శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి,
విజయవాడ (ప్రజా అమరావతి):
ఈరోజు అనగా ది.08-05-2022 న మంగళగిరి కి చెందిన శ్రీ రావెల శేఖర్ బాబు గారు మరియు కుటుంబసభ్యులు సుమారు 960 గ్రాములు బరువు కలిగిన వెండి నగిషీ ప్లేటు -1 ను శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారిని కలిసి దేవస్థానమునకు కానుకగా అందజేసినారు. ఆలయ అధికారులు దాత కుటుంబమునకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించి, అనంతరము శ్రీ అమ్మవారిశేషవస్త్రం, ప్రసాదములు అందజేసినారు.
addComments
Post a Comment