ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు

 

అమరావతి, మే 19 (ప్రజా అమరావతి):

ప్ర‌జ‌ల ప్రాణాల కంటే ఏదీ ఎక్కువ కాదు


రాష్ట్రంలో వైద్య విధానం పూర్తిగా మారుతోంది

ఆరోగ్యాంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న‌న్న ల‌క్ష్యం

ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాలి

న‌కిలీ మందుల‌పై ఉక్కుపాదం మోపండి

నిజాయితీగా ప‌నిచేసే అధికారుల‌కు అండ‌గా ప్ర‌భుత్వం

అవినీతి లేని పాల‌న జ‌గ‌న‌న్న ల‌క్ష్యం

లైసెన్సుల జారీ, రెన్యువ‌ల్ పార‌ద‌ర్శ‌కంగా జ‌ర‌గాలి

డ్ర‌గ్స్ విభాగం సిబ్బందికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు


ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. రాష్ట్రంలోని డ్ర‌గ్స్ విభాగం అధికారులంద‌రితో క‌లిసి గురువారం మంత్రి సెక్రటేరియ‌ట్ లో విస్తృత‌స్థాయి స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. డ్ర‌గ్స్ విభాగం తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, చేప‌ట్టాల్సిన చ‌ర్య‌ల‌ను ఆమె ఈ సంద‌ర్భంగా సిబ్బందికి వివ‌రించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో న‌కిలీ మందుల ఊసే త‌లెత్త‌కూడ‌ద‌న్నారు. అన్ని మందుల షాపులను నిరంత‌రం త‌నిఖీలు చేస్తూనే ఉండాల‌ని చెప్పారు.  న‌కిలీ మందుల త‌యారీ, అమ్మ‌కం... లాంటి చ‌ట్ట వ్య‌తిరేక చ‌ర్య‌లు ఎక్క‌డ జ‌రుగుతున్నా ప‌సిగ‌ట్టేలా డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు ప‌నిచేయాల‌ని చెప్పారు. అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. కాలం తీరిన మందులు ఎక్క‌డా క‌నిపించ‌రాద‌ని చెప్పారు. ప్ర‌తి డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్ ప్ర‌తి నెలా క‌నీసం 50కిపైగా మెడిక‌ల్ షాపుల‌ను త‌నికీ చేయ‌డం ల‌క్ష్యంగా పెట్టుకోవాల‌ని తెలిపారు. నిబంధ‌న‌లు పాటించ‌ని వారి లైసెన్సులు ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్ల‌డ్ బ్యాంకుల‌పై ప‌లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయ‌ని, అలాంటి వాటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని చెప్పారు. ర‌క్త‌దాన శిబిరాలు నిర్వ‌హించ‌ని బ్ల‌డ్ బ్యాంకులను గుర్తించాల‌న్నారు. ర‌క్త‌నిల్వ‌లు, ప్లేట్ లెట్స్ లాంటి వాటిని ప్ర‌భుత్వం నిర్దేశించిన ధ‌ర‌ల‌కే మాత్ర‌మే అమ్మేలా చూడాల‌ని చెప్పారు. అధిక ధ‌ర‌ల‌కు కొంత‌మంది ర‌క్త‌పు నిల్వ‌లు అమ్ముకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ప్ర‌తి బ్ల‌డ్ బ్యాంకులో ధ‌ర‌ల ప‌ట్టిక ఉండేలా చూడాల‌ని ఆదేశించారు. అన్ని బ్ల‌డ్ బ్యాంకుల్లో డ్ర‌గ్స్ విభాగం ప‌ర్య‌వేక్ష‌ణ పూర్తి స్థాయిలో ఉండాల‌ని చెప్పారు. ర‌క్త సేక‌ర‌ణ‌, నిల్వ కేంద్రాల్లో న‌ర్సుల స్థానంలో ల్యాబ్ టెక్నీషియ‌న్ల‌ను వినియోగిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని, ఇలా జ‌ర‌గ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేశారు. నిబంధ‌న‌లు లేకుండా ఇష్టానుసారంగా క్లినిక‌ట్‌ట్రైల్స్ నిర్వ‌హంచే వారిపై ఓ క‌న్నేసి ఉంచాల‌న్నారు. 

నిజాయితీగా ప‌నిచేయండి

రాష్ట్రంలోని డ్ర‌గ్ విభాగం అధికారులంతా నిజాయితీగా ప‌నిచేయాల‌ని చెప్పారు. నిజాయితీగా ప‌నిచేసే అధికారుల‌కు త‌మ ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. లైసెన్సుల జారీ, రెన్యువ‌ల్ లాంటి విష‌యాల్లో పూర్తి పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు. మందుల త‌యారీ కంపెనీల స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించేలా చొర‌వ చూపాల‌న్నారుర‌.  డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్లు చొర‌వ‌చూపితే త‌క్కువ ధ‌ర‌ల‌కే మందులుప్ర‌జ‌ల‌కు అందించే వీలు ఏర్ప‌డుతుంద‌ని పేర్కొన్నారు. కొన్నిషాపులు రాయితీకి మందులు విక్ర‌యిస్తుంటార‌ని, వారికి వీలైన‌ప్పుడు మిగిలిన షాపుల‌కు ఎందుకు వీలు కల‌గ‌కుండా ఉంటుంద‌ని ప్ర‌శ్నించారు. జ‌న‌రిక్ మందుల షాపుల సంఖ్య‌ను పెంచేలా మ‌న ప్ర‌భుత్వం ముందుకు వెళుతోంద‌ని తెలిపారు.

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి

డ్ర‌గ్ విభాగం అధికారులు రీజ‌న‌ల్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటు, డ్ర‌గ్ ఇన్‌స్పెక్ట‌ర్ల‌కు వాహ‌నాల కేటాయింపు లాంటి కొన్ని స‌మ‌స్య‌లు మంత్రి ముందుకు తీసుకురాగా.. ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రానికి కృషి చేస్తాన‌ని బ‌దులిచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ‌ను ప్రాధాన్య అంశంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిగా భావిస్తున్నార‌ని, ఈ శాఖ ద్వారా ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌లు అందించేందుకు సీఎం కృషి చేస్తున్నార‌ని తెలిపారు. దేశంలో ఎక్క‌డా లేని వైద్య విధానాన్ని ఏపీలో నెల‌కొల్పే దిశ‌గా త‌మ ప్ర‌భుత్వం శ‌ర‌వేగంగా ముందుకు వెళుతున్న‌ద‌ని చెప్పారు.

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image