జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవచ్చు

 


రాజమహేంద్రవరం, (ప్రజా అమరావతి);


* జిల్లాలో సొంత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోవచ్చు



* జిల్లాలో ఏర్పాటుకి  అనుకూలమైన వాతావరణం గల పరిశ్రమలను గుర్తించండి


* పారిశ్రామిక రంగం ద్వారా వ్యాపార అభివృద్ధికి ప్రోత్సాహకాలు


..కలెక్టర్ డా. కె మాధవిలత


 జిల్లా లో  సొంత పరిశ్రమల స్థాపనతో పాటు వారి వ్యాపారాభివృద్దికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహ‌కాల‌ను అందిస్తున్నాయని జిల్లా కలెక్టరు డా.కె.మాధవిలత అన్నారు. రాష్ట్రంలో సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.


బుధవారం స్థానిక కలెక్టరేట్  సమావేశ మందిరంలో జిల్లాలో పారిశ్రామిక రంగం అభివృద్ధిపై జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో అనుబంధ శాఖలైన ట్రాన్స్ పోర్టు, ఏపీఐఐసీ, మత్స్యశాఖ, ఏపీఈపిడిసిఎల్, ఏపీపీసిబి,  గ్రౌండ్ వాటర్, చిన్న తరహా పరిశ్రమలు  ఇతర శాఖల అధికారులు, పలు ఏజెన్సీలతో  కలెక్టర్  చర్చించారు.


ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత  మాట్లాడుతూ,  జిల్లాలో మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీ   వర్గాలకు చెందిన  ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు  పారిశ్రామిక రంగంలోకి అడుగుపెట్టి, వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు చేయూత నందించాలన్న లక్ష్యంతో కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నా య‌న్నారు. జిల్లాలో ఏర్పాటుకి  అనుకూలమైన వాతావరణం గల పరిశ్రమలను గుర్తించి, నివేదిక అందచేయాలని, ఆయా రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఆసక్తి ఉన్న వారు నూతన పరిశ్రమలు స్థాపించి వ్యాపారం రంగంలో అభివృద్ది సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తద్వారా మరి కొందరికి ఉపాధి కల్పన కల్పించాలని అనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.  నూతన పాలసీ ప్రకారం పియంఈజీపి, స్టాండప్ ఇండియా వంటి కేంద్ర ప్ర‌భుత్వ పథకాలతో పాటు,  జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 45 శాతం, కేంద్రం 25 శాతం సబ్సిడి  మొత్తం రూ. 70 లక్షల వరకు రాయితీని  అందిస్తుందన్నారు.  పరిశ్రమల స్థాపనకు అర్హత గల వారందరూ ముందుకు వచ్చి వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ మేరకు పరిశ్రమస్థాపించాలనే ఆసక్తి అర్హులైన వారందరూ ఈ పథకాలు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.


జిల్లాలో ఈ ఏడాది పరిశ్రమల శాఖ ద్వారా 60 యూనిట్లు స్థాపనలు ఏర్పాటు కు లక్ష్యం గా  నిర్ణయించామని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఈ మేరకు తగిన ప్రతిపాదనలు, ప్రాజెక్ట్ రిపోర్ట్ లతో  సొంత పరిశ్రమల స్థాపనకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.  ప్రధానమంత్రి  ఎంప్లాయ్మెంట్ జనరేషన్ పథకం కింద(PMEGP) యూనిట్ విలువ మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ కు రూ. 25 లక్షలు, సర్వీస్ సెంటర్ కు గాను రూ.10 లక్షలుగా ఉంటుందన్నారు. ఓసి పురుషులకు అర్బన్ ప్రాంతంలో 15 శాతం, రూరల్ ప్రాంతంలో 25% శాతం, సబ్సిడీ కాగా లబ్ధిదారులు కంట్రిబ్యూషన్ 10 శాతం ఉండాలన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, ఉమెన్, మైనారిటీస్, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అర్బన్ ప్రాంతంలో 25 శాతం రూరల్ ప్రాంతంలో 35 శాతం, లబ్ధిదారులు కంట్రిబ్యూషన్  5 శాతం గా నిర్ణయించారన్నారు. సొంత వ్యాపారం చేసుకునే వారికి బ్యాంకర్లు రుణ సహాయంగా అందిస్తారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో ఏ ఏ పరిశ్రమలు అనువుగా ఉంటాయో ముందుగానే అటు వంటి ప్రాంతాలలో యూనిట్లు ఎంపికకు పర్యవేక్షణ అవసరమని జిల్లా పరిశ్రమల శాఖ అధికారికి కలెక్టర్ సూచించారు


తొలుత జిల్లాలో పరిశ్రమల శాఖ ద్వారా చేపట్టి అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా పరిశ్రమల అధికారి డి. వెంకటేశ్వరరావు సమావేశంలో అధికారులకు సభ్యులకు వివరించారు.


సమావేశంలో జిల్లా ఎస్సీ వెల్ఫేర్ మరియు ఎంపవర్మెంట్ అధికారిని ఎమ్మెస్ శోభారాణి చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ శ్రీనివాస్, ఏపీ ఈపీడీసీఎల్ అధికారి శామ్యూల్ వివిధ శాఖల అధికారులు, ఇండస్ట్రీస్ అసోసియేషన్ అడ్వైజర్ ఎం. వెంకట్రావు, డిక్కీ కోఆర్డినేటర్ వై రాజీవ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.



Comments
Popular posts
వైసీపీఎమ్మెల్యేల దాడి ముమ్మాటికీ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
Image
విద్యుత్ సంస్థలను ప్రైవేటుపరం చెయ్యం... • రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి • ప్రభుత్వ రంగంలోనే విద్యుత్ సంస్థలు • ఉచిత విద్యుత్ కొనసాగించి తీరుతాం... • రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు • విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... : మంత్రి శ్రీనివాసరెడ్డి సచివాలయం (prajaamaravati), అక్టోబర్ 28 : విద్యుత్ సంస్థలను ప్రైవేటు పరం చేసే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సంస్థలను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని, ఎటువంటి దుష్ప్రచారాలు నమ్మొద్దని కోరారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ రంగానికి సంబందించి ఏ సమస్యనైనe సానుకూలంగా పరిష్కరించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల కోసం పనిచేస్తామని, ఏ సమస్యనైనా సామరస్యంగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమ్మతితోనే మీటర్ల ఏర్పాటు... తమది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు మేలుకలుగజేసేలా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎప్పటిలాగే రైతులకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. పగడి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను అందజేస్తామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని శాశ్వతం చేయాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని. రాబోయే 30 ఏళ్ల పాటు నిరాటంకంగా పథకాన్ని అమలు చేసేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ అవసరాల కోసమే 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతున్నామన్నారు. వ్యవసాయ ఫీడర్లను మెరుగుపర్చేందుకు ఇప్పటికే రూ.1,700 కోట్లు మంజూరు చేశామన్నారు. మీటర్ల ఏర్పాటుపై .రైతులను పక్కదారిపట్టించేలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల రైతులపై ఎటువంటి ఆర్థిక భారం పడదన్నారు. రైతుల ఖాతాల్లో ముందుగానే విద్యుత్ వాడకానికి సంబంధించిన ఛార్జీలు జమచేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాల్లో మీటర్ల ఏర్పాటుపై రైతుల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టామన్నారు. రైతుల సమ్మతితోనే మీటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిస్కమ్ లకు సంపూర్ణ సహకారం... విద్యుత్ రంగాన్ని క్షేత్ర స్థాయి నుంచి పటిష్ఠపర్చడంలో భాగంగా రికార్డు స్థాయిలో ఒకేసారి 7,000 మంది లైన్ మెన్లను నియమించామని మంత్రి తెలిపారు. మరో 172 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నియామకం పూర్తిచేశామన్నారు. శాఖాపరంగానే గాక వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ చర్యలు దోహదపడతాయన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. విద్యుత్ రంగానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.17,904 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో బిల్లుల చెల్లింపునకు మరో రూ.20,384 కోట్లు విడుదల చేసిందన్నారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి.... విద్యుత్ సంస్థలు, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర సత్వర సర్వతోముఖాభివృద్ధికి కీలకమైన విద్యుత్తు రంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ 2020 నెలలకు సంబంధించి కొవిడ్ కారణంగా పెండింగ్ లో ఉన్న జీతాలు త్వరలో చెల్లిస్తామన్నారు. విద్యుత్ రంగ పరిస్థితిపై నివేదిక అందించామని, అదనంగా ఏ వివరాలు ఏం కావాలన్నా ఇస్తామని తెలిపారు. RTPP ని అమ్మేస్తామని వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని, తమ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశమే లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సవరణ బిల్లు 2020ను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని, ఇప్పటికే కేంద్రానికి లేఖ కూడా పంపామని మంత్రి వెల్లడించారు. 1-2-1999 నుంచి 31-08-2004 మధ్య నియమించిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్, పెన్షన్ సౌకర్యం విషయం లో ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. 1/02/1999 నుంచి 31/08/2004 మధ్య నియమించిన ఉద్యోగుల కోసం EPF నుండి GPF సౌకర్యం అమలు కోసం 02/10/2020న ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారని, దీనిపైనా సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ / కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ కు జీతాలు నేరుగా ఇచ్చేందుకు సంబంధించి కూడా ట్రాన్స్ కో సీఎండీ ప్రభుత్వానికి పంపారన్నారు. ప్రభుత్వం ఈ విషయంపై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం ఇది కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి నేరుగా జీతాలు చెల్లించే విషయం ముఖ్యమంత్రి గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడికల్ ఇన్ వాలిడేషను నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా, A.P. ట్రాన్స్ కో ఇప్పటికే T.O.O (28-11-2008) తేదీన జారీ చేసిందన్నారు. పెండింగులో ఉన్న నియామకాలపై సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి క్యాష్ లెస్ వైద్య విధానాని కి సంబంధించి కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. APGENCO, APTRANSCO & AP DISCOM లలోని అన్ని ట్రస్టులలో ADVISORY కమిటీ సభ్యత్వం ఇస్తామన్నారు. APPCC లో HR నిర్ణయాలు JAC తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎనర్జీ అసిస్టెంట్స్ (జెఎల్ఎమ్ గ్రేడ్ -2) మరణించిన రెగ్యులర్ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాలకు అనుమతిలిచ్చామన్నారు. ఓ అండ్ ఎం సిబ్బందికి 9వ పెయిడ్ హాలిడే ఆదేశాలిచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు సాంకేతికంగా దేశంలోనే అత్యంత సమర్థులని, ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల పాత్రను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారు చేసే సేవలను అభినందిస్తూనే ఉన్నామని తెలిపారు. ముఖ్యంగా కొవిడ్ సమయంలోనూ బ్రహ్మాండంగా పని చేస్తున్నారని, విద్యుత్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివని, ఎంతటి కష్టకాలంలో నైనా సిబ్బంది అందిస్తున్న సేవలు ప్రసంశనీయమని మంత్రి బాలినేసి శ్రీనివాసరెడ్డి కొనియాడారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఏపీ జెన్ కో ఎండి శ్రీధర్, సీఎండీలు ఎస్.నాగలక్ష్మి, హరనాథ్ రావు, పద్మ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగ జేఏసీతో మంత్రి శ్రీనివాసరెడ్డి చర్చలు... అంతకుముందు సచివాలయంలోని తన కార్యాలయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాని మంత్రిని ఉద్యోగ జేఏసీ నాయకులు కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ఎపిడిసిఎల్ సీఎండీ నాగలక్ష్మి,, ఆయా విద్యుత్తుశాఖ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులు, విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు చంద్రశేఖర్, వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.
Image
ప్రగల్బాలు పలికిన మంత్రి పెద్దిరెడ్డి ఒక చేతగాని దద్దమ్మ
Image
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.
Image
సమన్వయంతో పనిచేయాలి.. పనుల్లో వేగం పెంచాలి
Image