర పరిపాలనా చరిత్రలో నవశకానికి నాంది పలుకుతూ శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేస్తున్న జిల్లాల పునర్‌వ్యవస్ధీకరణ*.


*నిన్న...గ్రామ వార్డు సచివాలయాల ద్వారా పాలనా వికేంద్రీకరణలో తొలి అడుగు*

*నేడు...కొత్త జిల్లాల ఆవిర్భావంతో ఈ దిశగా మరో అడుగు*

*రేపు...ఇదే స్పూర్తితో 3 ప్రాంతాల సమానాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు*


*ప్రజలకు మరింత చేరువగా పాలన*

చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా జిల్లా కేంద్రం నుండి మారుమూల, సరిహద్దు గ్రామాలకు సైతం తగ్గనున్న దూరాభారం. ప్రజలకు మరింత చేరువకానున్న జిల్లా పరిపాలనా యంత్రాంగం. ప్రజల ఇంటి వద్దకు పాలన చేర్చడం ద్వారా ఇంకా పెరగనున్న జవాబుదారీతనం


*పథకాల అమలులో మరింత వేగం*

పాలనా పరంగా పెరగనున్న పర్యవేక్షణ. అభివృద్దికి దూరంగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించే వెసులుబాటు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్ధాయిలో మరింత వేగంగా, మరింత పారదర్శకంగా అమలుచేసే అవకాశం


*అన్ని ప్రాంతాల సమతులాభివృద్ధి*

కొత్త జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధిలో ప్రాదేశిక సమానత్వం, సమ్మిళిత ఆర్ధిక వృద్ధి, బడుగు, బలహీన వర్గాల వికాసం, పరిపాలనా ప్రధాన కార్యాలయాల సామీప్యత, సుస్ధిర ప్రగతికి దోహదం


*జిల్లాల ఏర్పాటులో హేతుబద్ధత*

ప్రతి జిల్లా దాదాపు ఒక పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఉండేలా కొత్త జిల్లాలు. ప్రతి జిల్లాలో సగటున 6 లేదా 7 లేదా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు. 18 నుండి 23 లక్షల మంది జనాభా. గిరిజన సోదరుల అభివృద్ధి, సంక్షేమం, దూరం దృష్ట్యా అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం మాత్రం రెండు ప్రత్యేక జిల్లాలుగా ఏర్పాటు


*ప్రజా సౌకర్యం – పరిపాలనా సౌలభ్యం*

ప్రజా సౌకర్యం, పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి జిల్లాలో కనీసం 2 లేదా మూడు, లేదా నాలుగు రెవెన్యూ డివిజన్‌లు ఉండేలా కొత్తగా 23 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు. రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12 మినహా, ఒక అసెంబ్లీ నియోజకవర్గం పూర్తిగా ఒకే జిల్లాలో ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటు


*ఒకే ప్రాంగణంలో అన్ని కార్యాలయాలు*

వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం ప్రజలు వ్యయప్రయాసలకోర్చి మైళ్ళ కొద్ది తిరిగే దుస్ధితిని తొలగిస్తూ జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్‌ అధికారి కార్యాలయాలు, వారి క్యాంప్‌ కార్యాలయాలతో సహా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా కనీసం 15 ఎకరాల సువిశాల స్ధలంలో మంచి డిజైన్లతో పది కాలాల పాటు గుర్తుండే విధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం


*ప్రజాభిప్రాయానికి అనుగుణంగా*

సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక నేపథ్యంపై లోతైన అధ్యయనం, ప్రజల నుండి వచ్చిన 17,500 పైగా విజ్ఞప్తుల పరిశీలన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నూతన జిల్లాలు ఏర్పాటుచేసిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.

Comments