ప్రతి శనివారం నియోజకవర్గ స్థాయిలో స్పందన - కలెక్టర్ బసంత కుమార్

 ప్రతి  శనివారం నియోజకవర్గ స్థాయిలో స్పందన

- కలెక్టర్  బసంత కుమార్



పుట్టపర్తి, మే 23 (ప్రజా అమరావతి);


పాలన వికేంద్రీకరణ లో భాగంగా ఏర్పాటైన నూతన జిల్లాల యంత్రాంగం ప్రజలతో మమేకమైయ్యే దిశలో  ప్రతి శనివారం నియోజకవర్గ స్థాయి లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్  బసంత కుమార్  పేర్కొన్నారు. సోమవారం   పుట్టపర్తిలోని కలెక్టరేట్ నుంచి వన్టైమ్ సెటిల్మెంట్, నవరత్నాలు-  పేదలందరికీ ఇల్లు, స్పందన గ్రీవెన్స్,  ఎన్ఆర్ఈజీఎస్ కింద చేపట్టిన వివిధ భవన నిర్మాణాలు, ఉపాధి హామీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం, జల్ జీవన్ మిషన్, రెవెన్యూ తదితర అంశాలపై పెనుగొండ సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, తహసీల్దార్ లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, మండలస్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం కింద చేపట్టిన ఎస్ డబ్ల్యూ పిసి షెడ్లు నిర్మాణం వేగంగా చేపట్టాలన్నారు. నిర్మాణంలో ఉన్న ఆయా షెడ్లను వెంటనే పూర్తి చేయాలని, పూర్తయిన ఆయా షెడ్లలో వర్మి బెడ్ ను ఏర్పాటు చేయాలని, వర్మీ కంపోస్ట్ తయారీ మొదలు పెట్టాలన్నారు. ప్రతి మండలంలో రెండు గ్రామాలను ఎంపిక చేసి ఆయా పంచాయతీలలో end-to-end యాక్టివిటీ కింద పనులు పూర్తిచేసి జే ఎస్ ఎస్ యాప్ తడి చెత్త పొడి చెత్త  వేరు చేసి వాటిని మంచి ధరకు  అమ్మి వచ్చిన నగదును ప్రత్యేక యాప్ నమోదు చేయవలసిందిగా ఎంపీడీవో లను ఆదేశించారు ప్రతి ఎంపిడిఓ, ఈవోపీఆర్డీ కచ్చితంగా రోజుకి ఒక గంట చెత్త సంపద కేంద్రం లోని పనితీరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.  చెత్త సంపదతయారీ కేంద్రం వద్ద  పరిశుభ్రంగా ఉండాలని.     చెత్త సంపద తయారీకేంద్రాల వద్ద  శ్రీ సత్య సాయి జిల్లా  నామకరణ  తో బోర్డులు ఉండాలని ఎంపిడివో ఆదేశించారు.ప్రస్తుతం వర్షాకాలం లో  కేంద్రాల వద్ద చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు  ఈనెల 28వ తేదీన  ధర్మవరం డివిజన్లో శనివారం రోజున స్పందన కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. మరల శనివారం, పెనుగొండ, మ మరల శనివారం కదిరి, మరల  శనివారం పుట్టపర్తి డివిజన్ కేంద్రాలలో  స్పందన కార్యక్రమం  నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆయా డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.  హౌసింగ్ లేఔట్లలో ఇళ్ల నిర్మాణం ముమ్మరం చేయాలని, ఇందులో ఇంకా మొదలు కాని మరియు బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అలాగే బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలన్నారు. రోజువారీగా లక్ష్యాలను చేరుకోవాలని, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎక్స్పెండిచర్ ఖర్చు పూర్తయ్యేలా చూడాలన్నారు.పనులు పూర్తిచేసిన వాటికి బిల్లులు వెంటనే పంపాలన్నారు.స్పందన గ్రీవెన్స్ కి సంబంధించి గడువు తీరిన సమస్యలు ఒక్కటి కూడా పెండింగ్ ఉంచడానికి వీలులేదని, సున్నా చేయాలన్నారు. స్పందన గ్రీవెన్స్ అర్జీలకు సకాలంలో నాణ్యతగా అర్జీదారుడుని సంప్రదించి పరిష్కారం చూపించాలన్నారు. 

ఎపిఓఎల్-సిఎంఎస్ ( ఆంధ్ర ప్రదేశ్ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్) పోర్టల్ లో అన్ని శాఖలు ఇంకా లాగిన్ అవ్వలేదని, వెంటనే అన్ని శాఖలు ఖచ్చితంగా లాగిన్ కావాలన్నారు. కోర్టు కేసులు, కంటెంప్ట్ కేసులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఎపిఓఎల్-సిఎంఎస్ పోర్టల్ లో లాగిన్ కావడం ద్వారా కోర్టులో ఎవరైనా కేసు నమోదు చేస్తే వెబ్సైట్లో నమోదు చేసిన వెంటనే కేసు వివరాలు మనకి తెలుస్తాయన్నారు. పోర్టల్ వెబ్సైట్లో కేసు డేటా ఎంట్రీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడే వివరాలు అధికారులు చూసుకునే వీలు ఉంటుందని, ఈ పోర్టల్  కోర్ట్ కేసుల గురించి తెలుసుకునేందుకు ఎంతో ముఖ్యమన్నారు. ఈ పోర్టల్ నిత్యం ఉపయోగించాలని, ఈ పోర్టల్ లో లాగిన్ కోసం ఆరు రకాల వివరాలు అందించాలన్నారు. అందులో ఆయా శాఖలకు సంబంధించి నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (హెచ్ఓడి), డిసిగ్నేషన్, ఎంప్లాయ్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ లాంటి వివరాలు అందించాలని, ఆయా శాఖలు వివరాల అందజేత విషయమై పోర్టల్ ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. ఆయా శాఖలు వివరాలను అందిస్తే 24 గంటల్లోగా ఎపిఓఎల్-సిఎంఎస్ పోర్టల్ లో లాగిన్ పూర్తి చేయడం చేస్తామన్నారు. దీనిద్వారా హైకోర్టు కేసుల్లో మనం ఏం చేయాలో త్వరితగతిన తెలుస్తుందని, ప్రతి శాఖ అధికారులు వివరాలు అందజేయాలని ఆదేశించారు.*


*ఇక నుంచి అన్ని శాఖల ఫైల్స్ ఈఆఫీస్ లో మాత్రమే పంపించాలి :*


*ఇక నుంచి అన్ని శాఖలకు సంబంధించి ఫైల్స్ ఈఆఫీస్ లో మాత్రమే పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. తమ వద్దకు ఎలాంటి ఫిజికల్ ఫైల్స్ తీసుకు రాకూడదన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖలు మ్యానువల్ గా ఫైల్స్ సర్కులేట్ చేస్తున్నాయని, ఇకపై అలా చేయరాదన్నారు. ఈఆఫీస్ పద్ధతిలో మాత్రమే ఫైల్స్ పంపించాలని, ఇందుకు సంబంధించి ఏమైనా కార్యాలయ పేర్లు, అధికారుల వివరాలలో మార్పులు, చేర్పులు ఉంటే డిఐఓ ద్వారా వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డిజిటల్ కీ గడువు పూర్తి అయిన వారు వెంటనే ఆ డిజిటల్ కీలను రెన్యూవల్ చేయించడం లాంటివి డిఐఓ ద్వారా చేయించాలని సూచించారు. ఈఆఫీస్ పద్ధతి పట్ల ప్రతి ఒక్కరు అలర్ట్ గా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు..

జగన్  తోడు పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక వేగవంతం చేయాలని అందుకు  ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు  డి ఆర్ డి ఎ సిబ్బంది, మెప్మా   సిబ్బంది  గ్రామ వార్డు  సచివాలయ సంక్షేమ అధికారులు చురుకైన పాత్ర వహించాలని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో  డిఆర్ఓ గంగాధర్ గౌడ్,  ఆర్డిఓ భాగ్యరేఖ, మీసేవ తాసిల్దార్ అనుపమ,  డిఆర్డిఏ పిడి నరసయ్య. dwmapd విజయ ప్రసాద్, డి పి ఓ విజయ్  కుమార్. ఇతర శాఖ అధికారులు తదితరులు  పాల్గొన్నారు

 

Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image