నా నియోజకవర్గంలో ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇస్తా



- నా నియోజకవర్గంలో ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇస్తా


- లేకుంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తి ఉండదు

- ఏ ఒక్కరికైనా ఇల్లు, స్థలం ఇవ్వకుంటే ఓటు వేయొద్దు

- వైఎస్సార్ ఇచ్చిన 77 ఎకరాల్లో 8,912 టిడ్కో ఇళ్ళ నిర్మాణం

- రూ.23 కోట్లతో గుడివాడలో బస్టాండ్ను నిర్మిస్తున్నాం

- రూ.13 కోట్లతో ప్రభుత్వాసుపత్రిలో భవన నిర్మాణం

- రూ.340 కోట్లతో భీమవరం, మచిలీపట్నం రైల్వేగేట్లపై ఫ్లైఓవర్

- రూ.30 కోట్ల మయిపాలెం రైల్వేగేటుపై మరో ఫ్లైఓవర్

- రూ.50 కోట్లతో నియోజకవర్గంలోని కాలనీల్లో రోడ్ల నిర్మాణం

- కనీవినీ ఎరుగని రీతిలో గుడివాడను అభివృద్ధి చేస్తా

- గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)



గుడివాడ, మే 11 (ప్రజా అమరావతి): గుడివాడ నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి నిరుపేదకూ ఇంటిని నిర్మించి ఇస్తానని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. లేకుంటే 2024 ఎన్నికల్లో తాను పోటీ చేసే ప్రసక్తి ఉండదన్నారు. ఏ ఒక్కరికైనా ఇల్లు, ఇంటి స్థలం ఇవ్వకుంటే తనకు ఓటు వేయొద్దని ఆయన చెప్పారు. బుధవారం గుడివాడ పట్టణంలోని 22 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొడాలి నాని ఇంటింటికీ వెళ్ళి ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపారు. మరికొన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం కొడాలి నాని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో 8,912 టిడ్కో ఇళ్ళను నిర్మిస్తున్న ఏకైక నియోజకవర్గం గుడివాడ అని అన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణానికి అవసరమైన 77 ఎకరాల భూమిని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసంపూర్తిగా ఉన్న ఇళ్ళ నిర్మాణాలను సీఎం జగన్మోహనరెడ్డి సహకారంతో పూర్తి చేయిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 30 లక్షలకు పైగా ఇళ్ళను పేదప్రజలకు నిర్మిస్తున్నామన్నారు. దివంగత రాజశేఖరరెడ్డి, సీఎం జగన్మోహనరెడ్డిలు లేకుంటే గుడివాడ పట్టణంలో 16 వేల మంది నిరుపేదలు ఇళ్ళు లేకుండా అల్లాడుతూ ఉండేవారన్నారు. అర్హులైన పేదలందరికీ కేటాయించిన స్థలాల్లో ఇళ్ళ నిర్మాణాలను పూర్తిచేసి అప్పగిస్తామన్నారు. 2024 ఎన్నికల నాటికి గుడివాడ పట్టణంలో అర్హత కలిగి టిడ్కో గృహం లేక ఇంటి పట్టా రాలేదని చెప్పినా తాను ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. గుడివాడ నియోజకవర్గంలో 20 ఏళ్ళు పాలించిన 420 వ్యక్తులు, చంద్రబాబు మాదిరిగా అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా తనను గెలిపించారని, మూడుసార్లు అధికారంలో లేనని తెలిపారు. ఈసారి ఐదేళ్ళు అధికారం ఇచ్చారని, వచ్చే రెండేళ్ళలో గుడివాడ నియోజకవర్గంలో 22 వేల మందికి టిడ్కో ఇళ్ళు, ఇళ్ళపట్టాలను అందజేసి లబ్ధిదారులందరూ సొంత ఇళ్ళలో నివశించే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టామన్నారు.

రాష్ట్రంలో 1983 లో టీడీపీ పార్టీ ఆవిర్భవించిందన్నారు. 1985 నుండి మాజీ ఎమ్మెల్యే రావి శోభనాద్రిచౌదరి, ఆయన కుమారులు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారన్నారు. వీరిని గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ కట్టవద్దని ఎవరైనా ఆపారా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.23 కోట్లు ప్రభుత్వ నిధులతో గుడివాడలో ఆర్టీసీ బస్టాండ్ ను నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల లోగా నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. ఎన్టీఆర్ హయాంలో నిర్మించిన గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రి భవనం శిథిలావస్థకు చేరిందన్నారు. ఈ భవనం స్థానంలో కొత్త భవనాన్ని రూ.13 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. మరో రూ.5 కోట్లతో డయాలసిస్ యూనిట్లు వంటి మౌలిక వసతులను కూడా కల్పిస్తామన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా ఏరియా ప్రభుత్వాసుపత్రిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలోనే గుడివాడలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగిందన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ప్లై ఓవర్ కూడా నిర్మించలేదన్నారు. గుడివాడ - పామర్రు రోడ్డులో ఉన్న భీమవరం, మచిలీపట్నం రైల్వే గేట్ల దగ్గర ఫ్రై ఓవర్లను నిర్మించాల్సి ఉందన్నారు. రూ.340 కోట్లతో గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి గుడివాడ రూరల్ మండలం బిళ్ళపాడు వరకు ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నామన్నారు. గుడివాడ పట్టణంలో ట్రాఫిక్ కు ఇబ్బందులు లేకుండా ఈ ఫ్లైఓవర్ ఉపయోగపడుతుందన్నారు. భీమవరం, మచిలీపట్నం రైల్వేగేట్ల దగ్గర సబ్ వేలను కూడా నిర్మిస్తున్నామన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం రైల్వే గేటు దగ్గర రూ.30 కోట్లతో మరో ఫ్లైఓవర్ ను నిర్మిస్తామన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని మందపాడు, ధనియాలపేట, వాంబేకాలనీ, ఇందిరానగర్ కాలనీలు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ హయాంలో ఏర్పడ్డాయన్నారు. ఈ కాలనీల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం జగన్మోహనరెడ్డి రూ. 50 కోట్లు కేటాయించారన్నారు. టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి వచ్చే ఆరు నెలల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని, విద్యుత్, తాగునీటి సౌకర్యాలను కూడా కల్పిస్తామన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోందని, ఈ సందర్భంగా ప్రజలను కలుస్తున్నామన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని అధికారులు, పార్టీ ముఖ్యనేతల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్ని కోట్లు ఖర్చు అయినా ప్రాధాన్యతా క్రమంలో అన్ని సమస్యలనూ పరిష్కరించడంతో పాటు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఐదేళ్ళ పాలనలో గుడివాడ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తానని కొడాలి నాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు పాలేటి చంటి, నాయకులు పాలడుగు రాంప్రసాద్, పసలాది ఏసుబాబు, పసలాది శేఖర్, యార్లగడ్డ సత్యభూషణ్, గుత్తా నాని, తోట రాజేష్, మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image