నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండోదశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలన్న సీఎం.

 

అమరావతి (ప్రజా అమరావతి);


*విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*



*నాడు–నేడుతో పాటు విద్యాశాఖకు సంబంధించి గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు, పనుల ప్రగతిపై సమీక్ష నిర్వహించిన సీఎం.* 


*సమావేశంలో సీఎంకు వివరాలందించిన అధికారులు.*

ప్రతి మండలానికి రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు ప్రక్రియపై సీఎంకు వివరించిన అధికారులు.

రూ.8 వేల కోట్లతో సుమారు 23,975 స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ కింద సమూల మార్పులు చేపడుతున్నామన్న అధికారులు.

ఈ నెల 20న గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌ యాప్‌ను లాంఛ్‌ చేస్తున్నామన్న అధికారులు.

ఇంగ్లిషు భాష అభ్యసనం, ఫొనిటిక్స్‌ కోసం ఈ ప్రత్యేక యాప్‌ రూపొందించామన్న అధికారులు.

ఈ యాప్‌ సమగ్రమైన ఇంగ్లిషు భోధనకు ఉపయోగకరంగా ఉంటుందన్న అధికారులు.

గూగుల్‌ సహకారంతో యాప్‌ను రూపొందించామన్న అధికారులు. 

అమ్మఒడికు బదులుగా 8.21 లక్షల మంది విద్యార్ధులు లాప్‌ టాప్‌ ఆప్షన్‌ ఎంచుకున్నారని తెలిపిన అధికారులు.

నాడు–నేడులో భాగంగా ఇప్పటివరకు 33వేల అదనపు తరగతులు అందుబాటులోకి వచ్చాయన్న అధికారులు.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...* 

స్కూల్స్‌ నాడు–నేడు రెండో దశ పనులపై సీఎం సమీక్ష.

సుమారు 23,975  వేల స్కూళ్లలో నాడు–నేడు రెండో దశ కింద పనులు.

నెల రోజుల్లోగా నూటికి నూరు శాతం రెండోదశ కింద చేపట్టనున్న అన్ని స్కూళ్లలో పనులు ప్రారంభం కావాలన్న సీఎం.




*గోరుముద్ద కార్యక్రమం పై సీఎం సమీక్ష.*

టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుమద్ద కార్యక్రమాల పై మరింత ధ్యాస పెట్టాలన్న సీఎం

సమర్ధవంతంగా, నాణ్యతతో అమలు చేయాలి, అప్పుడే ఆశించిన లక్ష్యాలను చేరుకుంటాం.

టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్, గోరుముద్ద అమలను మరింత మెరుగ్గా ఎలా చేయవచ్చో ఆలోచన చేయండన్న సీఎం.


గతంలో రాష్ట్రంలో సుమారు 400 జూనియర్‌ కళాశాలలు మాత్రమే ఉండేవి.

ఇవాళ ఏకంగా 1200 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం

బాలికలకు ప్రత్యేకంగా మండలానికి ఒక జూనియర్‌ కళాశాల లేదా కేజీబీవీ లేదా హైస్కూల్‌ ప్లస్‌ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నామన్న సీఎం

దీన్ని అందరికీ తెలిసేలా విస్తృతంగా చెప్పాలన్న సీఎం

తద్వారా వినియోగించుకునే అవకాశాలు మెరుగుపడతాయన్న సీఎం.


స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పన, బాత్రూమ్‌ల నిర్వహణ వంటివి సమర్ధవంతంగా నిర్వహించాలి.

దీని కోసం పక్కాగా ఎస్‌ఓపీలు ఉండాలన్న సీఎం. 


*జగనన్న విద్యా కానుక పై సీఎం సమీక్ష.*

విద్యాకానుక కిట్‌ నాణ్యతలో ఎక్కడా రాజీపడొద్దన్న సీఎం

పంపిణీకి సర్వం సన్నద్ధంగా ఉండాలన్న సీఎం

జూలై4 నాటికి జగనన్న విద్యాకానుక ప్రారంభానికి సకలం సన్నద్ధం చేస్తామన్న అధికారులు.


*అమ్మఒడి పైనా సమీక్ష.* 

జూన్‌లో అమ్మఒడి.

ఈ మేరకు సన్నద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశం.


*ఏడాదిలో ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు ప్రావీణ్యం..*

కాకినాడ జిల్లా తొండంగి మండలం, బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధుల ఇంగ్లిషు ప్రతిభను సీఎం దృష్టికి తీసుకొచ్చిన అధికారులు.

ఇంగీషు భాషపై బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధులు మంచి పట్టు సాధించారని తెలిపిన అధికారులు.


*మీ స్ఫూర్తితోనే ఇంగ్లిషులో ప్రావీణ్యం : బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధులు* 

 సమావేశంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌తో ముచ్చటించిన బెండపూడి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్ధులు.

సీఎం సమక్షంలో అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడిన విద్యార్ధులు. 

ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం బోధన వంటి గొప్ప కార్యక్రమాల ద్వారా మీరే మాకు స్ఫూర్తిగా నిల్చారన్న విద్యార్ధులు.

విభజన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఇబ్బందులున్నా.. ఇన్ని గొప్ప పథకాలు ప్రవేశపెడుతున్నారని... మీ వల్లే ఇంత గొప్పగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుకోగలుగుతున్నామన్న ఎనిమిదో తరగతి విద్యార్ధిని తేజస్విని.

తన చెల్లాయితో కలిసి కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న డబ్బులు రూ.929ను సీఎంకు విరాళంగా ఇచ్చిన తేజస్విని.

తేజస్వినికి గుర్తుగా కేవలం రూ.19 తీసుకుని.. మిగిలిన డబ్బులు తేజస్వినికే ఇచ్చిన సీఎం.


ఇంగ్లిషులో మంచి ప్రావీణ్యం సంపాదించిన బెండపూడి విద్యార్ధులను అభినందించిన సీఎం.


బెండపూడి హైస్కూల్‌ ఇంగ్లిషు టీచర్‌ ప్రసాద్‌ పిల్లలకు  నేర్పించిన ఇంగ్లిషు బోధనా విధానాన్ని ఎస్‌ఓపీగా రూపొందించాలన్న సీఎం. 

రాష్ట్రంలో అన్ని స్కూళ్లలో ఈ తరహా లెర్నింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టేలా చూడాలన్న సీఎం.

ఫొనిటిక్స్‌పై ప్రస్తుతం రీసెర్చ్‌ చేస్తున్న వారిని ఇందులో భాగస్వామ్యులను చేయాలన్న సీఎం.

భాష సమగ్రంగా నేర్చుకోవడంలో యాక్సెంట్, డైలెక్ట్‌ చాలా ప్రధానమైన అంశాలు 

దీనిపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలన్న సీఎం.

గూగుల్‌ రీడ్‌ ఎలాంగ్‌.. యాప్‌ ప్రతి టీచర్‌ మొబైల్‌లో ఉండేలా చూడాలి.

ఇంగ్లిషు టీచర్‌ ప్రసాద్‌ లాంటి వాళ్లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న సీఎం.


సమీక్షా సమావేశానికి హాజరైన విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ,  పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, సర్వశిక్షా అభయాన్‌ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు.

Comments