తూర్పు గోదావరి జిల్లా రైతులకు విజ్ఞప్తి జూన్ 1న కాలువల కాలువల ద్వారా సాగుకు నీటిని విడుదల చేస్తాం



రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);


* తూర్పు గోదావరి జిల్లా రైతులకు విజ్ఞప్తి జూన్ 1న కాలువల కాలువల ద్వారా సాగుకు నీటిని విడుదల చేస్తాం



* నేను పాలకుడిని కాదు సేవకుడిని అనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలి


 * ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా రైతులు అడుగులు వేయాలి 


* ప్రకృతి విపత్తుల నుండి రైతులను కాపాడాలి  అన్నది సీఎం ఆలోచన... 


పత్రికా విలేఖరుల సమావేశంలో హోం మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, ఉభయ గోదవరి జిల్లాల జెడ్పీ  చైర్మన్లు వి. వేణుగోపాల్ రావు, కవురు శ్రీనివాస్ లు


మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ


బుధవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో


జిల్లా ఇంఛార్జి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ, సుమారు నాలుగు గంటల సమయం జిల్లా సమీక్షా సమావేశం లో పలు సంక్షేమ,అభివృద్ధి అంశాలు, ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాకు నూతన కలెక్టర్ గా వచ్చిన మాధవి లత వారి ఆధ్వర్యంలో తొలి సమావేశం చక్కగా నిర్వహించామని ఇది టీం వర్క్ ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ అభివృద్ధి ప్రాధాన్యత అంశాలపై తెచ్చామని దేశంలో ఎక్కడా లేని విధంగా 33 లక్షల మంది ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు. గజం ఇంటి స్థలం లేని పేదలకు ఏడేనిమిది లక్షలు ఖరీదు చేసే భూమిని ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఆర్థిక చేయుతను అందిస్తున్నామన్నారు. ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చాలని ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా ఇప్పటికే 90% మంది ప్రజలు ఇంటి నిర్మాణాలు పల్లె పనులను చేపట్టారన్నారు. మిగిలిన 10 శాతం స్థానిక ఇబ్బందులు తదితర కారణాలతో జాప్యం జరుగుతోందని వాటికి కూడా త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. ఇప్పటికే ఇంటి నిర్మాణాలు చేపట్టిన పూర్తి చేసిన కాలనీలో సదుపాయాలు త్రాగు నీరు విద్యుత్ రోడ్ల తదితర పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ అంశాలు సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని మంత్రి వేణు గోపాల కృష్ణ తెలిపారు.



తూర్పు గోదావరి జిల్లా చరిత్రలో గత 20 సంవత్సరాలుగా చూడని విధంగా జూన్ ఒకటో తేదీ కాలువలకు సాగు నీరు అందించి పంటలు వేసే పరిస్థితి కల్పిస్తున్నామని మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాలకృష్ణ అన్నారు. ఆలస్యంగా పంట వేస్తే ప్రకృతి విపత్తులకు తుఫాను, వరదలు వలన అపారంగా నష్టపోయిన రైతులకు ఆ సమస్య రాకుండా ముందస్తు పంటను వేసుకునే ఈ విధంగా కాలువల ద్వారా సాగునీరు అందిస్తున్నామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో  కూడా రైతుల కోసం ఇంతగా ఆలోచించే ముఖ్యమంత్రి మరొకరు లేరన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం,  నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు  సకాలంలో అందించడం ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నామన్నారు. రైతులు ఏ పంట వేస్తున్నారు దానికి గిట్టుబాటు ధర కల్పించడం జరిగిందన్నారు. ప్రకృతి బారిన పడి రైతులు కాకుండా నష్టపోకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవడం  ద్వారా రైతులకు భరోసా ఇవ్వగలమో ఆలోచన చేస్తున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతు యొక్క క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ మార్కెటింగ్ తదితర శాఖలతో జాయింట్ కలెక్టర్ చర్యలు తీసుకోవడం సమన్వయం చేస్తున్నారని తెలిపారు.  ఈ క్రాప్ బుకింగ్ విధానాల్లో లోటుపాట్లను సరి చేసి రైతులకు అండగా ఉండేలాగా  చర్యలు తీసుకుంటున్నా రన్నారు. రైతులు ఆలోచన చేయాలని ఈ ప్రభుత్వం  ఏ సీజన్లో అయితే రైతుకు నష్టం వాటిల్లిందో, అదే సీజన్లో  ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రైతులను మోసగిస్తే ఈ ప్రభుత్వం అడుగడుగున రైతులకు భరోసా కలిగిస్తోందన్నారు. జూన్ 14న రైతుల కోసం ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకు లక్ష నాలుగు వేల కోట్ల మేర  ప్రయోజనాన్ని రైతులకు కల్పించామన్నారు. రైతు భరోసా ద్వారా రూ.23,075 లక్షలు రైతులకు అందించామన్నారు. రైతుల కోసం ఆలోచనలు చేసి ముందస్తుగా నీటిని విడుదల చేస్తున్నందున జూన్ 1న పంటలు వేసుకునేందుకు రైతులు సిద్ధంగా ఉండాలన్నారు.



నాడు నేడు పాఠశాల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా, హార్టికల్చర్ సిరికల్చర్ అనుబంధం వ్యవసాయ రంగాలపై సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం  సామాన్యులకు, నిరుపేదలకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి దిశా నిర్దేశం పని చేస్తున్నామని మంత్రి తెలిపారు. "జగన్ అంటే నిజం" అని నాడు అన్నాను నేడు "జగన్ అంటే భరోసా" అని అంటున్నానని మంత్రి పేర్కొన్నారు. పేదవాడికి భరోసా ఈ ప్రభుత్వాన్ని పిలిచే లాగా గర్భస్థ శిశువు నుండి ముదసలి వరకు  భరోసా కల్పిస్తూ నాది ఈ ప్రభుత్వం  అనే తరహాలో సంక్షేమ పాలన అందిస్తోందన్నారు. ఈరోజు జరిగిన జిల్లా సమీక్ష సమావేశం ఎంతో చక్కటి వాతావరణం జరిగిందని ప్రజా ప్రతినిధులు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చి చర్చించి చక్కటి పరిష్కార మార్గాలు సూచనలు చేయడం ప్రజా ప్రతినిధుల ప్రశ్నలకు వారిని సంతృప్తి చేసేలా అధికారులు వివరణ ఇవ్వడం జరిగిందని అన్నారు. తదుపరి సమావేశం నాటికి అధికారులు మరింత సమగ్ర నివేదికలతో,  సమాచారంతో హాజరు కావాలని పేర్కొన్నారు. .


నేను పాలకుడిని కాదు సేవకుడిని అనే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పని చేయాలని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నడిపించాలని మంత్రి కోరారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యము కీలకమన్నారు.  అదే ఆశయసాధనతో పని చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి  వేణుగోపాలకృష్ణ తెలియజేశారు


ప్రజలందరికీ మంచి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. ఈరోజు జరిగిన తూర్పు గోదావరి జిల్లా సమీక్షా సమావేశంలో గత మూడు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అందరితో కలిసి జిల్లాలు అభివృద్ధి పథంలో నడిపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌసింగ్ కార్యక్రమం పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న కాలనీ లో ఏ విధంగా మౌలిక వసతులు కల్పించాలి ఈ అంశంపై అధికారులకు దిశా నిర్దేశం చేయమన్నారు అధికారులు కూడా సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. వ్యవసాయం ఉపాధి హామీ పనులపై సమీక్షించామని, జిల్లాలో రైతులు  కోతలను(హార్వెస్టింగ్) చేస్తున్నారని జరుగుతున్నాయని, ధాన్యం సేకరణ కొనుగోలు అంశాలపై రైతులకు అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నామన్నారు. చిన్న జిల్లాలు ఏర్పాటు చేయడం ద్వారా అధికారులతో పాటు ప్రజలు కూడా ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కారం చూపేందుకు జగనన్న పరిపాలన వికేంద్రీకరణ ఎంత దోహదం  చేస్తున్నదన్నారు. జిల్లా స్థాయి నుండి  మండల స్థాయి,  గ్రామస్థాయి వరకు పరిపాలనను అందించడం సాధ్యమైందన్నారు. ప్రజలకు సంబంధించిన చిన్న సమస్య అయినా జిల్లా కలెక్టర్ స్థాయి నుండి  చర్చించి పరిష్కారం చూపేందుకు అవకాశం ఏర్పడినట్లు మంత్రి తానేటి వనిత తెలిపారు. సమావేశంలో చర్చించిన సమస్యలకు తదుపరి సమావేశానికి పరిష్కారం చూపడం జరుగుతుందని, తక్షణ పరిష్కారం చూపే విషయంలో అధికారులకు సూచనలు చేశామన్నారు. సమావేశం ఎంతో ఫలవంతం అయిందని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు చర్చించిన అంశాలను దృష్టిలో పెట్టుకుని , వారి సూచనలను పరిగణన లోకి  తీసుకోవడం  జరుగుతుందన్నారు.  సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కారం చూపుతామని ఒకవేళ రాష్ట్రస్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపుతామన్నారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image