ఆటలతోనే ఆనందం

 విజయవాడ (ప్రజా అమరావతి);


ఆటలతోనే ఆనందం 


🏃‍♀️🧘‍♂️🏃‍♂️🏏🏹🥊🏋️🤸‍♀️🏃‍♂️

శనివారం రాష్ట్రం లోని క్రీడా మైదానాలు , ఇండోర్ స్టేడియాలు సందడిగా మారాయి . ఆనంద శనివారాన్ని నిర్వహించాలని శాప్ ఎండీ ఎన్. ప్రభాకర రెడ్డి  ఇచ్చిన ఆదేశాలతో  రాష్ట్రం లోని మైదానాలన్ని  క్రీడాకారులతో కళకళ లాడాయి .  సుమారు 15000 వేలకు పైగా యువత మైదానాల్లో సందడి చేసింది . ఆనందాన్ని , ఆరోగ్యాన్ని ఆటల్లో వెతుక్కుంటూ చిన్నారులతో సహా పెద్దలు కూడా మైదానాలకు పరుగులు తీశారు . చిన్న విశ్యాలకే కుంగుబాటుకు గురవుతున్న యువతకు ఆటలే స్ఫూర్తి నింపుతాయి .కరోనాతో గడ్డి మైదానాలను వదిలి నాలుగు గోడలకే పరిమితం అయిన బాల్యం .. మానసికంగా , శారీరకంగా దుర్బలమవుతోంది .బాలల సంపూర్ణ ఎదుగుదలకు , ఏకాగ్రత , పోరాటపటిమ , చురుకుదనం , సహనం వంటివి క్రీడల ద్వారానే అలవాడుతాయని గుర్తించిన శాప్ అందరిని మైదానాల వైపు మళ్లించేందుకు అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది . లీగ్స్ , టోర్నమెంట్లు నిర్వహిస్తూనే  గ్రామాల నుంచి పట్టణాల వరకు స్పోర్ట్స్ క్లబ్బుల ఏర్పాటుకు  కంకణం కట్టుకుంది . వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ద్వారా రాష్ట్రంలో సుమారు 1850 కేంద్రాల్లో 18వేలకు పైగా క్రీడాకారులు 48 క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్నారు . ఈ నేపథ్యం లోనే హ్యాపీ శనివారం పేరుతో వారాంతంలో క్రీడాకారులను , చిన్నారులు , యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని శాప్ చేపట్టింది . హ్యాపీ శనివారం కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది . రాష్ట్ర ప్రభుత్వం మైదానాల్లో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తోంది . క్రీడాకారులకు అనేక రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తోంది . క్రీడా శాఖ మంత్రి ఆర్కే  రోజా , శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి , ముఖ్య కార్యదర్శి జి . వాణి మోహన్ , శాప్ బోర్డు సభ్యుల సహకారంతో  రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నాం . భవిషత్తు లో రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడా కారులను అందించడమే లక్ష్యంగా స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఆంధ్రప్రదేశ్ పనిచేస్తోంది .

Comments