ఈ నెల 12 లేదా 13 తేదీల్లో డీఆర్సీ సమావేశం

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): 



* ఈ నెల 12 లేదా 13 తేదీల్లో డీఆర్సీ సమావేశం


..


* అధికారులు వారి శాఖల నివేదికలతో సిద్దంగా ఉండాలి


* ఈ రోజు స్పందనలో 140 ఫిర్యాదులు అందాయి.


- కలెక్టర్ డా. కె. మాధవీలత 


ప్రజల సమస్యల పరిష్కార వేదిక స్పందన లో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా అర్జీ దారునికి న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత అధికారులను ఆదేశించారు. .



సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో  స్పందన కార్యక్రమం లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తదితర జిల్లా అధికారులతో  కలిసి డా. మాధవీలత  ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ ఈ వారం ప్రజల నుంచి  140   అర్జీదారులు స్పందన   ఫిర్యాదులు  అందచేసారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి కి అనుగుణంగా జిల్లాలు ఏర్పాటు చేసిందన్నారు. ప్రజా సమస్యలకు క్షేత్ర స్థాయిలో పరిష్కారం చూపే ప్రయత్నం లో భాగంగా ప్రతి నియోజకవర్గ పరిధిలో స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చెయ్యడం జరుగుతోందన్నారు. ఒక వారం జిల్లా కలెక్టరేట్ నందు మరో వారం నియోజకవర్గ పరిధిలో స్పందన నిర్వహించడం ద్వారా జిల్లా యంత్రాంగం ప్రజలతో మమేకమౌవడానికి  అవకాశం ఉందని తెలిపారు. 

నూతనంగా జిల్లా వ్యవస్థ ఏర్పాటు చేసిన దృష్ట్యా వైద్య - ఆరోగ్య, రెవెన్యూ, మైన్స్, గ్రౌండ్ వాటర్, జలవనరుల,  ఆర్.డబ్ల్యు.ఎస్, పిఆర్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్, ఆర్ అండ్ బి, ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమం వంటి తదితర  శాఖలకు సంబంధించిన రాష్ట్ర అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. అందులో భాగంగా ఆయా శాఖలు జిల్లా లో రూపొందించిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అదేవిధంగా క్షేత్ర స్థాయిలో జిల్లా అధికారులు పర్యటించే వివరాలు

ఏ రోజుకారోజు  జిల్లా అధికారుల వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చెయ్యలని పేర్కొన్నారు. అదేవిధంగా నివేదికలు సమర్పించాలని తెలిపారు.


మే 12, 13 తేదీల్లో ఒకరోజు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం (DRC)  నిర్వహించ నున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలిపారు. ఆ సమావేశానికి సంబందించిన అంశాలతో ఆయా శాఖలు  సమగ్రమైన సమాచారాన్ని అందచేయ్యలన్నారు. మంగళ వారం సాయంత్రం జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 

జిల్లా సమీక్ష కమిటీ సమావేశానికి (DRC)జిల్లా ఇంఛార్జి మంత్రి,  మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో శాఖల వారి ప్రగతిని వివరించేందుకు  అధికారులు పూర్తి సమాచారంతో హాజరు కావాల్సి ఉంటుందన్నారు


 రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణాలను నిర్ణీత సమయం పూర్తి చెయ్యాలనే ఉద్దేశంతో ఉందని, అందులో భాగంగానే స్వయం సహాయక సంఘాలు మహిళలకు డిఆర్డీఏ, మెప్మా ద్వారా రు.35-50 వేలు వరకు రుణ సౌకర్యం కల్పిస్తుందని, ప్రభుత్వం ఇంటి స్థలం తో ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.1,80,000 లను ఆర్థిక సహాయం చేస్తోందన్నారు. ఇంటి నిర్మాణంకి అవసరమైన సిమెంట్, ఐరన్, ఇసుక వంటి ముడి సరుకులు కూడా సరసమైన ధరలకు లే అవుట్ వద్దే అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. 


జిల్లాలో అన్ని రెవెన్యూ, మండల, సచివాలయాలలో ప్రజలనుంచి అర్జీలు సంబందించిన అధికారులు, సిబ్బంది  స్వీకరించారన్నరు. ఈరోజు ప్రజల నుంచి 140 స్పందన ఫిర్యాదులు అందయన్నారు. సామాజిక పెన్షన్,  భూమి సంబంధ అంశాలు, ఇండ్ల స్థలాలు, భూముల  సరిహద్దు వివాదాలు, రేషన్ కార్డులు, ఇసుక, గృహ నిర్మాణం, తదితర సమస్యల పరిష్కారం కొరకు అర్జీ లను అందచేశారన్నారు.  


ప్రజా ప్రతినిధులు క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించడం జరుగుతోందని, వాటి పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పై మండల  ప్రత్యేక అధికారులు దృష్టి సాధించి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. 


ఈ స్పందన కార్యక్రమం లో జేసీ సిహెచ్. శ్రీధర్, డీఆర్వో బి. సుబ్బారావు, జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డా. ఆర్.స్వర్ణలత, డిహెచ్ఓ బి. తారాచంద్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్. మాధవరావు, సీపీఓ శ్రీమతి పి.రాము, డిఎమ్ సివిల్ సప్లై కె.తులసి, డిఎస్ఓ పి.ప్రసాదరావు, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డా.ఎస్టిజి సత్యగోవిందం, డీఈఓ అబ్రహం, డీఎస్ ఈడబ్ల్యూ & ఈఓ ఎమ్ ఎస్ శోభారాణి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image