జిల్లా గ్రంథాలయ సంస్థ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ 'శివ శంకర్'
నరసరావుపేట, మే 14 ( ప్రజా అమరావతి) : శనివారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ ఎల్. శివ శంకర్ నరసరావుపేట, పలనాడు బస్టాండ్ వద్ద గల జిల్లా గ్రంథాలయ సంస్థ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రంధాలయాన్ని పరిశీలించిన అనంతరం అక్కడ ఉన్న పుస్తకాలు వివరాలు, పోటీపరీక్షలకు ఉన్న పుస్తకాలు, మౌలిక సదుపాయాలు పై సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బల్లలు, విద్యుత్ సరఫరా అంశములను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేయాలని దానికి సంబంధించి జాబితాను సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపించాలని తదనుగుణంగా నిధులు విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. గ్రంథాలయంలో ఫ్లోరింగ్ సరిగా లేకపోవడం గుర్తించిన ఆయన వెంటనే మరమ్మతులు చేయాలని సిబ్బందికి ఆయన సూచించారు. గ్రంథాలయానికి వచ్చిన విద్యార్థులు తిరిగి వెనక్కి వెళ్లకుండా ఉండేలా వారికి అవసరమైన అన్ని వసతులు, పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట మండల రెవెన్యూ అధికారి శ్రీ రమణ నాయక్, గ్రంథాలయ సంస్థ సిబ్బంది వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment