వీరతిలకం దిద్దినాము - విజయులై తిరిగిరండి’-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొనున్న క్రీడాకారుల ముఖాముఖిలో మంత్రి ఆర్కే రోజా.

 

విజయవాడ (ప్రజా అమరావతి);


‘వీరతిలకం దిద్దినాము - విజయులై తిరిగిరండి’-ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొనున్న క్రీడాకారుల ముఖాముఖిలో మంత్రి ఆర్కే రోజా.


ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో పాల్గొననున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రాష్ట్ర పర్యాటక, క్రీడలు సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా ముఖాముఖి నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా సాధికార సంస్థ (శాప్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీరతిలకం దిద్దినాము - విజయులై తిరిగిరండి’కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని  ప్రతిఒక్కరినీ ఆశీర్వదించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రం నుంచి 19 విభాగాల్లో 160 మంది క్రీడాకారులు హర్యానాలో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఎంపికకావడం గర్వకారణమని, ఏపీ క్రీడాచరిత్రలో శుభదినమని అన్నారు. వేదికపై త్యంగ్-ట, టేబుల్ టెన్నిస్ ఆటలను మంత్రి రోజా, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. బ్రెజిల్ లో నిర్వహించిన 2021 డెఫ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన షేక్ జఫ్రీన్ ను మంత్రి, శాప్ ఛైర్మన్ లు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. మూడవ జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ - 2022 పోస్టర్ ను మంత్రి రిలీజ్ చేశారు. అనంతరం క్రీడాకారుల డెమోలను ప్రదర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన క్రీడాకారుల మల్లఖాంబ్ ఆట ప్రత్యేక ప్రదర్శనగా ఆకట్టుకుంది. ఖేలో ఆంధ్రా, జయహో ఆంధ్రా అని నినాదాలు మార్మోగాయి.

మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ.. 4వ ఖేలో ఇండియాకు ఎంపికైన క్రీడాకారులందరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నా అన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లు ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఉందని.. కానీ ఈ సంవత్సరం గతంలో ఎన్నడూ లేని విధంగా 19 విభాగాల నుంచి 160 మంది ఎంపిక కావడం  ఆంధ్రప్రదేశ్ లో క్రీడలకు ఇస్తున్న ప్రొత్సాహాన్ని తెలుపుతుందన్నారు. ఎంపికైన వారిలో ఎక్కువగా అమ్మాయిలు ఉన్నారని.. మారుతున్న కాలంలో ప్రతి విషయంలో అబ్బాయిలకు దీటుగా అమ్మాయిలు ఎదుగుతున్నారన్నారు. ఆడపిల్లలకు ఆత్మరక్షణగా ‘జూడో’ ఉపయోగపడుతుందని మంత్రి రోజా అన్నారు. హర్యానాలో జరిగే 4వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కార్యక్రమానికి క్రీడాకారులందరికీ తోడుగా.. మేము కూడా వస్తామని, సర్ ప్రైజ్ గా వస్తామని మంత్రి తెలిపారు.  జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత యువతను, క్రీడలను బలంగా ప్రొత్సహిస్తున్నారన్నారు.  శాప్ కు యువ ఛైర్మన్ ను నియమించారని, క్రీడలను, క్రీడాకారులను ప్రొత్సహించేలా ఛైర్మన్ తీసుకున్న చర్యలు అభింనదనీయమన్నారు. క్రీడలకు మంచి రోజులు వచ్చాయన్నారు. సమ్మర్ క్యాంప్స్ ప్రారంభించామని, దాదాపు 45 వేల మంది వరకూ శిక్షణ పొందుతున్నారన్నారు. మెడల్ సాధించాలని ధ్యేయంగా పెట్టుకుని.. దానికి తగిన విధంగా కృషి చేస్తే తప్పకుండా విజేతలుగా నిలుస్తారని క్రీడాకారుల్లో ధైర్యాన్ని నింపారు. మరేతర రంగాల్లో లేనివిధంగా క్రీడాకారులకు దేశాన్ని రిప్రజెంట్ చేసే గొప్ప అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈసారి జరిగే ఖేలో ఇండియాలో రాష్ట్రానికి అత్యధిక మెడల్స్ వస్తాయని మంత్రి ఆకాంక్షించారు. 


శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి మాట్లాడుతూ.. క్రీడాకారులందరూ ఖేలో ఇండియాలో మెడల్స్ కొడితే మాకు ఎంతో ఆనందమన్నారు. మీరంతా ఉత్తమ ప్రతిభ చూపి రాష్ట్రానికి , దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనసారా ఆకాంక్షించారు. ప్రతి క్రీడాకారుడికి గుర్తింపు పెరగాలనే లక్ష్యంతో సీఎం కప్, శాప్ లీగ్స్, సమ్మర్ క్యాంపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో శాప్ కార్యాలయం కూడా ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు డైరెక్ట్ గా వచ్చి కలిసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రపంచంలో స్పోర్ట్స్ స్టార్ కి ఉన్నంత క్రేజ్ మరెవరికీ ఉండదన్నారు. అయితే శ్రమపడకుండా, ఏ ఒక్కరూ రాత్రికి రాత్రే ఎవరూ స్టార్ అయిపోరని గుర్తించాలని సూచించారు. డెఫ్ ఒలింపిక్స్ లో షేక్ జఫ్రీన్ పతకం సాధించడం వెనుక కష్టాన్ని అందరూ గుర్తించాలని, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నాకు స్పూర్తి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డే అని.. వ్యక్తిగత జీవితాన్ని కూడా వదులుకుని పాదయాత్ర చేసి, ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొని 9 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. రాష్ట్రంలోని క్రీడాకారులందరూ ‘మీ కష్టం మీరు చేయండి.. మీ భవిష్యత్తుకు మాది బాధ్యత’ అని అభయం ఇచ్చారు. ఖేలో ఇండియాలో సర్టిఫికేట్ తీసుకున్నవారికి తగిన న్యాయం చేసే విధంగా స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. శాప్ టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చామని, ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పవచ్చని ఛైర్మన్ తెలిపారు. 

డెఫ్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత షేక్ జఫ్రీన్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి అనేక సవాళ్లను దాటుకుని అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించడం చాలా ఆనందంగా ఉందని, మరిచిపోలేని అనుభూతి అన్నారు. త‌న తండ్రి నుంచి, కుటుంబం నుంచి ల‌భించిన ప్రోత్సాహం, మ‌ద్ద‌తు మాటల్లో చెప్పలేనిదని ఆమె తెలిపారు.

హర్యానాలో జరిగే నాల్గవ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ - 2021లో అండర్-17 కేటగిరీ బాలురు, బాలికల విభాగంలో 160 మంది క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ నుండి 19 విభాగాల్లో ఎంపికయ్యారు. ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో గట్కా, మల్లఖాంబ్, త్యంగ్-ట అనే మూడు కొత్త విభాగాలు నిర్వహించనున్నారు. మొత్తం 24 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులు 19 విభాగాల్లో ఎంపికకావడం శాప్ చేస్తున్న కృషికి నిదర్శనం.  ఆర్చెరీ నుంచి ఆరుగురు, అథ్లెటిక్స్ ఐదుగురు, బ్యాడ్మింటన్ ఒకరు, బాక్సింగ్  12 మంది, సైక్లింగ్  ఇద్దరు, గట్కా 16 మంది, జిమ్నాస్టిక్స్ ఒకరు, హ్యాండ్ బాల్ 16 మంది, జూడో 9 మంది, కబడ్డీ 24 మంది (పురుషులు, స్త్రీలు), ఖో ఖో - 12 మంది, మల్లఖాంబ్ - 12 మంది, షూటింట్ ఇద్దరు, స్విమ్మింగ్ ఆరుగురు, టేబుల్ టెన్నిస్ ఇద్దరు, టెన్నిస్ ఒకరు, త్యంగ్-ట ఐదుగురు, వెయిట్ లిఫ్టింగ్ 22 మంది, రెజ్లింగ్ ఆరుగురు ఎంపికయ్యారు.

ప్రత్యేక ఆకర్షణగా భీమవరం విద్యార్థులు చేసిన మల్లఖాంబ్...

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విద్యార్థులు చేసిన మల్లఖాంబ్, రోప్ స్కిప్పింగ్ లు చూపరులను కట్టిపడేశాయి. మల్లఖాంబ్ క్రీడ మధ్యప్రదేశ్ కి చెందిన క్రీడ అని, వీటిలో పోల్ మల్లఖాంబ్, రోప్ మల్లఖాంబ్ అని రెండు రకాలుంటాయని కోచ్ జీ.పీ.సీ. శేఖర్ రాజు తెలిపారు. కోచ్ శేఖర్ రాజుకి మంత్రి, శాప్ ఛైర్మన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. మల్లఖాంబ్ వంటి క్రీడలకు ప్రోత్సాహానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్రీడల్లో ఎక్కువ ఆసక్తి కనబరుస్తారన్నారు. మల్లఖాంబ్ క్రీడాకారులతో మంత్రి రోజా సెల్ఫీ తీసుకున్నారు. 


ఈ కార్యక్రమంలో శాప్ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్. ప్రభాకర్ రెడ్డి, శాప్ బోర్డు మెంబర్స్, వివిధ క్రీడా అసోసియేషన్స్ సభ్యులు, కోచ్ లు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image